ప్రపంచమంతా గూగుల్‌లో సెర్చ్ చేస్తుంటే గూగుల్ ఏపీని ఎంచుకుంది: సీఎం చంద్రబాబు

Date:

విశాఖపట్నం వేదికగా ఆంధ్రప్రదేశ్ ఐటీ ముఖచిత్రం సమూలంగా మారిపోనుంది. ఒకప్పుడు వలసలకు చిరునామాగా ఉన్న ఉత్తరాంధ్ర, ఇప్పుడు ప్రపంచానికి ‘ఏఐ గేట్‌వే’గా అవతరించబోతోంది. ఈ మహాద్భుత ఘట్టానికి ఏప్రిల్ 28, 2026న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ శ్రీకారం చుట్టారు.

విశాఖ సమీపంలోని తర్లువాడలో లక్షా 35 వేల కోట్ల రూపాయల భారీ వ్యయంతో, దేశ చరిత్రలోనే అతిపెద్ద విదేశీ ప్రత్యక్ష పెట్టుబడిగా గూగుల్ డేటా సెంటర్ నిర్మాణానికి సీఎం చంద్రబాబు, కేంద్రమంత్రి అశ్విని వైష్ణవ్, ఐటీ మంత్రి నారా లోకేష్ శంకుస్థాపన చేశారు. ప్రపంచంలోనే తొలిసారిగా ఒక గిగావాట్ (1000 మెగావాట్స్) సామర్థ్యంతో ఈ సెంటర్ ఏర్పాటు కాబోతోంది.

అదానీ కనెక్ట్స్, ఎయిర్‌టెల్ నెక్స్‌ట్రా సంస్థలు ఈ మెగా ప్రాజెక్టులో గూగుల్‌తో చేతులు కలిపాయి. 2028 సెప్టెంబరు నాటికి నిర్మాణం పూర్తి చేసి కార్యకలాపాలు ప్రారంభించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. క్లౌడ్ సర్వీసెస్, డీప్ లెర్నింగ్, హైస్పీడ్ ఏఐ ట్రైనింగ్‌లకు ఇది గుండెకాయలా మారనుంది.

శంకుస్థాపన అనంతరం ఏపీ సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. 30 ఏళ్ల క్రితం సైబరాబాద్ ఎలాగైతే సంపద సృష్టించిందో, ఇప్పుడు విశాఖ గూగుల్ సెంటర్ ఏపీ భవిష్యత్తును మారుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ డేటా సెంటర్ రాకతో ఐటీ స్టార్టప్‌లు, సెమీకండక్టర్ కంపెనీలు వైజాగ్‌కు క్యూ కట్టనున్నాయి.

ఏఐ, సైబర్ సెక్యూరిటీ, డేటా సైన్స్ రంగాల్లో యువతకు వేల సంఖ్యలో ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి. త్వరలో ఏఐ అసిస్టెంట్ ద్వారా సీఎం కార్యాలయం నుండి సుపరిపాలన అందించనున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. అనకాపల్లి జిల్లా మరో రంగారెడ్డి జిల్లాలా మారుతుందని, ఏఐ అసిస్టెంట్ సహాయంతో ‘స్పీడ్ ఆఫ్ గవర్నెన్స్’ను అందిస్తామని చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు.

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

ఆలోచన చేయలేని ప్రభుత్వం, చర్చ చేయలేని ప్రతిపక్షం.. ప్రజలకు వరమా.. శాపమా?: విజయసాయిరెడ్డి

రాజమండ్రి ఘటనలో ప్రాణాలు కోల్పోయిన మెడికో ప్రియాంక కేసును సీబీఐతో విచారణ...

WTC ఫైనల్ రేసు.. ఏ జట్టుకు ఎన్ని విజయాలు కావాలంటే?

ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ 2025-27 ఫైనల్ రేసు ఆసక్తికరంగా మారింది....

ఒక్కసారి నాటితే 12 ఏళ్లు దిగుబడి.. ఎకరాకు లక్షల్లో ఆదాయం.. సిరులు కురిపిస్తున్న “నన్నారి”

వాణిజ్య పంటల సాగుతో నష్టాలు ఎదుర్కొంటున్న రైతులు క్రమంగా వైవిధ్యభరితమైన పంటల...

282 మెడికల్‌ ఆఫీసర్‌ పోస్టులు

సెంట్రల్‌ ఆర్మ్‌డ్‌ పోలీస్‌ ఫోర్సెస్‌ (బీఎస్‌ఎఫ్‌, సీఆర్‌పీఎఫ్‌, ఐటీబీపీ, ఎస్‌ఎస్‌బీ), అస్సాం...