
హైదరాబాద్లో హైడ్రా అధికారులు మరో భారీ ఆపరేషన్ చేపట్టారు. ఏకంగా రూ.15 వేల కోట్ల విలువైన భూములను రక్షించేందుకు చర్యలు చేపట్టారు. మొత్తం 1263 ఎకరాల్లో 860 ఎకరాల ఖాళీ భూమిని స్వాధీనం చేసుకునేందుకు రెడీ అయింది. మిగిలిన భూమిలో ఉన్న నివాస గృహాల జోలికి వెళ్లకుండా.. ఆక్రమణకు గురైన ఖాళీ స్థలాలను స్వాధీనం చేసుకుంటున్నారు. రెవెన్యూ, మున్సిపల్ అధికారులతో కలిసి హైడ్రా అధికారులు ఈ ఆపరేషన్ నిర్వహించారు.
ప్రభుత్వ ఆక్రమణలను తిరిగి స్వాధీనం చేసుకునేందుకు హైదరాబాద్ నగర వ్యాప్తంగా హైడ్రా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలోనే సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మండలం ఐలాపురంలో హైడ్రా అధికారులు.. భారీ పోలీస్ బందోబస్తు మధ్య భారీ ఆపరేషన్ చేపట్టింది. స్థానిక రెవెన్యూ, మున్సిపల్ అధికారులతో కలసి హైడ్రా అధికారులు నిబంధనలకు విరుద్ధంగా ప్రభుత్వ భూములను ఆక్రమించి నిర్మించిన నిర్మాణాలను కూల్చేస్తున్నారు. అయితే ప్రభుత్వ భూముల్లో ఇళ్లను మాత్రం కూల్చడం లేదని హైడ్రా అధికారులు తేల్చి చెప్పారు.
ఐలాపురం గ్రామం, తండాలో ఉన్న నివాస గృహాల జోలికి కానీ హైడ్రా అధికారులు వెళ్లకుండా చర్యలు చేపట్టారు. ఐలాపురం గ్రామంలో ఉన్న 1263 ఎకరాల ప్రభుత్వ భూముల్లో అక్రమంగా నిర్మించిన భారీ కట్టడాలు, సీజ్ చేసుకున్న ఖాళీ స్థలాలను తిరిగి స్వాధీనం చేసుకోవడంపై దృష్టి సారించినట్లు హైడ్రా అధికారులు తెలిపారు.

