నగరవాసులకు జీహెచ్ఎంసీ శుభవార్త.. ఆస్తి పన్ను చెల్లింపులకు 90 శాతం రాయితీ, ఈనెల 31 వరకే ఛాన్స్

Date:

హైదరాబాద్ వాసులకు జీహెచ్ఎంసీ అధికారులు భారీ శుభవార్త చెప్పారు. ఆస్తి పన్ను చెల్లింపులకు సంబంధించి కీలక ప్రకటన వెలువరించారు. ఈనెల 31 లోపు ఆస్తి పన్ను చెల్లించే వారికి.. ఆస్తి పన్నుపై ఉన్న వడ్డీలో 90 శాతం రాయితీ ఇవ్వనున్నట్లు తెలిపారు. ఆన్‌లైన్‌లో ఆస్తి పన్ను బకాయిలను చెల్లించాలని సూచించారు. గడువు దాటిన తర్వాత పూర్తి వడ్డీని వసూలు చేయనున్నట్లు స్పష్టం చేశారు.

 నగర పరిధిలో ఉన్న ఆస్తులకు సంబంధించిన పన్ను చెల్లింపుల బకాయిలు పేరుకుపోవడంతో.. వాటిని వసూలు చేసే పనిలో పడింది. ఈ నేపథ్యంలోనే ఈ 2025-26 ఆర్థిక సంవత్సరం ముగియనుండగా.. ఆలోగా వీలైనంత ఎక్కువ పెండింగ్ బకాయిలను వసూలు చేయాలని నిర్ణయించింది. ఈ క్రమంలోనే నగరవాసులకు భారీ ఉపశమనం కల్పించే వార్తను చెప్పింది. పెండింగ్‌ ఆస్తి పన్ను బకాయిల చెల్లింపునకు వన్ టైమ్ సెటిల్‌మెంట్ (ఓటీఎస్) పథకాన్ని అమలు చేస్తోంది.

గత కొంతకాలంగా పెండింగ్‌లో ఉన్న ఆస్తి పన్ను బకాయిలను ఈనెల 31వ తేదీలోపు చెల్లిస్తే.. దానిపై ఉన్న వడ్డీలో 90 శాతం రాయితీ ఇవ్వనున్నట్లు వెల్లడించింది. ఇక జీహెచ్ఎంసీ ఆఫీసులకు నగరవాసులు వచ్చి పన్ను చెల్లించే అవసరం లేకుండా సులభంగా ఇంటి దగ్గరే ఉండి కూడా బకాయిలు చెల్లించేందుకు జీహెచ్‌ఎంసీ అధికారులు పలు అవకాశాలను అందుబాటులోకి తీసుకువచ్చారు.

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

చక్కెర లేకుండానే మఖానా కీర్.. ఇంట్లో ఈజీగా ఎలా తయారు చేయాలో తెలుసా?

మఖానా కీర్‌ను ఇష్టపడని వారు చాలా అరుదుగా ఉంటారు. రుచితో పాటు...

పాల ప్యాకెట్‌పై ఎక్స్‌పైరీ డేట్ ఒక్కటే చూస్తున్నారా? ఈ 4 వివరాలు తప్పక తెలుసుకోండి!

మనదేశంలోని చాలా కుటుంబాల్లో ఉదయం ఒక కప్పు టీ, కాఫీ లేదా...

11 లక్షల టికెట్లు అమ్మిన ‘ఇరుముడి’.. ‘పెద్ది’ రికార్డు ధ్వంసం!

మాస్ మహారాజా రవితేజ నటించిన ‘ఇరుముడి’ బాక్సాఫీస్ వద్ద బ్లాక్‌బస్టర్ టాక్‌తో...

“52 సెకన్లు కూడా ఆగలేకపోయారా?”: జాతీయ గీతాన్ని అవమానించిన యూపీ స్పీకర్‌పై ఫైర్

ఉత్తరప్రదేశ్ రాజకీయాల్లో మరో వివాదం చెలరేగింది. ఓ కార్యక్రమానికి హాజరైన రాష్ట్ర...