ఏపీలో పదవీ విరమణ వెంటనే కీలక పోస్టింగ్.. లక్ అంటే సీనియర్ IAS విజయానంద్‌దే

Date:

ఏపీలో సీనియర్ ఐఏఎలస్‌లకు సంబంధించి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సీఎస్‌గా పదవీ విరమణ చేసిన వెంటనే కె విజయానంద్‌కు ప్రభుత్వం కీలక బాధ్యతలు అప్పగించింది. ఆయన్ను సీఎంవోలోకి స్పెషల్ సీఎస్‌గా తీసుకున్నారు.. ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మొన్నటి వరకు సీఎం స్పెషల్ సీఎస్‌గా ఉన్న ముద్దాడ రవిచంద్రను టీటీడీ ఈవోగా పూర్తిస్థాయిలో బాధ్యతలు అప్పగించారు.

ఆంధ్రప్రదేశ్‌ సీఎస్‌గా విజయానంద్ పదవీవిరమణ చేసిన సంగతి తెలిసిందే. శనివారం రోజు ఆయన రిటైర్ అయ్యారు.. కొత్త సీఎస్‌గా సాయిప్రసాద్ బాధ్యతలు స్వీకరించారు. అయితే విజయానంద్ పదవీవిరమణ చేసిన కొన్ని గంటల్లోనే ఆయనకు కీలకమైన పోస్టింగ్ ఇచ్చారు. విజయానంద్‌ను ముఖ్యమంత్రికి ఎక్స్‌అఫీషియో ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా నియమించారు.. ఈ మేరకు వెంటనే ఉత్తర్వులు జారీ చేశారు. అలా పదవీ విరమణ చేశారో లేదో.. ఇలా ఆయన పునర్నియామకానికి సంబంధించిన ఉత్తర్వులు వచ్చేశాయి.

విజయానంద్ ఏపీ ఇంధనశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, ఏపీట్రాన్స్‌కో సీఎండీ పోస్టుల్లోను కొనసాగుతారని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఆయన ఏడాది లేదా తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు ఈ పోస్టులో కొనసాగుతారని ప్రభుత్వం క్లియర్‌గా చెప్పింది. అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబుకు ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఉన్న ముద్దాడ రవిచంద్రను టీటీడీ ఈవోగా బదిలీ చేశారు. తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వివాదానికి సంబంధించి టీటీడీ ఈవోగా ఉన్న అనిల్‌ కుమార్‌సింఘాల్‌ను బదిలీ చేసిన సంగతి తెలిసిందే. ముద్దాడ రవిచంద్రకు అదనపు బాధ్యతలు అప్పగించారు.. ఇప్పుడు సీఎంవోలో రవిచంద్ర స్థానంలో విజయానంద్‌కు పోస్ట్ ఇవ్వడంతో.. రవిచింద్రను టీటీడీకి పూర్తిస్థాయిలో ఈవోగా బదిలీ చేసింది ప్రభుత్వం.

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

హైడ్రా భారీ ఆపరేషన్‌.. రూ.15 వేల కోట్ల 863 ఎకరాల రక్షణకు చర్యలు.. 6 అంతస్తుల బిల్డింగ్ కూల్చివేత

హైదరాబాద్‌లో హైడ్రా అధికారులు మరో భారీ ఆపరేషన్ చేపట్టారు. ఏకంగా రూ.15...

తిరుమలలో రికార్డు స్థాయిలో పెరిగిన లడ్డూ ప్రసాదం విక్రయాలు.. ఏడాదిలో ఎన్నో తెలుసా!

తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదాల అమ్మకాలు రికార్డు స్థాయిలో పెరిగాయి. 2025-2026కు...

అమరావతి ఔటర్ రింగ్ రోడ్డులో 19 చోట్ల ఇంటర్‌ఛేంజ్‌లు.. ఎక్కడెక్కడ వస్తాయంటే!

ఏపీ రాజధాని అమరావతి ఔటర్ రింగ్ రోడ్డులో 19 ఇంటర్‌ఛేంజ్‌లు ప్లాన్...

ఉద్యోగులకు మళ్లీ నిరాశే.. జీపీఎఫ్ వడ్డీ రేట్లు ప్రకటన.. ఇప్పుడు ఎంత శాతమంటే

కేంద్ర ప్రభుత్వం ఇటీవల స్మాల్ సేవింగ్స్ స్కీమ్స్ వడ్డీ రేట్లను సవరించిన...