వైభవ్ సూర్యవంశీని వెంటనే ఇంగ్లండ్ టూర్‌కి సెలెక్ట్ చేయండి.. బీసీసీఐకి మైకేల్ వాన్ అర్జెంట్ రిక్వెస్ట్

Date:

ఐపీఎల్ బాస్ బేబీ వైభవ్ సూర్యవంశీ రికార్డుల మీద రికార్డులు సృష్టిస్తున్నాడు. గతేడాది ఐపీఎల్‌లో 35 బంతుల్లో సెంచరీ చేసిన వైభవ్.. ఈ ఏడాది ఆరంభంలోనే 15 బంతుల్లో హాఫ్ సెంచరీ నమోదు చేశాడు. వైభవ్ సూర్యవంశీ ఆటను చూసిన మైకెల్ వాన్ అర్జెంట్‌గా ఇంగ్లండ్ టూర్‌కి తీసుకురావాలంటూ బీసీసీఐకి సూచించాడు. సీనియర్ జట్టుతో కలిసి ఉండటం వైభవ్‌కు చాలా అవసరమని, ఆడినా ఆడకపోయినా జట్టులో ఉంచాలంటూ వాన్ చెప్పాడు.

ఐపీఎల్ సంచలన స్టార్ బ్యాటర్ వైభవ్ సూర్యవంశీ ఆటతీరుకు అంతర్జాతీయ స్థాయిలో ప్రశంసలు అందుతున్నాయి. కేవలం 15 ఏళ్ల వయస్సులోనే వైభవ్ ఆడుతున్న తీరు ప్రపంచ దిగ్గజ బ్యాటర్లను సైతం ఆశ్చర్యపరుస్తోంది. ఐపీఎల్ 2025లో సెంచరీతో పాటు ఐపీఎల్ 2026 ఆరంభ మ్యాచ్‌లో హాఫ్ సెంచరీతో ప్రత్యర్థి బౌలర్లకు కొరకరాని కొయ్యగా మారాడు. వైభవ్ ఆటకు ఫ్యాన్ అయిపోయిన ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైకేల్ వాన్ .. వెంటనే టీమిండియాలోకి తీసుకోవాలంటూ బీసీసీఐకు రిక్వెస్ట్ చేశాడు.

గువాహటి వేదికగా చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సూర్యవంశీ కేవలం 17 బంతుల్లోనే 52 పరుగులు చేసి, పూర్తిగా మ్యాచ్‌ని వన్ సైడ్ చేశాడు. మరో ఓపెనర్ యశస్వి జైస్వాల్ 36 బంతుల్లో 38 పరుగులే చేశాడు. ఈ మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ 127 పరుగులకే ఆలౌట్ కాగా.. రాజస్థాన్ రాయల్స్ కేవలం 12.1 ఓవర్లలోనే 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

హైడ్రా భారీ ఆపరేషన్‌.. రూ.15 వేల కోట్ల 863 ఎకరాల రక్షణకు చర్యలు.. 6 అంతస్తుల బిల్డింగ్ కూల్చివేత

హైదరాబాద్‌లో హైడ్రా అధికారులు మరో భారీ ఆపరేషన్ చేపట్టారు. ఏకంగా రూ.15...

తిరుమలలో రికార్డు స్థాయిలో పెరిగిన లడ్డూ ప్రసాదం విక్రయాలు.. ఏడాదిలో ఎన్నో తెలుసా!

తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదాల అమ్మకాలు రికార్డు స్థాయిలో పెరిగాయి. 2025-2026కు...

అమరావతి ఔటర్ రింగ్ రోడ్డులో 19 చోట్ల ఇంటర్‌ఛేంజ్‌లు.. ఎక్కడెక్కడ వస్తాయంటే!

ఏపీ రాజధాని అమరావతి ఔటర్ రింగ్ రోడ్డులో 19 ఇంటర్‌ఛేంజ్‌లు ప్లాన్...

ఉద్యోగులకు మళ్లీ నిరాశే.. జీపీఎఫ్ వడ్డీ రేట్లు ప్రకటన.. ఇప్పుడు ఎంత శాతమంటే

కేంద్ర ప్రభుత్వం ఇటీవల స్మాల్ సేవింగ్స్ స్కీమ్స్ వడ్డీ రేట్లను సవరించిన...