హైడ్రా భారీ ఆపరేషన్‌.. రూ.15 వేల కోట్ల 863 ఎకరాల రక్షణకు చర్యలు.. 6 అంతస్తుల బిల్డింగ్ కూల్చివేత

Date:

హైదరాబాద్‌లో హైడ్రా అధికారులు మరో భారీ ఆపరేషన్ చేపట్టారు. ఏకంగా రూ.15 వేల కోట్ల విలువైన భూములను రక్షించేందుకు చర్యలు చేపట్టారు. మొత్తం 1263 ఎకరాల్లో 860 ఎకరాల ఖాళీ భూమిని స్వాధీనం చేసుకునేందుకు రెడీ అయింది. మిగిలిన భూమిలో ఉన్న నివాస గృహాల జోలికి వెళ్లకుండా.. ఆక్రమణకు గురైన ఖాళీ స్థలాలను స్వాధీనం చేసుకుంటున్నారు. రెవెన్యూ, మున్సిపల్ అధికారులతో కలిసి హైడ్రా అధికారులు ఈ ఆపరేషన్ నిర్వహించారు.

ప్రభుత్వ ఆక్రమణలను తిరిగి స్వాధీనం చేసుకునేందుకు హైదరాబాద్ నగర వ్యాప్తంగా హైడ్రా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలోనే సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్‌ మండలం ఐలాపురంలో హైడ్రా అధికారులు.. భారీ పోలీస్ బందోబస్తు మధ్య భారీ ఆపరేషన్ చేపట్టింది. స్థానిక రెవెన్యూ, మున్సిపల్ అధికారులతో కలసి హైడ్రా అధికారులు నిబంధనలకు విరుద్ధంగా ప్రభుత్వ భూములను ఆక్రమించి నిర్మించిన నిర్మాణాలను కూల్చేస్తున్నారు. అయితే ప్రభుత్వ భూముల్లో ఇళ్లను మాత్రం కూల్చడం లేదని హైడ్రా అధికారులు తేల్చి చెప్పారు.

ఐలాపురం గ్రామం, తండాలో ఉన్న నివాస గృహాల జోలికి కానీ హైడ్రా అధికారులు వెళ్లకుండా చర్యలు చేపట్టారు. ఐలాపురం గ్రామంలో ఉన్న 1263 ఎకరాల ప్రభుత్వ భూముల్లో అక్రమంగా నిర్మించిన భారీ కట్టడాలు, సీజ్ చేసుకున్న ఖాళీ స్థలాలను తిరిగి స్వాధీనం చేసుకోవడంపై దృష్టి సారించినట్లు హైడ్రా అధికారులు తెలిపారు.

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

Weahter Report: చల్లని కబురు.. భారీగా తగ్గిన పగటి ఉష్ణోగ్రతలు! వచ్చే 3 రోజులు ఎలా ఉంటుందంటే

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిన్న, మొన్నటి వరకు భాణుడు నిప్పులు కురిపించాడు....

గ్రామ స్వరాజ్యమే లక్ష్యం.. త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు: సీఎం చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాలనలో వేగాన్ని పెంచడమే కాకుండా,...

ఆసుపత్రి దాటాక ఆపదలేనా? భారత్‌లో తల్లడిల్లుతున్న మాతృత్వం, ప్రసవం తర్వాతే అసలైన సవాలు

ప్రసవం ముగింపు కాదు. అది కోలుకునే ప్రక్రియకు ఆరంభం మాత్రమే. భారతదేశంలో...