టీమిండియా ఈజ్ బ్యాక్.. చెపాక్‌లో చితక్కొట్టుడు కొట్టిన బ్యాటర్లు..!

Date:

టీ20 ప్రపంచకప్‌ 2026లో టీమిండియా బ్యాటర్లు జూలు విదిల్చారు. జింబాబ్వేతో మ్యాచ్‌లో టీ20 ప్రపంచకప్ చరిత్రలోనే తమ అత్యధిక స్కోరు నమోదు చేశారు. చెన్నైలోని చెపాక్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో భారత్‌ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 256 పరుగులు చేసింది. అభిషేక్ శర్మ, హార్దిక్ పాండ్యా హాఫ్ సెంచరీలతో రాణించారు. మిగతా బ్యాటర్లు సైతం మెరుగైన ప్రదర్శన చేశారు.

టీ20 ప్రపంచకప్‌ 2026 సూపర్‌-8లో జింబాబ్వేతో మ్యాచ్‌లో భారత బ్యాటర్లు అదరగొట్టారు. ఈ టోర్నీలో ఇప్పటివరకు మోస్తరు ప్రదర్శన చేసిన టీమిండియా బ్యాటర్లు.. ఈ మ్యాచ్‌లో మాత్రం సత్తాచాటారు. సెమీస్ చేరాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో ఆల్‌రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టారు. అభిషేక్ శర్మ సహా ఇతర బ్యాటర్లంతా తలా ఓ చేయి వేయడంతో టీమిండియా రికార్డు స్కోరు సాధించింది. నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి

చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో ఈ మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన జింబాబ్వే కెప్టెన్ సికిందర్ రజా.. భారత్‌కు బ్యాటింగ్ అప్పగించాడు. ఇక ఈ మ్యాచ్‌ ద్వారా తుది జట్టులోకి వచ్చిన సంజూ శాంసన్.. మెరుపు ఆరంభాన్ని ఇచ్చాడు. క్రీజులో ఉన్నంతసేపు ధాటిగా బ్యాటింగ్ చేశాడు. మరోవైపు పేలవ ఫామ్‌తో ఇబ్బంది పడుతున్న అభిషేక్ శర్మ సైతం కుదురుకున్నాడు. దీంతో స్కోరు బోర్డు పరుగులు పెట్టింది. వీరిద్దరూ తొలి వికెట్‌కు 22 బంతుల్లో 48 రన్స్ జోడించారు.

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

Raksha Bandhan 2026: రాఖీ పండుగపై క్లారిటీ.. ఆగస్టు 28నే రక్షాబంధన్‌.. శుభ ముహూర్తం ఇదే!

రక్షాబంధన్‌ పండుగ తేదీపై నెలకొన్న సందేహాలకు పండితులు స్పష్టత ఇచ్చారు. 2026లో...

వర్షాకాలంలో ఖర్జూరాలు తింటే ఏం జరుగుతుందో తెలుసా..? డాక్టర్లు చెప్పిన విషయాలు ఇవే!

ఖర్జూరాలు ప్రకృతి అందించిన తీపి, పోషక విలువలు కలిగిన పండ్లలో ఒకటి....

‘పాకిస్థాన్‌ది ఆక్రోశం’.. కశ్మీర్‌ గురించి అమెరికా రాయబారి వ్యాఖ్యలకు సమన్లు జారీపై భారత్ స్పందన

జమ్మూ కశ్మీర్‌ భారత్‌లో అంతర్భాగమేనని న్యూఢిల్లీ మరోసారి స్పష్టం చేసింది. కశ్మీర్‌లో...

Dragon Fruit: డ్రాగన్ ఫ్రూట్ అందరికీ సూట్ అవుతుందా? ఈ ఆరోగ్య సమస్యలు ఉంటే మాత్రం జాగ్రత్త!

డ్రాగన్ ఫ్రూట్ అందరికీ సరిపోతుందా? డ్రాగన్ ఫ్రూట్‌ చూడటానికి ఆకర్షణీయంగా ఉండటమే కాకుండా,...