
ఐపీఎల్ బాస్ బేబీ వైభవ్ సూర్యవంశీ రికార్డుల మీద రికార్డులు సృష్టిస్తున్నాడు. గతేడాది ఐపీఎల్లో 35 బంతుల్లో సెంచరీ చేసిన వైభవ్.. ఈ ఏడాది ఆరంభంలోనే 15 బంతుల్లో హాఫ్ సెంచరీ నమోదు చేశాడు. వైభవ్ సూర్యవంశీ ఆటను చూసిన మైకెల్ వాన్ అర్జెంట్గా ఇంగ్లండ్ టూర్కి తీసుకురావాలంటూ బీసీసీఐకి సూచించాడు. సీనియర్ జట్టుతో కలిసి ఉండటం వైభవ్కు చాలా అవసరమని, ఆడినా ఆడకపోయినా జట్టులో ఉంచాలంటూ వాన్ చెప్పాడు.
ఐపీఎల్ సంచలన స్టార్ బ్యాటర్ వైభవ్ సూర్యవంశీ ఆటతీరుకు అంతర్జాతీయ స్థాయిలో ప్రశంసలు అందుతున్నాయి. కేవలం 15 ఏళ్ల వయస్సులోనే వైభవ్ ఆడుతున్న తీరు ప్రపంచ దిగ్గజ బ్యాటర్లను సైతం ఆశ్చర్యపరుస్తోంది. ఐపీఎల్ 2025లో సెంచరీతో పాటు ఐపీఎల్ 2026 ఆరంభ మ్యాచ్లో హాఫ్ సెంచరీతో ప్రత్యర్థి బౌలర్లకు కొరకరాని కొయ్యగా మారాడు. వైభవ్ ఆటకు ఫ్యాన్ అయిపోయిన ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైకేల్ వాన్ .. వెంటనే టీమిండియాలోకి తీసుకోవాలంటూ బీసీసీఐకు రిక్వెస్ట్ చేశాడు.
గువాహటి వేదికగా చెన్నై సూపర్ కింగ్స్తో జరిగిన మ్యాచ్లో సూర్యవంశీ కేవలం 17 బంతుల్లోనే 52 పరుగులు చేసి, పూర్తిగా మ్యాచ్ని వన్ సైడ్ చేశాడు. మరో ఓపెనర్ యశస్వి జైస్వాల్ 36 బంతుల్లో 38 పరుగులే చేశాడు. ఈ మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ 127 పరుగులకే ఆలౌట్ కాగా.. రాజస్థాన్ రాయల్స్ కేవలం 12.1 ఓవర్లలోనే 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.

