గాంధీ సరోవర్ ప్రాజెక్ట్‌కు DPR సిద్ధం.. 150 మీటర్ల ఎత్తులో మహాత్మా గాంధీ విగ్రహం!

Date:

మూసీ నది పునరుద్ధరణలో భాగంగా తెలంగాణ ప్రభుత్వం బాపూఘాట్ వద్ద రూ.400 కోట్లతో ‘గాంధీ సరోవర్’ ప్రాజెక్టును చేపట్టిన విషయం తెలిసిందే. తాజాగా ఈ ప్రాజెక్టుకు సంబంధించిన డీపీఆర్ సిద్ధమైంది. 150 మీటర్ల ఎత్తులో మహాత్మా గాంధీ విగ్రహం, మ్యూజియం, ‘లండన్ ఐ’ తరహాలో చరఖా ఆకారంలో రంగుల రాట్నం ఈ ప్రాజెక్టుకు ప్రధాన ఆకర్షణలుగా నిలవనున్నాయి. అలాగే మూసీ నదిపై 15 వంతెనలు, సైక్లింగ్ ట్రాక్‌లు, బోటింగ్ సదుపాయం, పర్యాటక హంగులతో ప్రాజెక్టు రూపకల్పన చేశారు.

హైదరాబాద్ నగర మధ్యగా ప్రవహించే మూసీ నదిని అందంగా తీర్చిదిద్దేందుకు తెలంగాణ ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. ప్రస్తుతం మురుగు, వ్యర్థాలతో కలుషితమై ప్రవహిస్తున్న మూసీని ప్రపంచ స్థాయి పర్యాటక, ఆర్థిక కేంద్రంగా అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం మూసీ పునరుజ్జీవన ప్రాజెక్టును ప్రారంభించింది. ఈ ప్రణాళికలో భాగంగా బాపూఘాట్ వద్ద గాంధీ సరోవర్ ప్రాజెక్టును నిర్మించనుంది. దీనికి సంబంధించిన డీపీఆర్‌ను తాజాగా మూసీ రివర్‌ఫ్రంట్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (MRLDCL) సిద్ధం చేసింది. బాపూఘాట్ ప్రాంతంలో 150 మీటర్ల ఎత్తులో గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని ప్రణాళిక రూపొందించారు. అలాగే మూసీ నదికి రెండు వైపులా విశాలమైన రోడ్లు, నది వెంట ఆకర్షణీయమైన పార్కులు అభివృద్ధి చేయనున్నారు.

బాపూఘాట్ ప్రాంతంలో ప్రభుత్వానికి సుమారు 60 ఎకరాల భూమి ఉంది. ఇందులో 34 ఎకరాల విస్తీర్ణంలో రూ.400 కోట్ల వ్యయంతో గాంధీ సరోవర్ ప్రాజెక్టును అమలు చేయనున్నారు. 100 మీటర్ల ఎత్తు వరకు పలు అంతస్తులతో టవర్ నిర్మించి, అందులో సమావేశ మందిరాలు, మ్యూజియం, గాంధీ జీవిత చరిత్రను ప్రతిబింబించే ప్రదర్శనశాల, కార్యాలయాలను ఏర్పాటు చేయనున్నారు. ఈ టవర్ పైభాగంలో 35 నుంచి 50 మీటర్ల ఎత్తులో గాంధీ విగ్రహాన్ని ప్రతిష్ఠించనున్నారు.

అదే విధంగా గాంధీ విగ్రహం వెనుక భాగంలో లండన్ థేమ్స్ నది తీరాన ఉన్న ‘లండన్ ఐ’ తరహాలో రంగుల రాట్నం నిర్మించనున్నారు. గాంధీ స్మృతులను గుర్తు చేసే చరఖా ఆకారంలో ఈ నిర్మాణం ఉండేలా డిజైన్ చేశారు. ప్రాజెక్టు విస్తరణ కోసం పక్కనున్న 98 ఎకరాల రక్షణ శాఖ భూములను సేకరించే ప్రక్రియ ప్రస్తుతం కొనసాగుతోందని అధికారులు వెల్లడించారు.

మూసీ నదిలో నిరంతరం స్వచ్ఛమైన నీరు ప్రవహించేలా చర్యలు తీసుకోవడంతో పాటు, నది పరివాహక ప్రాంతాన్ని ఆధునికంగా అభివృద్ధి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ జంట జలాశయాల నుంచి గాంధీ సరోవర్ వరకు మొత్తం 15 వంతెనలను నిర్మించనున్నారు. ఒక వైపు 100 అడుగుల వెడల్పుతో రోడ్డు, మరోవైపు 80 అడుగుల రోడ్డు ఏర్పాటు చేయనున్నారు. అదనంగా కాలిబాటలు, సైక్లింగ్ ట్రాక్‌లు మరియు ఇతర మౌలిక సదుపాయాలు కల్పించనున్నారు.

నదిలో పేరుకుపోయిన పూడికను తొలగించి, అంచులను సరిచేసి కొన్ని ప్రాంతాల్లో పార్కులను అభివృద్ధి చేస్తారు. పిల్లల పార్కులు, హోటళ్లు, వేడుకలు నిర్వహించుకునేలా యాంఫీ థియేటర్లు కూడా ప్రాజెక్టులో భాగంగా ఏర్పాటు కానున్నాయి. మూడు నుంచి నాలుగు ప్రాంతాల్లో చిన్న ఆనకట్టలను కూడా నిర్మించనున్నారు. గాంధీ సరోవర్‌లో బోటింగ్ సదుపాయం కూడా అందుబాటులో ఉండనుంది.

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

టీడీపీ మహానాడు వేదిక మార్పు?.. ప్రధాని మోదీ ఏపీ పర్యటన ఎఫెక్ట్, ఎక్కడికి మారుస్తున్నారంటే!

టీడీపీ పసుపు పండుగగా చెప్పే మహానాడును ప్రతి ఏటా నిర్వహిస్తున్నారు. ఈ...

ఇరాన్‌పై మరో దాడి వద్దు”: డొనాల్డ్ ట్రంప్‌ను హెచ్చరించిన పుతిన్

ఇరాన్‌పై యుద్ధం ముదరకుండా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ స్వయంగా రంగంలోకి...

ఏపీకి కేంద్రం నుంచి తీపికబురు.. మరోసారి భారీగా నిధుల విడుదల

ఆంధ్రప్రదేశ్‌కు కేంద్ర ప్రభుత్వం మరోసారి నిధులను విడుదల చేసింది. దీనదయాళ్ అంత్యోదయ...

ప్రేమలో ‘బుట్టబొమ్మ’.. బాలీవుడ్ హీరోతో పూజా హెగ్డే సీక్రెట్ డేటింగ్?..ఫోటోలు వైరల్

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే ప్రేమలో పడినట్లు గత కొన్ని...