ఐదు మేకపిల్లల పంచాయితీ.. ప్రాణాలు తీసే వరకూ పోయిందీ

Date:

నెల్లూరు జిల్లా కావలిలో ఓ దారుణ ఘటన చోటుచేసుకుంది. మేక పిల్లల దగ్గర మొదలైన పంచాయితీ పగల వరకూ వెళ్లి ప్రాణాలు తీశారు. ఓ యజమాని, కాపలా వ్యక్తి మధ్య మొదలైన వివాదం గ్రామ పెద్ద దగ్గరకు పంచాయితీగా వెళ్లింది. అక్కడ కాపలా వ్యక్తి గ్రామ పెద్దకు మర్యాద ఇవ్వకుండా మాట్లాడటంతో.. ఆ విషయాన్ని మనస్సులో పెట్టుకున్న గ్రామ పెద్ద. పక్కా ప్లాన్‌తో దాడి చేయించాడు.. చికిత్స పొందుతున్న ఆ వ్యక్తి మరణించడంతో పోలీసులు ఇద్దర్ని అరెస్టు చేశారు.

మేక పిల్లల పంచాయితీ ఒక మనిషి ప్రాణాలు తీసే వరకూ వెళ్లింది. ఓ యజమాని తన మేకను ఒకరి దగ్గర వదిలిపెట్టి వెళ్లాడు.. ఆ మేకకు ఐదు పిల్లలు పుట్టాయి. అయితే, దాన్ని చూసిన వ్యక్తి తనకు రెండు మేక పిల్లలు కావాలి అనడం.. యజమాని ఇవ్వను అనడంతో మొదలైన గొడవ.. పెద్దమనిషి పంచాయితీ వరకూ వెళ్లింది. ఆ తర్వాత వివాదం పెద్దదవడంతో ఏకంగా మనిషి ప్రాణాలు తీసే వరకూ వెళ్లింది. ఈ ఘటన నెల్లూరు జిల్లా కావలిలో చోటుచేసుకుంది.

గ్రామ పెద్ద, మాజీ సర్పంచ్ మందా మధు దృష్టికి జనార్దన్ ఈ గొడవను తీసుకెళ్లాడు. ఆ సమయంలో వాసు, సర్పంచ్ మధ్య మాటా మాటా పెరిగింది. దాంతో ఆగ్రహానికి గురైన గ్రామ పెద్ద మధు అతనికి ఎలాగైనా భయం పెట్టాలని అనుకున్నాడు. వాసును అడవిరాజుపాలెంలోని ఓ మద్యం దుకాణానికి ఈ నెల 10వ తేదీ తీసుకెళ్లారు. మద్యం తాగిన తర్వాత ముగ్గురితో కలిసి వాసుపై మధు దాడి చేయించాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

Hyderabad: అయ్యో ఏమైంది తల్లి.. వారం క్రితమే బెంగళూరు నుంచి వచ్చింది.. ఇంతలోనే..

బెంగళూరులో పీజీ మెడిసిన్ చదువుతున్న 26 ఏళ్ల దీక్షిత హైదరాబాద్‌లోని నాగారం...

హైదరాబాద్ వాహనదారులకు గుడ్‌న్యూస్.. రూ.345 కోట్లతో కొత్త ఫ్లైఓవర్, ఈ ఏరియాలో ట్రాఫిక్ కష్టాలకు చెక్

హైదరాబాద్ ఓల్డ్ సిటీలో ట్రాఫిక్ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపడానికి జీహెచ్‌ఎంసీ...

ప్రతి నీటి బొట్టునూ స‌ద్వినియోగం చేసుకోవాలి.. అధికారులకు మంత్రి నిమ్మల సూచన

అమరావతి, జులై 25: రైతుల‌ ప్రయోజనాలను ర‌క్షించేందుకు ఇరిగేష‌న్, రెవెన్యూ అధికారులు...

సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కేకు టైఫాయిడ్..

కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే అనారోగ్యానికి గురయ్యారు....