ఏపీకి కేంద్రం అదనపు సాయం.. హైలెవల్ కమిటీ ఆమోదం, ఆరు రాష్ట్రాలకు రూ.1929.99 కోట్లు

Date:

ఏపీకి కేంద్రం నుంచి అదనపు సాయానికి గ్రీన్‌సిగ్నల్ వచ్చింది. ఏపీ సహా ఆరు రాష్ట్రాలకు ప్రకృతి వైపరీత్యాల సహకారం కింద రూ.1929.99 కోట్లు అందించనున్నారు. కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌ షా అధ్యక్షతన జరిగిన ఉన్నత స్థాయి కమిటీలో నిర్ణయం తీసుకున్నారు. ఆంధ్రప్రదేశ్‌‌కు రూ.341.48 కోట్ల అదనపు సాయాన్ని అందించనున్నారు. ఈ నిధులతో ఏపీకి కొంత ఊరట దక్కనుంది.

ఆంధ్రప్రదేశ్‌కు కేంద్రం శుభవార్త చెప్పింది.. అదనపు ఆర్థిక సాయం ప్రకటించింది. ఏపీ సహా ఆరు రాష్ట్రాలకు మొత్తం రూ.1912.99 కోట్ల సాయం చేయడానికి కేంద్రం ఆమోదం తెలిపింది. ఆరు రాష్ట్రాలకు ప్రకృతి వైపరీత్యాల సహకారం కింద ఈ సాయం అందిస్తారు. కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా అధ్యక్షతన ఢిల్లీలో జరిగిన ఉన్నత స్థాయి కమిటీలో నిధులు విడుదల చేసేందుకు ఆమోదం తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌తో పాటుగా ఛత్తీస్‌గఢ్, గుజరాత్, హిమాచల్ ప్రదేశ్, జమ్మూకశ్మీర్‌, నాగాలాండ్‌లకు ఈ అదనపు సాయానికి ఉన్నత స్థాయి కమిటీ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. 2025లో మొంథా తుఫాన్, ఆకస్మిక వరదలతో ఆయా రాష్ట్రాలు నష్టపోయాయి. ఈ మేరకు ప్రభావిత రాష్ట్రాలకు కేంద్రం సాయాన్ని ప్రకటించింది. మొత్తం రూ.1912.99 కోట్లలో ఆంధ్రప్రదేశ్‌కు రూ.341.48 కోట్ల అదనపు సాయం అందించనున్నారు.

ఏపీకి రూ.341.48 కోట్లు, ఛత్తీస్‌గఢ్‌కు రూ.15.70 కోట్లు, గుజరాత్‌కు రూ.778.67 కోట్లు, హిమాచల్ ప్రదేశ్‌కు రూ.288.39 కోట్లు, నాగాలాండ్‌కు రూ.158.41 కోట్లు, జమ్మూ కాశ్మీర్‌కు రూ.330.04 కోట్లు ఇచ్చేందుకు ఆమోదం తెలిపారు. 2025-26 ఆర్థిక సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం 28 రాష్ట్రాలకు Rs. 20.735.20 కోట్లు.. 21 రాష్ట్రాలకు రూ.3,628 కోట్లు ఎన్డీఆర్‌ఎఫ్ కింద విడుదల చేసింది.

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

హైడ్రా భారీ ఆపరేషన్‌.. రూ.15 వేల కోట్ల 863 ఎకరాల రక్షణకు చర్యలు.. 6 అంతస్తుల బిల్డింగ్ కూల్చివేత

హైదరాబాద్‌లో హైడ్రా అధికారులు మరో భారీ ఆపరేషన్ చేపట్టారు. ఏకంగా రూ.15...

తిరుమలలో రికార్డు స్థాయిలో పెరిగిన లడ్డూ ప్రసాదం విక్రయాలు.. ఏడాదిలో ఎన్నో తెలుసా!

తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదాల అమ్మకాలు రికార్డు స్థాయిలో పెరిగాయి. 2025-2026కు...

అమరావతి ఔటర్ రింగ్ రోడ్డులో 19 చోట్ల ఇంటర్‌ఛేంజ్‌లు.. ఎక్కడెక్కడ వస్తాయంటే!

ఏపీ రాజధాని అమరావతి ఔటర్ రింగ్ రోడ్డులో 19 ఇంటర్‌ఛేంజ్‌లు ప్లాన్...

ఉద్యోగులకు మళ్లీ నిరాశే.. జీపీఎఫ్ వడ్డీ రేట్లు ప్రకటన.. ఇప్పుడు ఎంత శాతమంటే

కేంద్ర ప్రభుత్వం ఇటీవల స్మాల్ సేవింగ్స్ స్కీమ్స్ వడ్డీ రేట్లను సవరించిన...