
పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మళ్లీ మొదలయ్యాయి. ఇరాన్- అమెరికా దేశాలు మరోసారి యుద్ధానికి కాలు దువ్వాయి. దీంతో బంగారం, వెండి ధరల్లో మళ్లీ హెచ్చుతగ్గులు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా గత వారం రోజులుగా పసిడి ధర పడిపోతూ వస్తోంది. ఈ నేపథ్యంలో ఇవాళ (సోమవారం) ఉదయం 07:00 గంటల సమయానికి భారతదేశంలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,43,280గా ఉంది. 22 క్యారెట్ల తులం గోల్డ్ రేటు రూ.1,31,340కి చేరింది. అలాగే 18 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,07,460గా ఉంది. ఇక, వెండి విషయానికి వస్తే కిలో ధర రూ.2,30,000కి చేరింది. హైదరాబాద్, విజయవాడ నగరాల్లో 24 క్యారెట్ల తులం పసిడి ధర రూ.1,43,280 ఉండగా.. 22 క్యారెట్ల గోల్డ్ రేటు రూ.1,31,340కి చేరింది. వెండి కిలో ధర రూ.2,34,900గా ఉంది.

