ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లో భారత బ్యాటర్ల హవా..!

Date:

ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026లో విజేతగా నిలిచిన భారత్.. టీ20 ర్యాంకింగ్స్‌లోనూ అదరగొట్టింది. ఐసీసీ తాజాగా విడుదల చేసిన ర్యాంకింగ్స్‌లో భారత బ్యాటర్లు దుమ్మురేపారు. ముఖ్యంగా బ్యాటింగ్‌లో టీమిండియా ఆటగాళ్లు అదరగొట్టారు. టాప్‌-10లో ఏకంగా నలుగురు బ్యాటర్లు చోటు దక్కించుకున్నారు. తొలి రెండు స్థానాల్లోనూ మనోళ్లే స్థానం సంపాదించారు. ఇక బౌలర్ల ర్యాంకింగ్‌లో వరుణ్ చక్రవర్తి అగ్రస్థానాన్ని కోల్పోయాడు. రెండో స్థానానికి పడిపోయాడు.

టీ20 ప్రపంచకప్ 2026 ఫైనల్‌లో హాఫ్ సెంచరీతో అదరగొట్టిన అభిషేక్ శర్మ .. అగ్రస్థానాన్ని నిలబెట్టుకున్నాడు. 875 రేటింగ్ పాయింట్లతో అతడు తొలి స్థానంలో నిలిచాడు. మరోవైపు భారత బ్యాటర్ ఇషాన్ కిషన్.. రెండు స్థానాలు మెరుగుపర్చుకుని రెండో ర్యాంక్‌కు చేరుకున్నాడు. అతడి ఖాతాలో ప్రస్తుతం 871 రేటింగ్ పాయింట్లు ఉన్నాయి. ఇక టీ20 ప్రపంచకప్ 2026లో రెండు సెంచరీలు చేసిన పాకిస్థాన్‌కు చెందిన సాహిబ్‌జాదా ఫర్హాన్.. 848 పాయింట్లతో మూడో స్థానంలో నిలిచాడు. ఇంగ్లాండ్‌కు చెందిన ఫిల్ సాల్ట్‌ (792 రేటింగ్ పాయింట్లు) నాలుగో స్థానానికి పడిపోయాడు.

తెలుగు క్రికెటర్ తిలక్ వర్మ (742) ఒక స్థానం కోల్పోయి ఏడో ర్యాంకులో నిలిచాడు. ప్లేయర్ ఆఫ్ ది టోర్నీగా నిలిచిన సంజూ శాంసన్ ఏకంగా (637 రేటింగ్ పాయింట్లు) ఏకంగా 18 స్థానాలు ఎగబాకి 22వ ర్యాంకుకు చేరుకున్నాడు. శివమ్‌ దూబే (606) కూడా నాలుగు ర్యాంకులు పైకొచ్చి 27వ స్థానంలో కొనసాగుతున్నాడు.

ఇక టీ20 ప్రపంచకప్ 2026లో 14 వికెట్లు తీసినప్పటికీ.. వరుణ్ చక్రవర్తి మాత్రం బౌలర్ల ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానాన్ని కోల్పోయాడు. ఫైనల్‌లో కేవలం ఒక్క వికెట్ మాత్రమే తీసి కాస్త ఎక్కువగా పరుగులు సమర్పించాడు. దీంతో అతడి పాయింట్లలో కోత పడింది. ఇదే సమయంలో అప్ఘానిస్థాన్‌ స్టార్ స్పిన్నర్ రషీద్ ఖాన్ (753) అగ్రస్థానానికి ఎగబాకాడు. వరుణ్ చక్రవర్తి ఏకంగా 68 పాయింట్లను కోల్పోవడం గమనార్హం. భారత పేసు గుర్రం జస్‌ప్రీత్ బుమ్రా (702) ఒక స్థానం మెరుగుపర్చుకుని ఆరో ర్యాంకుకు చేరాడు. అర్ష్‌దీప్‌ సింగ్ 16వ ర్యాంకు, అక్షర్ పటేల్ 17వ ర్యాంకులో ఉన్నారు. ఆల్‌రౌండర్ల ర్యాంకింగ్స్‌లో జింబాబ్వే కెప్టెన్ సికందర్ రజా (328),హార్దిక్ పాండ్య (299) తొలి రెండు స్థానాల్లో ఉన్నారు.

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

హైడ్రా భారీ ఆపరేషన్‌.. రూ.15 వేల కోట్ల 863 ఎకరాల రక్షణకు చర్యలు.. 6 అంతస్తుల బిల్డింగ్ కూల్చివేత

హైదరాబాద్‌లో హైడ్రా అధికారులు మరో భారీ ఆపరేషన్ చేపట్టారు. ఏకంగా రూ.15...

తిరుమలలో రికార్డు స్థాయిలో పెరిగిన లడ్డూ ప్రసాదం విక్రయాలు.. ఏడాదిలో ఎన్నో తెలుసా!

తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదాల అమ్మకాలు రికార్డు స్థాయిలో పెరిగాయి. 2025-2026కు...

అమరావతి ఔటర్ రింగ్ రోడ్డులో 19 చోట్ల ఇంటర్‌ఛేంజ్‌లు.. ఎక్కడెక్కడ వస్తాయంటే!

ఏపీ రాజధాని అమరావతి ఔటర్ రింగ్ రోడ్డులో 19 ఇంటర్‌ఛేంజ్‌లు ప్లాన్...

ఉద్యోగులకు మళ్లీ నిరాశే.. జీపీఎఫ్ వడ్డీ రేట్లు ప్రకటన.. ఇప్పుడు ఎంత శాతమంటే

కేంద్ర ప్రభుత్వం ఇటీవల స్మాల్ సేవింగ్స్ స్కీమ్స్ వడ్డీ రేట్లను సవరించిన...