ఏపీ హైకోర్టుకు తొలి మహిళా చీఫ్ జస్టిస్‌గా లిసా గిల్ పేరు సిఫార్సు.. కొత్త సంప్రదాయానికి తెర తీసిన కొలీజియం

Date:

 ఏపీ హైకోర్టు తదుపరి సీజే (ప్రధాన న్యాయమూర్తి)గా జస్టిస్‌ లీసా గిల్‌ రానున్నారు. ఆమె ప్రస్తుతం పంజాబ్‌- హర్యానా హైకోర్టు న్యాయమూర్తిగా ఉన్నారు. ఈ మేరకు సీజేఐ జస్టిస్‌ సూర్యకాంత్‌ నేతృత్వంలోని కొలీజియం కేంద్రానికి సిఫార్సు చేసింది. రాష్ట్రపతి ఆమోదం తెలపగానే ఆమె ఏపీ హైకోర్టుకు రానున్నారు. ప్రస్తుత సీజే ధీరజ్‌సింగ్‌ ఠాకూర్‌‌ పదవీ కాలంలో ఏప్రిల్ నెలలో ముగియనుంది.

ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా తొలిసారి ఓ మహిళా న్యాయమూర్తి రాబోతున్నారు. హైకోర్టు తదుపరి సీజే (ప్రధాన న్యాయమూర్తి)గా జస్టిస్‌ లిసా గిల్‌ రానున్నారు. సీజేఐ జస్టిస్‌ సూర్యకాంత్‌ నేతృత్వంలోని కొలీజియం సమావేశమై.. ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ గిల్‌ పేరును కేంద్రానికి సిఫార్సు చేసింది. కొలీజియం సిఫార్సులకు రాష్ట్రపతి ఆమోదం తెలిపితే.. ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు తొలి మహిళా ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ లిసా గిల్ రికార్డు సృష్టించనున్నారు. ప్రస్తుత హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ధీరజ్‌సింగ్‌ ఠాకూర్‌ పదవీకాలం ఏప్రిల్ 24తో ముగియనుంది. జస్టిస్ లిసా గిల్‌ను ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా రెండు నెలలు ముందుగానే బదిలీ చేయాలని కొలీజియం నిర్ణయం తీసుకుంది. జస్టిస్‌ లిసా గిల్‌ ప్రస్తుత ఏపీ హైకోర్టు సీజే జస్టిస్‌ ధీరజ్‌సింగ్‌ ఠాకూర్‌ బాధ్యతల నుంచి వైదొలిగిన మరుసటిరోజు నుంచి సీజేగా ప్రతిపాదిస్తూ సుప్రీం కోర్టు కొలీజయం సిఫార్సు చేసింది. లిసా గిల్ ప్రస్తుతం పంజాబ్‌-హర్యానా హైకోర్టులో న్యాయమూర్తిగా (సీనియార్టీ పరంగా మూడోస్థానంలో) ఉన్నారు.

లిసా గిల్ స్వస్థలం చండీగఢ్‌. ఆమె కార్మెల్‌ కాన్వెంట్‌‌లో చదివారు. అనంతరం హ్యూమానిటీస్‌లో డిగ్రీ పూర్తి చేశారు. పంజాబ్‌ యూనివర్సిటీ నుంచి ఎల్‌ఎల్‌బీ, ఎల్‌ఎల్‌ఎం పూర్తిచేసిన లిసా గిల్.. 1990లో లాయర్‌గా పేరు నమోదు చేసుకొని, పంజాబ్‌-హర్యానా హైకోర్టులో ప్రాక్టీస్‌ మొదలుపెట్టారు. 2014 మార్చి 31న లిసా గిల్ పంజాబ్‌-హర్యానా హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. ఇప్పుడు అక్కడి నుంచి ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా రాబోతున్నారు.

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

టీడీపీ మహానాడు వేదిక మార్పు?.. ప్రధాని మోదీ ఏపీ పర్యటన ఎఫెక్ట్, ఎక్కడికి మారుస్తున్నారంటే!

టీడీపీ పసుపు పండుగగా చెప్పే మహానాడును ప్రతి ఏటా నిర్వహిస్తున్నారు. ఈ...

ఇరాన్‌పై మరో దాడి వద్దు”: డొనాల్డ్ ట్రంప్‌ను హెచ్చరించిన పుతిన్

ఇరాన్‌పై యుద్ధం ముదరకుండా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ స్వయంగా రంగంలోకి...

ఏపీకి కేంద్రం నుంచి తీపికబురు.. మరోసారి భారీగా నిధుల విడుదల

ఆంధ్రప్రదేశ్‌కు కేంద్ర ప్రభుత్వం మరోసారి నిధులను విడుదల చేసింది. దీనదయాళ్ అంత్యోదయ...

ప్రేమలో ‘బుట్టబొమ్మ’.. బాలీవుడ్ హీరోతో పూజా హెగ్డే సీక్రెట్ డేటింగ్?..ఫోటోలు వైరల్

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే ప్రేమలో పడినట్లు గత కొన్ని...