తెలంగాణలో వంట గ్యాస్ కొరత.. మంత్రి ఉత్తమ్ కీలక వ్యాఖ్యలు

Date:

తెలంగాణలో వంట గ్యాస్ కొరత లేదని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తేల్చి చెప్పారు. గ్యాస్ కొరత అంటూ వస్తున్న అసత్య ప్రచారాన్ని నమ్మొద్దంటూ ప్రజలకు సూచించారు. రాష్ట్రంలో సరిపడా గ్యాస్ అందుబాటులో ఉందని.. ఎవరూ ఆందోళన చెందాల్సిన పని లేదని స్పష్టం చేశారు. ఇక వంట గ్యాస్‌ను బ్లాక్ మార్కెట్‌కు తరలిస్తే.. కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గ్యాస్ సిలిండర్ల సరఫరాపై నిఘా పెట్టాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

రాష్ట్రంలో వంట గ్యాస్ సరఫరాపై కీలక వ్యాఖ్యలు చేసిన తెలంగాణ పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి .. రాష్ట్రంలో ఎలాంటి వంట గ్యాస్ కొరత లేదని తేల్చి చెప్పారు. సచివాలయంలో సివిల్ సప్లై కమిషనర్, ఆయిల్ కంపెనీల ప్రతినిధులు, కలెక్టర్లతో మంత్రి ఉత్తమ్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. రాష్ట్రంలో వంట గ్యాస్ కొరత అంటూ వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని స్పష్టం చేశారు. రాష్ట్రంలో గృహ వినియోగానికి అవసరమైన గ్యాస్ సిలిండర్లు అందుబాటులో ఉన్నాయని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు.

గ్యాస్ సిలిండర్ల బుకింగ్ నిలిచిపోయిందంటూ వస్తున్న వార్తలను నమ్మి.. గ్యాస్ సరఫరాపై ఆందోళన పడాల్సిన అవసరం లేదని మంత్రి ఉత్తమ్ హామీ ఇచ్చారు. ప్రతి వంట గ్యాస్ వినియోగదారుడికి అవసరమైన గ్యాస్ సిలిండర్లను సరఫరా చేస్తామని మంత్రి భరోసా ఇచ్చారు. డొమెస్టిక్ గ్యాస్‌ సిలిండర్లను బ్లాక్ మార్కెట్‌కు పంపించి.. పక్కదారి తరలిస్తే కఠిన చర్యలు తీసుకోక తప్పదని ఉత్తమ్ కుమార్ రెడ్డి హెచ్చరించారు. అక్రమంగా గ్యాస్ అమ్మకాలు జరగకుండా ఎప్పటికప్పుడు నిఘాను ముమ్మరం చేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు. హాస్పిటల్స్, గవర్నమెంట్ హాస్టల్స్‌కు గ్యాస్ సిలిండర్ల సరఫరాలో ఎలాంటి అంతరాయం లేకుండా సరఫరా చేయాలని సంబంధిత అధికారులకు స్పష్టం చేశారు.

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

Hyderabad: ఆర్‌ఆర్‌ఆర్‌ ఉత్తర భాగంపై కీలక అప్డేట్.. 2 ప్యాకేజీలుగా మార్పు, టెండర్లకు ఆహ్వానం

రీజినల్ రింగ్ రోడ్డు (ఆర్‌ఆర్‌ఆర్‌) ఉత్తర భాగం పనులపై కీలక అప్డేట్...

ఏపీలో రిలయన్స్‌ డేటాసెంటర్‌.. చంద్రబాబు సర్కార్ భారీ ప్రోత్సాహకాలు, ఏకంగా వేల కోట్లు!

విజయనగరం జిల్లాలో ఏర్పాటు చేయనున్న రిలయన్స్ డేటా సెంటర్‌కు ఏపీ ప్రభుత్వం...

మాట నిలబెట్టుకున్న టీడీపీ ఎమ్మెల్యే గల్లా మాధవి.. పదో తరగతి విద్యార్థులకు విమాన ప్రయాణం

టీడీపీ ఎమ్మెల్యే గల్లా మాధవి.. తాను ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు. కొన్ని...

తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్.. 5 లక్షల బీమా, 2 లక్షల కొత్త ఫించన్లు, ఇంకా మరెన్నో.. రేవంత్ సర్కార్ జూన్ 2 బిగ్ ప్లాన్..!

రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జూన్ 2న ప్రజలకు శుభవార్తలు చెప్పేందుకు...