ఇరాన్ ఉన్నత సైనికాధికారులు మృతి.. స్వయంగా ప్రకటించిన ట్రంప్.. వీడియో విడుదల!

Date:

మధ్యప్రాచ్యంలో ఘర్షణలు తీవ్రమవుతున్న నేపథ్యంలో, టెహ్రాన్‌పై జరిగిన ఒక భారీ దాడిలో ఇరాన్‌కు చెందిన పలువురు ఉన్నత సైనికాధికారులు మరణించారని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు. తన సోషల్ మీడియా వేదికలో ఒక పోస్ట్‌లో ట్రంప్ ఈ ప్రకటన చేశారు. దానితో పాటు ఆయన ఒక వీడియోను షేర్ చేశారు. ఆ వీడియోలో చీకటి రాత్రి ఆకాశంలో ఒక పెద్ద పేలుడు, మంటలు కనిపిస్తున్నాయి.

ఆ ప్రాంతంలో యుద్ధం తీవ్రమవుతూ, పరిస్థితి దిగజారుతున్న తరుణంలో ట్రంప్ ఈ ప్రకటన చేశారు. అమెరికాతో ఒప్పందం కుదుర్చుకోకపోయినా, హోర్ముజ్ జలసంధిని తెరవకపోయినా తీవ్ర చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు ట్రంప్. ఇదిలావుంటే, డొనాల్డ్ ట్రంప్ గతంలో ఇరాన్‌కు 48 గంటల అల్టిమేటం జారీ చేశారు. ప్రపంచ చమురులో 20 శాతం దిగుమతి అయ్యే సముద్ర మార్గమే ఈ హోర్ముజ్ జలసంధి. దీనిని మూసివేయడం ప్రపంచవ్యాప్తంగా తీవ్రమైన చమురు కొరతకు దారితీసింది.

ఇదిలా ఉండగా, యుద్ధంలో తొలిసారిగా ఇరాన్‌లో ఒకే రోజు రెండు అమెరికా యుద్ధ విమానాలను కూల్చివేశారు. ఒక పైలట్‌ను రక్షించారు, మరొకరు గల్లంతయ్యారు. శత్రు భూభాగంలో అత్యంత సాహసోపేతమైన ‘మిషన్ ఇంపాజిబుల్’ ఆపరేషన్‌ చేపట్టిన తప్పిపోయిన అధికారిని సురక్షితంగా కాపాడారు. మరోవైపు అమెరికా ప్రభుత్వంపై స్థానికులు తీవ్ర నిరసనలు తెలుపుతున్నారు.

అమెరికా రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్, ఆర్మీ చీఫ్ జనరల్ రాండీ జార్జ్‌ను పదవి నుంచి తక్షణమే పదవీ విరమణ చేయమని కోరారు. దీని వెనుక గల కారణాలను బహిరంగపరచనప్పటికీ, యుద్ధంపై పెరుగుతున్న ఒత్తిడి, విమర్శల కారణంగానే ఈ నిర్ణయం తీసుకున్నారని భావిస్తున్నారు.

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

రెండ్రోజులుగా కనిపించని కర్ణాటక ఐఏఎస్ అధికారి యూపీలో ప్రత్యక్షం.. కారణం ఏంటో చెప్పిన సర్కారు!

గత రెండు రోజులుగా ఆచూకీ లేకుండా పోయారంటూ సామాజిక, వార్తా మాధ్యమాల్లో...

50 ఏళ్ల వయసులో బైక్‌పై సంచలనం.. చరిత్ర సృష్టించిన తెలంగాణ మహిళా డాక్టర్!

50 ఏళ్ల వయసులోనూ సాహసం.. లేహ్-లడఖ్ బైక్ యాత్రతో చరిత్ర సృష్టించిన...

కలుషిత బిర్యానీ తిన్న మహిళకు తీవ్ర అస్వస్థత.. కేఫ్‌కు రూ.96,500 జరిమానా వేసిన ఫోరం

వినియోగదారుల ఆరోగ్యంతో చెలగాటమాడుతూ కలుషిత ఆహారాన్ని విక్రయించిన కేరళలోని ఓ కేఫ్...

‘లిటిల్ ఫ్యాట్ బ్లాక్ షర్ట్’: కస్టమర్‌ను వెక్కిరిస్తూ బిల్లుపై నోట్ రాసిన కేఫ్ సిబ్బంది.. నెటిజెన్ల ఫైర్

బెంగళూరులోని ప్రముఖ ‘సబ్‌కో ది క్రాఫ్టరీ’ కేఫ్‌లో ఓ కస్టమర్‌కు చేదు...