కొత్తగా ఉద్యోగాల్లో చేరిన ప్రభుత్వ టీచర్లకు గుడ్‌న్యూస్.. దర్జాగా సెలవులు తీసుకోవచ్చు, ఉత్తర్వులు జారీ

Date:

మెగా డీఎస్సీ ద్వారా కొత్తగా ఉద్యోగాల్లో చేరిన ఉపాధ్యాయులకు శుభవార్త. అక్టోబర్ నుండి డిసెంబర్ వరకు వారికి 4 సీఎల్స్, 1 ఐచ్ఛిక సెలవు, 2 ప్రత్యేక సీఎల్స్, లేడీ టీచర్లకు అదనంగా మరో ప్రత్యేక సెలవు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. దీంతో వారి సెలవుల సమస్య పరిష్కారమైంది. మొత్తం 15,941 మంది కొత్త ఉపాధ్యాయులు విధుల్లో చేరారు.

ఆంధ్రప్రదేశ్‌లో ఈ ఏడాది మెగా డీఎస్సీ ద్వారా కొత్తగా ఉద్యోగాల్లో చేరిన ప్రభుత్వ టీచర్లకు పండగే. కొత్తగా ఉద్యోగాల్లో చేరిన ఉపాధ్యాయులకు సెలవులు మంజూరు చేసేందుకు గ్రీన్‌సిగ్నల్ వచ్చింది. కొత్త టీచర్లకు సెలవులు మంజూరు చేస్తూ ఆ శాఖ డైరెక్టర్‌ విజయరామరాజు ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు ‘అక్టోబరు నుంచి డిసెంబరు వరకు సీఎల్స్‌ 4, ఐచ్ఛిక సెలవు (ఆప్షనల్‌ హాలిడే) ఒకటి, ప్రత్యేక సీఎల్స్‌ 2, ఉపాధ్యాయినులకు (లేడీ టీచర్లకు) అదనపు ప్రత్యేక సెలవు ఒకటి’ చొప్పున మంజూరు చేశారు. కొత్తగా ఉద్యోగాల్లో చేరిన టీచర్లు తమకు సెలవులు కావాలని కోరారు.. దీంతో ప్రభుత్వం సానుకూలంగా స్పందించి వారికి సెలవులు మంజూరు చేసింది. మొత్తానికి వీరి సెలవుల సమస్య పరిష్కారం అయ్యింది.. వారికి సెలవులు మంజూరు కావడంతో ఆనందంలో ఉన్నారు. ఈ ఏడాది నిర్వహించిన మెగా డీఎస్సీ ద్వారా 15,941 మంది కొత్త ఉపాధ్యాయులు విధుల్లో చేరిన సంగతి తెలిసిందే.

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

Hyderabad: ఆర్‌ఆర్‌ఆర్‌ ఉత్తర భాగంపై కీలక అప్డేట్.. 2 ప్యాకేజీలుగా మార్పు, టెండర్లకు ఆహ్వానం

రీజినల్ రింగ్ రోడ్డు (ఆర్‌ఆర్‌ఆర్‌) ఉత్తర భాగం పనులపై కీలక అప్డేట్...

ఏపీలో రిలయన్స్‌ డేటాసెంటర్‌.. చంద్రబాబు సర్కార్ భారీ ప్రోత్సాహకాలు, ఏకంగా వేల కోట్లు!

విజయనగరం జిల్లాలో ఏర్పాటు చేయనున్న రిలయన్స్ డేటా సెంటర్‌కు ఏపీ ప్రభుత్వం...

మాట నిలబెట్టుకున్న టీడీపీ ఎమ్మెల్యే గల్లా మాధవి.. పదో తరగతి విద్యార్థులకు విమాన ప్రయాణం

టీడీపీ ఎమ్మెల్యే గల్లా మాధవి.. తాను ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు. కొన్ని...

తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్.. 5 లక్షల బీమా, 2 లక్షల కొత్త ఫించన్లు, ఇంకా మరెన్నో.. రేవంత్ సర్కార్ జూన్ 2 బిగ్ ప్లాన్..!

రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జూన్ 2న ప్రజలకు శుభవార్తలు చెప్పేందుకు...