US-Israel Iran War : చర్చల్లేవ్ తగ్గేదేలే అంటున్న ఇరాన్.. ఒకేసారి 7 దేశాలపై దాడులు.

Date:

ఇజ్రాయెల్-ఇరాన్ యుద్ధం మధ్యప్రాచ్యాన్ని అతలాకుతలం చేస్తోంది. కువైట్, ఖతర్, యూఏఈ, బహ్రెయిన్ వంటి గల్ఫ్ దేశాలపై దాడులు జరగడంతో అక్కడ ఉద్యోగాలు చేస్తున్న లక్షలాది మంది తెలుగువారు భయాందోళనల్లో గడుపుతున్నారు. ఆకాశంలో పేలుళ్ల దృశ్యాలను చూసి ఇక్కడ వారి కుటుంబసభ్యులు క్షణక్షణం భయంతో కాలం వెళ్లదీస్తున్నారు. ఈ సమయంలో మోదీ ఇజ్రాయెల్ ప్రధానితో మాట్లాడారు.

ఇజ్రాయిల్-ఇరాన్ వార్ భీకరంగా మారుతోంది. ఈ యుద్ధం కేవలం రెండు దేశాలకు మాత్రమే పరిమితం కాకుండా, మొత్తం మిడిల్ ఈస్ట్‌నే అతలాకుతలం చేస్తోంది. భారతీయులు.. ప్రత్యేకించి తెలుగువాళ్లు ఎక్కువగా నివసించే కువైట్, ఖతర్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, బహ్రెయిన్ వంటి దేశాలపైనా దాడులు జరిగాయి.

ఆకాశంలో పేలుతున్న దృశ్యాలు చూసి హైదరాబాద్ వాసులు భయప్రాంతాలకు గురవుతున్నారు.. ఉద్యోగ, ఉపాధి అవకాశాల కోసం తెలంగాణకు చెందిన లక్షల మంది గల్ఫ్‌ దేశాల్లో వివిధ పనులు చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నారు. యుద్ధం నేపథ్యంలో ఏ క్షణాన ఏ వార్త వినాల్సి వస్తుందో అన్న భయంతో గడుపుతున్నారు. ప్రస్తుతం గల్ఫ్‌ దేశాల్లో యుద్ధ మేఘాలు కమ్ముకోవడంతో అక్కడ ఉపాధి పొందుతున్న వారి బాధిత కుటుంబసభ్యుల్లో తీవ్ర ఆందోళన నెలకొని ఉంది.

మరోవైపు ఇరాన్‌తో యుద్ధంపై ట్రంప్‌ మరో ప్రకటన చేశారు. 9 ఇరాన్‌ యుద్ధనౌకలు సముద్రంలో మునిగిపోయాయని, ఇరాన్‌ నేవీ హెడ్‌క్వార్టర్స్‌ను కూడా ధ్వంసం చేశామన్నారు. మిగిలిన నౌకల వేట కూడా కొనసాగుతోందని.. ఇరాన్‌ నౌకాదళం మొత్తం నాశనమైందని తెలిపారు.

దాడుల్లో 48 మంది ఇరాన్‌ నేతలు చనిపోయారన్నారు. చమురు ధరల పెరుగుదలపై ఆందోళన వద్దని తెలిపారు ట్రంప్‌. ఇరాన్ నేతలు నాతో మాట్లాడాలని కోరుకుంటున్నారని, ఇరాన్‌తో చర్చలకు సిద్ధం అన్నారు ట్రంప్‌. చర్చల కోసం ఇరాన్‌ ముందే రావాల్సిందన్నారు ట్రంప్‌.

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

Hyderabad: ఆర్‌ఆర్‌ఆర్‌ ఉత్తర భాగంపై కీలక అప్డేట్.. 2 ప్యాకేజీలుగా మార్పు, టెండర్లకు ఆహ్వానం

రీజినల్ రింగ్ రోడ్డు (ఆర్‌ఆర్‌ఆర్‌) ఉత్తర భాగం పనులపై కీలక అప్డేట్...

ఏపీలో రిలయన్స్‌ డేటాసెంటర్‌.. చంద్రబాబు సర్కార్ భారీ ప్రోత్సాహకాలు, ఏకంగా వేల కోట్లు!

విజయనగరం జిల్లాలో ఏర్పాటు చేయనున్న రిలయన్స్ డేటా సెంటర్‌కు ఏపీ ప్రభుత్వం...

మాట నిలబెట్టుకున్న టీడీపీ ఎమ్మెల్యే గల్లా మాధవి.. పదో తరగతి విద్యార్థులకు విమాన ప్రయాణం

టీడీపీ ఎమ్మెల్యే గల్లా మాధవి.. తాను ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు. కొన్ని...

తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్.. 5 లక్షల బీమా, 2 లక్షల కొత్త ఫించన్లు, ఇంకా మరెన్నో.. రేవంత్ సర్కార్ జూన్ 2 బిగ్ ప్లాన్..!

రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జూన్ 2న ప్రజలకు శుభవార్తలు చెప్పేందుకు...