హైదరాబాద్, చెన్నై వైపు వెళ్లేవారికి ఊరట.. ఈ నెలాఖరుకు విజయవాడ బైపాస్ రెడీ, ట్రాఫిక్ ఫ్రీ జర్నీ

Date:

విజయవాడ ప్రజలకు ట్రాఫిక్ కష్టాలు తీరనున్నాయి. నగరవాసులతో పాటుగా అమరావతికి రాకపోకలు సాగించే వారికి కీలకమైన విజయవాడ బైపాస్ ఈ నెలాఖరుకు పూర్తిగా సిద్ధం కానుంది. ఈ లోపు 27 నుంచి కాజ దగ్గర విజయవాడ బైపాస్‌లో ఇరువైపులా రాకపోకలకు అనుమతించనున్నారు. ఏప్రిల్ 1 నుంచి వాహనాలను అనుమతించే అవకాశం ఉందంటున్నారు.. ఈ మేరకు టోల్ కూడా వసూలు చేయాలని భావిస్తున్నారు.

విజయవాడ ప్రజలకు పండగే.. నగరవాసుల ట్రాఫిక్ కష్టాలు తీర్చే బైపాస్ ఈ నెలాఖరుకు అందుబాటులోకి రానుంది. ఈ బైపాస్ అందుబాటులోకి వస్తే చెన్నై, హైదరాబాద్, కోల్‌కతా వైపు వెళ్లే వాహనాలకు ట్రాఫిక్ ఫ్రీ జర్నీ చేయొచ్చు. విజయవాడ బైపాస్‌కు సంబంధించి ఎన్‌హెచ్‌ఏఐ పనుల్ని ముగింపుకు తీసుకొచ్చింది. ఈ బైపాస్‌ మొత్తం 47 కిలోమీటర్లను రెండు ప్యాకేజీలుగా పనులు చేశారు. ఈ బైపాస్‌ను చిన్నఅవుటపల్లి నుంచి గొల్లపూడి వరకు 30 కిలోమీటర్లు ఒక ప్యాకేజీగా.. గొల్లపూడి నుంచి కాజ వరకు 17 కి.మీ మరో ప్యాకేజీగా పనులు చేశారు.

ఈ బైపాస్ అందుబాటులోకి వస్తే.. కోల్‌కతా-చెన్నై హైవే-16లో వెళ్లే వాహనాలు విజయవాడలోకి రావాల్సిన అవసరం ఉండదు. ఈ బైపాస్ గొల్లపూడి దగ్గర విజయవాడ-హైదరాబాద్‌ నేషనల్ హైవే 65 పైనుంచి వెళుతుండగా.. హైవేలో సర్కిల్‌ కూడా నిర్మిస్తున్నారు. ఈ సర్కిల్‌ ద్వారా బైపాస్‌లో వచ్చే వాహనాలు ఎటువైపైనా వెళ్లేందుకు ఉపయోగపడుతుంది. కొద్ది రోజులుగా చిన్నఅవుటపల్లి-గొల్లపూడి మధ్య బైపాస్‌ మీదుగా వాహనాల రాకపోకలకు అనుమతించారు. చిన్నఅవుటపల్లి దగ్గర పెండింగ్ పనులు ఈ నెలాఖరుకు పూర్తవుతాయంటున్నారు.

విజయవాడ బైపాస్ ‌కు సంబంధించి అంబాపురం దగ్గర ల్యాంకో పవర్‌కు చెందిన హెచ్‌టీ విద్యుత్‌లైన్‌ దగ్గర బ్రిడ్జి నిర్మాణం కూడా ఆగిపోయింది. భారీ వాహనాలకు విద్యుత్ లైన్లు తగిలే ప్రమాదం ఉందని ఈ నిర్ణయం తీసుకున్నారు. అక్కడ బైపాస్‌కు ఇరు వైపులా రెండు ఎత్తైన టవర్లు నిర్మించి లైన్లు మార్చాలని భావిస్తున్నారు. అయితే ఈ అంశంపై కాస్త గందరగోళం ఉండటంతో ఇంకా పెండింగ్‌లోనే ఉంది. ఈ వంతెన ఆగిపోవడంతో ఆ కూడలిలో ట్రాఫిక్‌ అంతరాయం ఏర్పడుతోంది. మొత్తం విజయవాడ బైపాస్ 47 కిలోమీటర్లలో చిన్నఅవుటపల్లి నుంచి కాజ వరకు అంబాపురం బ్రిడ్జి 90 మీటర్లు మినహా మిగిలిన బైపాస్‌ అంతా ఈ నెలాఖరుకు పూర్తవుతుంది. వెదురుపావులూరు, వెంకటపాలెం దగ్గర ఈ బైపాస్‌లో రెండు టోల్‌ప్లాజాలు ఏర్పాటు చేశారు.. ఈ వారంలోనే టోల్ ఫీజులు ఖరారు చేసి, ఏప్రిల్ 1 నుంచి వసూలు చేయనున్నారు.

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

టీడీపీ మహానాడు వేదిక మార్పు?.. ప్రధాని మోదీ ఏపీ పర్యటన ఎఫెక్ట్, ఎక్కడికి మారుస్తున్నారంటే!

టీడీపీ పసుపు పండుగగా చెప్పే మహానాడును ప్రతి ఏటా నిర్వహిస్తున్నారు. ఈ...

ఇరాన్‌పై మరో దాడి వద్దు”: డొనాల్డ్ ట్రంప్‌ను హెచ్చరించిన పుతిన్

ఇరాన్‌పై యుద్ధం ముదరకుండా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ స్వయంగా రంగంలోకి...

ఏపీకి కేంద్రం నుంచి తీపికబురు.. మరోసారి భారీగా నిధుల విడుదల

ఆంధ్రప్రదేశ్‌కు కేంద్ర ప్రభుత్వం మరోసారి నిధులను విడుదల చేసింది. దీనదయాళ్ అంత్యోదయ...

ప్రేమలో ‘బుట్టబొమ్మ’.. బాలీవుడ్ హీరోతో పూజా హెగ్డే సీక్రెట్ డేటింగ్?..ఫోటోలు వైరల్

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే ప్రేమలో పడినట్లు గత కొన్ని...