పంజాబ్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్‌కు షాక్!

Date:

ఐపీఎల్ 2026లో గుజరాత్ టైటాన్స్‌తో మ్యాచ్ అనంతరం పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్‌కు ఐపీఎల్ నిర్వాహకులు రూ. 12 లక్షల భారీ జరిమానా విధించారు. నిర్ణీత సమయంలోగా ఓవర్ల కోటాను పూర్తి చేయకపోవడంతో అతడిపై చర్యలు తీసుకున్నారు. ఈ మేరకు స్లో ఓవర్ రేట్ నమోదైనందుకు ఈ మొత్తాన్ని జరిమానాగా విధించారు. దీంతో ప్రస్తుత సీజన్‌లో ఫైన్ ఎదుర్కొన్న తొలి కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్ నిలిచాడు.

ఐపీఎల్ 2026ను గత సీజన్ రన్నరప్ పంజాబ్ కింగ్స్ విజయంతో ఆరంభించింది. తమ తొలి మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్‌ను ఆ జట్టు మూడు వికెట్ల తేడాతో ఓడించింది. అయితే ఈ మ్యాచ్ తర్వాత పంజాబ్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ‌కు ఐపీఎల్ నిర్వహకులు షాక్ ఇచ్చారు. స్లో ఓవర్ రేటు నమోదు చేసినందుకు గానూ.. ఫైన్ విధించారు. ఈ ఎడిషన్‌లో శ్రేయస్ అయ్యర్ నమోదు చేసిన తొలి స్లో ఓవర్‌ రేటు నమోదు ఇదే. దీంతో ఐపీఎల్‌ ప్రవర్తనా నియమావళిలో ఆర్టికల్‌ 2.22 నిబంధన ప్రకారం రూ. 12 లక్షల ఫైన్‌ విధించింది.

కాగా ఐపీఎల్ 2026లో బాగంగా మంగళవారం పంజాబ్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచులో గుజరాత్ టైటాన్స్ తొలుత బ్యాటింగ్ చేసింది. అయితే ఇన్నింగ్స్ చివరి ఓవర్‌లో పంజాబ్ కింగ్స్ బౌలర్ అర్షదీప్ సింగ్‌ ఏకంగా నాలుగు వైడ్లు వేశాడు. దానికి అదనంగా ఒక నోబాల్ కూడా వేశాడు. దీంతో ఆ ఓవర్‌లో మొత్తంగా 11 బంతులు విసిరాడు. ఫలితంగా పంజాబ్ కింగ్స్ నిర్ణత సమయంలోగా 20 ఓవర్ల కోటాను పూర్తి చేయలేకపోయింది. దీంతో ఈ మ్యాచ్‌లో స్లో ఓవర్ రేటు నమోదైంది. దీనిపై కెప్టెన్ శ్రేయస్ అయ్యర్‌కు రూ.12 లక్షల జరిమానా పడింది. ఫలితంగా ఐపీఎల్ 2026లో ఫైన్ ఎదుర్కొన్న తొలి కెప్టెన్‌గా శ్రేయస్ నిలిచాడు.

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

Hyderabad: ఆర్‌ఆర్‌ఆర్‌ ఉత్తర భాగంపై కీలక అప్డేట్.. 2 ప్యాకేజీలుగా మార్పు, టెండర్లకు ఆహ్వానం

రీజినల్ రింగ్ రోడ్డు (ఆర్‌ఆర్‌ఆర్‌) ఉత్తర భాగం పనులపై కీలక అప్డేట్...

ఏపీలో రిలయన్స్‌ డేటాసెంటర్‌.. చంద్రబాబు సర్కార్ భారీ ప్రోత్సాహకాలు, ఏకంగా వేల కోట్లు!

విజయనగరం జిల్లాలో ఏర్పాటు చేయనున్న రిలయన్స్ డేటా సెంటర్‌కు ఏపీ ప్రభుత్వం...

మాట నిలబెట్టుకున్న టీడీపీ ఎమ్మెల్యే గల్లా మాధవి.. పదో తరగతి విద్యార్థులకు విమాన ప్రయాణం

టీడీపీ ఎమ్మెల్యే గల్లా మాధవి.. తాను ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు. కొన్ని...

తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్.. 5 లక్షల బీమా, 2 లక్షల కొత్త ఫించన్లు, ఇంకా మరెన్నో.. రేవంత్ సర్కార్ జూన్ 2 బిగ్ ప్లాన్..!

రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జూన్ 2న ప్రజలకు శుభవార్తలు చెప్పేందుకు...