తలలో పేలు పోవాలంటే పాటించాల్సిన సింపుల్‌ చిట్కాలు

Date:

తలలో పేలు చాలా వేగంగా రెట్టింపవుతాయి. తొలుత ఇవి రాకుండానే చూసుకోవాలి కానీ ఓసారి వచ్చాయంటే మాత్రం అంత తేలికగా వదిలి పెట్టవు. ఒకరి నుంచి మరొకరికి వ్యాపిస్తూ ఉంటాయి. పేలున్న వ్యక్తి వాడిన దువ్వెన మరొకరు వాడడం, పక్కపక్కనే నిద్రపోవడం వల్ల పేలు ఒకరి నుంచి మరొకరికి సులభంగా వ్యాపిస్తాయి. తల్లో పేలుంటే తలలో బాగా దురద వస్తుంది. ముఖ్యంగా తల వెనక భాగంలో కూడా దురద వస్తుంది. పేలు ఎక్కువైతే తల చర్మంపై ఎర్రని మచ్చలు ఏర్పడుతాయి. మరి వీటిని సులభంగా ఎలా పరిష్కరించుకోవచ్చో తెలుసుకుందాం.

తలలో పేలు ఉంటే మహా చిరాకుగా ఉంటుంది. పైగా పేలు ఒక్కసారి వచ్చాయంటే అంత సులువుగా వదిలిపోవు. రోజురోజుకూ పెరుగుతూ పోతూనే ఉంటాయి. వదిలించుకోవడానికి ఎన్ని ప్రయత్నాలు చేసినా అంతకంటే వేగంగా మళ్లీ మళ్లీ పుట్టుకొస్తూనే ఉంటాయి. తొలగించడానికి చాలానే శ్రమ పడాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఒక్కసారి పేలు వచ్చాయంటే దెబ్బ తింటుంది. దీంతో జుట్టు రాలిపోతూ ఉంటుంది. అన్నింటికంటే ముఖ్యంగా తరచూ తలలో దురద పెడుతూ ఉంటుంది. ఇలాంటి సమయంలో పేలు పోగొట్టేందుకు పాటించాల్సిన సులువైన, సహజమైన పద్ధతులు ఏంటో తెలుసుకుందాం.

ఈ వేప నూనె తలలో పేలు సమస్యకు అత్యంత ప్రభావవంతమైన పరిష్కారం. వేపనూనెలో యాంటీ బ్యాక్టీరియల్ మరియు యాంటీ మైక్రోబియల్ లక్షణాలు ఉన్నాయి. అంతే కాకుండా అజాడిరాక్టిన్‌ అనే పదార్థం కూడా ఉంటుంది. ఇవన్నీ పేలను చంపడమే కాకుండా గుడ్లు పెట్టకుండా నిరోధిస్తుంది. వారంలో రెండు లేదా మూడు రోజులు రాత్రి పడుకునే ముందు వేప నూనెను జుట్టు మూలాలకు బాగా అప్లయ్‌ చేయాలి. మరుసటి రోజు ఉదయం షాంపూతో తల స్నానం చేస్తే పేలు సమస్య తగ్గుముఖం పడుతుంది. అలాగే వేప ఆకులను మెత్తగా నూరి తలకు ప్యాక్‌లా వేసి గంట తర్వాత గోరువెచ్చని నీటితో స్నానం చేస్తే కూడా చుండ్రు వంటి సమస్యలు తగ్గుతాయని పేర్కొంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

హైడ్రా భారీ ఆపరేషన్‌.. రూ.15 వేల కోట్ల 863 ఎకరాల రక్షణకు చర్యలు.. 6 అంతస్తుల బిల్డింగ్ కూల్చివేత

హైదరాబాద్‌లో హైడ్రా అధికారులు మరో భారీ ఆపరేషన్ చేపట్టారు. ఏకంగా రూ.15...

తిరుమలలో రికార్డు స్థాయిలో పెరిగిన లడ్డూ ప్రసాదం విక్రయాలు.. ఏడాదిలో ఎన్నో తెలుసా!

తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదాల అమ్మకాలు రికార్డు స్థాయిలో పెరిగాయి. 2025-2026కు...

అమరావతి ఔటర్ రింగ్ రోడ్డులో 19 చోట్ల ఇంటర్‌ఛేంజ్‌లు.. ఎక్కడెక్కడ వస్తాయంటే!

ఏపీ రాజధాని అమరావతి ఔటర్ రింగ్ రోడ్డులో 19 ఇంటర్‌ఛేంజ్‌లు ప్లాన్...

ఉద్యోగులకు మళ్లీ నిరాశే.. జీపీఎఫ్ వడ్డీ రేట్లు ప్రకటన.. ఇప్పుడు ఎంత శాతమంటే

కేంద్ర ప్రభుత్వం ఇటీవల స్మాల్ సేవింగ్స్ స్కీమ్స్ వడ్డీ రేట్లను సవరించిన...