

- కర్నూలు జిల్లా పర్యటనకు వచ్చిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీశైలం ఆలయాన్ని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా శ్రీశైలం అర్చకులు, ఆలయ అధికారులు ప్రధాని మోదీకి ఘన స్వాగతం పలికారు.
- ఈ సందర్భంగా భ్రమరాంబ, మల్లికార్జున స్వామివారికి ప్రధాని మోదీ పూజలు చేశారు. పంచామృతాలలో మల్లికార్జునస్వామికి రుద్రాభిషేకం.. భ్రమరాంబదేవికి ఖడ్గమాల, కుంకుమార్చన పూజలు నిర్వహించారు.
- పూజలు నిర్వహించిన తర్వాత శివాజీ స్ఫూర్తి కేంద్రాన్ని సందర్శించిన ప్రధాని మోదీ అక్కడ ఉన్న శివాజీ దర్బార్ హాల్, ధ్యాన మందిరాలను తిలకించారు. ఈ సందర్భంగా కొద్దిసేపు నరేంద్ర మోదీ ధ్యానం చేశారు.
- ఈ పర్యటనలో ప్రధాని మోదీ వెంట ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఉన్నారు. అనంతరం.. ముగ్గురు నేతలు కలిసి సభా ప్రాంగణానికి చేరుకుని ప్రసంగించారు.


