లంచం కేసులో 13 ఏళ్ల తర్వాత సంచలన తీర్పు – విజయవాడ ఏసీబీ కోర్టు తీర్పు

Date:

విజయవాడలోని ప్రత్యేక అవినీతి నిరోధక (ఏసీబీ) కోర్టు 13 సంవత్సరాల పాటు సాగిన ₹1,500 లంచం కేసులో కీలక తీర్పు వెలువరించింది. ప్రభుత్వ ఆసుపత్రిలో ఏసీ మెకానిక్‌గా పనిచేసే వ్యక్తి నుంచి లంచం తీసుకున్న ఆరోపణలపై నిందితుడికి శిక్ష విధించింది.

పటమటకు చెందిన కె. వెంకట నాగబాబు ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో ఏసీ మరమ్మత్తుల పనులు చేసినందుకు బిల్లులు క్లియర్ చేయించుకునేందుకు ప్రయత్నించగా, ఆసుపత్రి అసిస్టెంట్ డైరెక్టర్ (అడ్మిన్) టి. శంకర్ రావు ₹1,500 లంచం కోరినట్లు ఆరోపణలు ఉన్నాయి.

2013లో లంచం ఇవ్వబోయే సమయంలో ఏసీబీ అధికారులు శంకర్ రాయిని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అనంతరం కేసు నమోదు చేసి విజయవాడ ప్రత్యేక ఏసీబీ కోర్టులో అభియోగ పత్రం దాఖలు చేశారు. కేసు విచారణ అనంతరం కోర్టు శంకర్ రాయిని దోషిగా తేల్చి 2 సంవత్సరాల కఠిన కారాగార శిక్షతో పాటు ₹6,000 జరిమానా విధించింది.

తక్కువ మొత్తంలో లంచం తీసుకున్నా కూడా చట్టం కఠినంగా వ్యవహరిస్తుందని ఏసీబీ అధికారులు ఈ తీర్పుతో మరోసారి స్పష్టం చేశారు.

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

Hyderabad: ఆర్‌ఆర్‌ఆర్‌ ఉత్తర భాగంపై కీలక అప్డేట్.. 2 ప్యాకేజీలుగా మార్పు, టెండర్లకు ఆహ్వానం

రీజినల్ రింగ్ రోడ్డు (ఆర్‌ఆర్‌ఆర్‌) ఉత్తర భాగం పనులపై కీలక అప్డేట్...

ఏపీలో రిలయన్స్‌ డేటాసెంటర్‌.. చంద్రబాబు సర్కార్ భారీ ప్రోత్సాహకాలు, ఏకంగా వేల కోట్లు!

విజయనగరం జిల్లాలో ఏర్పాటు చేయనున్న రిలయన్స్ డేటా సెంటర్‌కు ఏపీ ప్రభుత్వం...

మాట నిలబెట్టుకున్న టీడీపీ ఎమ్మెల్యే గల్లా మాధవి.. పదో తరగతి విద్యార్థులకు విమాన ప్రయాణం

టీడీపీ ఎమ్మెల్యే గల్లా మాధవి.. తాను ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు. కొన్ని...

తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్.. 5 లక్షల బీమా, 2 లక్షల కొత్త ఫించన్లు, ఇంకా మరెన్నో.. రేవంత్ సర్కార్ జూన్ 2 బిగ్ ప్లాన్..!

రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జూన్ 2న ప్రజలకు శుభవార్తలు చెప్పేందుకు...