న్యూయార్క్ విమానాశ్రయంలో ప్రమాదం.. రన్ వేపై ట్రక్కును ఢీకొట్టిన విమానం, పలువురికి గాయాలు

Date:

అమెరికాలోని అత్యంత రద్దీగా ఉండే న్యూయార్క్ లాగార్డియా విమానాశ్రయం రన్ వేపై ఆదివారం అర్ధరాత్రి ప్రమాదం చోటు చేసుకుంది. వంద మంది ప్రయాణికులతో సురక్షితంగా ల్యాండ్ కావాల్సిన ఎయిర్ కెనడా ఎక్స్‌ప్రెస్ విమానం.. రన్ వేపై ఉన్న అగ్నిమాపక వాహనాన్ని బలంగా ఢీకొట్టింది. గంటకు 39 కిలో మీటర్ల వేగంతో వెళ్తున్న విమానం.. ఒక్కసారిగా ట్రక్కును ఢీకొట్టగా.. విమానం ముందు భాగం పూర్తిగా ధ్వంసమైంది. అయితే ఈ భీకర ప్రమాదంలో నలుగురు అగ్నిమాపక సిబ్బందితో పాటు పైలట్లు తీవ్రంగా గాయపడ్డారు.

అమెరికాలోని అత్యంత రద్దీగా ఉండే న్యూయార్క్ లా గార్డియా విమానాశ్రయంలో ఆదివారం అర్ధరాత్రి దాటిన తర్వాత పెను ప్రమాదం సంభవించింది. కెనడాలోని మాంట్రియల్ నుంచి ప్రయాణికులతో వచ్చిన ‘ఎయిర్ కెనడా ఎక్స్‌ప్రెస్’ విమానం.. రన్‌వేపై వేగంగా వెళ్తున్న అగ్నిమాపక వాహనాన్ని బలంగా ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో నలుగురు ఫైర్ ఫైటర్లు తీవ్రంగా గాయపడగా.. వారి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు సమాచారం. విమాన పైలట్, కో-పైలట్‌లకు కూడా తీవ్ర గాయాలు అయినట్లు తెలుస్తోంది.

స్థానిక కాలమానం ప్రకారం ఆదివారం రాత్రి 11.30 గంటల సమయంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఎయిర్ కెనడా ఎక్స్‌ప్రెస్‌కు చెందిన ‘సీఆర్‌జే-900’ విమానం లాగార్డియా ఎయిర్‌పోర్టులోని నాలుగో రన్‌వేపై దిగుతుండగా ఈ ప్రమాదం జరిగింది. ఆ సమయంలో విమానం సుమారు గంటకు 24 మైళ్ల (39 కిలో మీటర్ల) వేగంతో ప్రయాణిస్తోంది. రన్‌వేపై ఉన్న ఫైర్ ట్రక్కును ఢీకొట్టడంతో విమానం ముందు భాగం ఒక్కసారిగా పైకి లేచి పూర్తిగా ధ్వంసమైంది.

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

పరందూర్ ఎయిర్‌పోర్ట్ ప్రాజెక్ట్ రద్దు చేసిన సీఎం విజయ్.. రైతుల పోరాటానికి మద్దతిస్తూ సంచలన నిర్ణయం

తమిళనాడు రాజకీయాల్లో పరందూర్ ప్రతిపాదిత విమానాశ్రయం అంశం మరోసారి తీవ్ర చర్చకు...

రెండ్రోజులుగా కనిపించని కర్ణాటక ఐఏఎస్ అధికారి యూపీలో ప్రత్యక్షం.. కారణం ఏంటో చెప్పిన సర్కారు!

గత రెండు రోజులుగా ఆచూకీ లేకుండా పోయారంటూ సామాజిక, వార్తా మాధ్యమాల్లో...

50 ఏళ్ల వయసులో బైక్‌పై సంచలనం.. చరిత్ర సృష్టించిన తెలంగాణ మహిళా డాక్టర్!

50 ఏళ్ల వయసులోనూ సాహసం.. లేహ్-లడఖ్ బైక్ యాత్రతో చరిత్ర సృష్టించిన...

కలుషిత బిర్యానీ తిన్న మహిళకు తీవ్ర అస్వస్థత.. కేఫ్‌కు రూ.96,500 జరిమానా వేసిన ఫోరం

వినియోగదారుల ఆరోగ్యంతో చెలగాటమాడుతూ కలుషిత ఆహారాన్ని విక్రయించిన కేరళలోని ఓ కేఫ్...