సంజూ సూపర్ ఇన్నింగ్స్.. సెమీస్‌ చేరిన భారత్.. వెస్టిండీస్ ఔట్..!

Date:

టీ20 ప్రపంచకప్ 2026లో భారత్.. సెమీఫైనల్‌లో అడుగుపెట్టింది. సూపర్-8లో తమ చివరి మ్యాచ్‌లో వెస్టిండీస్‌ను ఓడించి.. పాయింట్స్ టేబుల్‌లో రెండో స్థానంలోకి దూసుకెళ్లింది. గ్రూప్-1 నుంచి దక్షిణాఫ్రికాతో పాటు సెమీఫైనల్‌కు చేరుకుంది. టీమిండియా సెమీఫైనల్‌లో మార్చి 5న ఇంగ్లాండ్‌తో తలపడనుంది. మరో సెమీ ఫైనల్‌లో దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్ అమీతుమీ తేల్చుకోనున్నాయి.

టీ20 ప్రపంచకప్ 2026లో టీమిండియా సెమీఫైనల్ చేరింది. సూపర్-8లో వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. వర్చువల్ నాకౌట్ లాంటి మ్యాచ్‌లో సత్తాచాటి.. గ్రూప్-1 నుంచి సెమీస్ చేరిన రెండో జట్టుగా నిలిచింది. 196 పరుగులను డిఫెండ్ చేసుకోలేకపోయిన వెస్టిండీస్.. టోర్నీ నుంచి నిష్క్రమించింది. భారత జట్టు.. సెమీఫైనల్‌లో మార్చి 5న ఇంగ్లాండ్‌తో తలపడనుంది.

కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో ఈ మ్యాచ్ జరిగింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన వెస్టిండీస్.. నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 195 పరుగులు చేసింది. అనంతరం భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియాను.. ఓపెనర్ సంజూ శాంసన్ ఒంటి చేత్తో గెలిపించాడు. ఈ టోర్నీ ఆరంభంలో తుది జట్టులో చోటు కోల్పోయిన అతడు.. కీలకమైన మ్యాచ్‌లో అద్భుత ప్రదర్శన చేశాడు.

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

హైడ్రా భారీ ఆపరేషన్‌.. రూ.15 వేల కోట్ల 863 ఎకరాల రక్షణకు చర్యలు.. 6 అంతస్తుల బిల్డింగ్ కూల్చివేత

హైదరాబాద్‌లో హైడ్రా అధికారులు మరో భారీ ఆపరేషన్ చేపట్టారు. ఏకంగా రూ.15...

తిరుమలలో రికార్డు స్థాయిలో పెరిగిన లడ్డూ ప్రసాదం విక్రయాలు.. ఏడాదిలో ఎన్నో తెలుసా!

తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదాల అమ్మకాలు రికార్డు స్థాయిలో పెరిగాయి. 2025-2026కు...

అమరావతి ఔటర్ రింగ్ రోడ్డులో 19 చోట్ల ఇంటర్‌ఛేంజ్‌లు.. ఎక్కడెక్కడ వస్తాయంటే!

ఏపీ రాజధాని అమరావతి ఔటర్ రింగ్ రోడ్డులో 19 ఇంటర్‌ఛేంజ్‌లు ప్లాన్...

ఉద్యోగులకు మళ్లీ నిరాశే.. జీపీఎఫ్ వడ్డీ రేట్లు ప్రకటన.. ఇప్పుడు ఎంత శాతమంటే

కేంద్ర ప్రభుత్వం ఇటీవల స్మాల్ సేవింగ్స్ స్కీమ్స్ వడ్డీ రేట్లను సవరించిన...