సంజూ సూపర్ ఇన్నింగ్స్.. సెమీస్‌ చేరిన భారత్.. వెస్టిండీస్ ఔట్..!

Date:

టీ20 ప్రపంచకప్ 2026లో భారత్.. సెమీఫైనల్‌లో అడుగుపెట్టింది. సూపర్-8లో తమ చివరి మ్యాచ్‌లో వెస్టిండీస్‌ను ఓడించి.. పాయింట్స్ టేబుల్‌లో రెండో స్థానంలోకి దూసుకెళ్లింది. గ్రూప్-1 నుంచి దక్షిణాఫ్రికాతో పాటు సెమీఫైనల్‌కు చేరుకుంది. టీమిండియా సెమీఫైనల్‌లో మార్చి 5న ఇంగ్లాండ్‌తో తలపడనుంది. మరో సెమీ ఫైనల్‌లో దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్ అమీతుమీ తేల్చుకోనున్నాయి.

టీ20 ప్రపంచకప్ 2026లో టీమిండియా సెమీఫైనల్ చేరింది. సూపర్-8లో వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. వర్చువల్ నాకౌట్ లాంటి మ్యాచ్‌లో సత్తాచాటి.. గ్రూప్-1 నుంచి సెమీస్ చేరిన రెండో జట్టుగా నిలిచింది. 196 పరుగులను డిఫెండ్ చేసుకోలేకపోయిన వెస్టిండీస్.. టోర్నీ నుంచి నిష్క్రమించింది. భారత జట్టు.. సెమీఫైనల్‌లో మార్చి 5న ఇంగ్లాండ్‌తో తలపడనుంది.

కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో ఈ మ్యాచ్ జరిగింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన వెస్టిండీస్.. నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 195 పరుగులు చేసింది. అనంతరం భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియాను.. ఓపెనర్ సంజూ శాంసన్ ఒంటి చేత్తో గెలిపించాడు. ఈ టోర్నీ ఆరంభంలో తుది జట్టులో చోటు కోల్పోయిన అతడు.. కీలకమైన మ్యాచ్‌లో అద్భుత ప్రదర్శన చేశాడు.

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

Hyderabad: ఆర్‌ఆర్‌ఆర్‌ ఉత్తర భాగంపై కీలక అప్డేట్.. 2 ప్యాకేజీలుగా మార్పు, టెండర్లకు ఆహ్వానం

రీజినల్ రింగ్ రోడ్డు (ఆర్‌ఆర్‌ఆర్‌) ఉత్తర భాగం పనులపై కీలక అప్డేట్...

ఏపీలో రిలయన్స్‌ డేటాసెంటర్‌.. చంద్రబాబు సర్కార్ భారీ ప్రోత్సాహకాలు, ఏకంగా వేల కోట్లు!

విజయనగరం జిల్లాలో ఏర్పాటు చేయనున్న రిలయన్స్ డేటా సెంటర్‌కు ఏపీ ప్రభుత్వం...

మాట నిలబెట్టుకున్న టీడీపీ ఎమ్మెల్యే గల్లా మాధవి.. పదో తరగతి విద్యార్థులకు విమాన ప్రయాణం

టీడీపీ ఎమ్మెల్యే గల్లా మాధవి.. తాను ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు. కొన్ని...

తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్.. 5 లక్షల బీమా, 2 లక్షల కొత్త ఫించన్లు, ఇంకా మరెన్నో.. రేవంత్ సర్కార్ జూన్ 2 బిగ్ ప్లాన్..!

రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జూన్ 2న ప్రజలకు శుభవార్తలు చెప్పేందుకు...