
వ్యవసాయం, తాగునీరు, సాగునీటి అంశాలపై చర్చ
కర్నూలు, : కర్నూలు నగరంలోని జిల్లా పరిషత్ సమావేశ భవనంలో ఉమ్మడి జిల్లా పరిషత్ పాలక మండలి సమావేశం జడ్పీ చైర్మన్ ఎర్రబోతుల పాపిరెడ్డి అధ్యక్షతన జరిగింది. సమావేశంలో వ్యవసాయం, గ్రామీణ నీటి సరఫరా, సాగునీటి అంశాలపై చర్చించారు. ఆయా శాఖలకు సంబంధించిన సమస్యలు, అభివృద్ధి కార్యక్రమాలపై సభ్యులు చర్చించారు. సమావేశంలో కర్నూలు జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ. సిరి, నంద్యాల జిల్లా కలెక్టర్ రాజకుమారి తదితరులు పాల్గొన్నారు.
