పీఎం కిసాన్ అనర్హుల గుర్తింపు.. తెలంగాణలో 32 వేల మంది రైతులు, పేర్ల తొలగింపు ప్రక్రియ ప్రారంభం

Date:

పీఎం కిసాన్ పథకంలో అనర్హుల ఏరివేత ప్రక్రియను అధికారులు ప్రారంభించారు. అయితే ఈ పథకంలో భాగంగా తెలంగాణ నుంచి 32 వేల మంది రైతులు అనర్హులుగా ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఈ నేపథ్యంలోనే వారి పేర్లను అర్హుల జాబితా నుంచి తొలగించే పనిలో పడ్డారు. ఐటీ చెల్లింపుదారులు, భూమిని అమ్మేసినప్పటికీ.. ఇంకా పీఎం కిసాన్ సొమ్మును అందుకుంటున్నట్లు గుర్తించిన అధికారులు.. వారికి సాయాన్ని కట్ చేయనున్నట్లు తెలిపారు.

కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం వ్యవసాయం చేసే రైతులకు ఆర్థికంగా అండగా ఉండేందుకు.. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన ( పీఎం కిసాన్ ) పథకాన్ని ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. అయితే ఈ పథకం కింద కేంద్ర ప్రభుత్వం ప్రతీ సంవత్సరం మూడు విడతల్లో రూ.2 వేల చొప్పున మొత్తం రూ.6 వేలను రైతుల ఖాతాల్లో జమ చేస్తోంది. 2018-19 సంవత్సరంలో ప్రారంభమైన ఈ పీఎం కిసాన్ పథకంలో భాగంగా ఇప్పటివరకు 21 విడతలుగా.. దేశవ్యాప్తంగా ఉన్న అర్హులైన రైతుల అకౌంట్లలో రూ.14,237.05 కోట్లను వేసినట్లు కేంద్ర వ్యవసాయ శాఖ అధికారులు వెల్లడించిన గణాంకాలు చెబుతున్నాయి.

కానీ.. పీఎం కిసాన్ పథకం నిబంధనలను అతిక్రమించి కొందరు అనర్హులు కూడా కేంద్రం నుంచి సాయం పొందుతున్నట్లు అధికారులు గుర్తించారు. దీంతో వారిని గుర్తించి.. వారికి పీఎం కిసాన్ నిధులను కట్ చేయాలని కేంద్రం భావించింది. ఇందులో భాగంగానే ఈ పథకం అనర్హులను గుర్తించే పనిలో పడింది. ఈ క్రమంలోనే తెలంగాణలో 32 వేల మంది రైతులు.. నిబంధనలకు విరుద్ధంగా కేంద్రం నుంచి సాయాన్ని పొందుతున్నారని గుర్తించారు. ఆదాయపు పన్ను కట్టేవారు, భూమిని విక్రయించిన వారే అత్యధికంగా ఉన్నట్లు గుర్తించారు.

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

హైడ్రా భారీ ఆపరేషన్‌.. రూ.15 వేల కోట్ల 863 ఎకరాల రక్షణకు చర్యలు.. 6 అంతస్తుల బిల్డింగ్ కూల్చివేత

హైదరాబాద్‌లో హైడ్రా అధికారులు మరో భారీ ఆపరేషన్ చేపట్టారు. ఏకంగా రూ.15...

తిరుమలలో రికార్డు స్థాయిలో పెరిగిన లడ్డూ ప్రసాదం విక్రయాలు.. ఏడాదిలో ఎన్నో తెలుసా!

తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదాల అమ్మకాలు రికార్డు స్థాయిలో పెరిగాయి. 2025-2026కు...

అమరావతి ఔటర్ రింగ్ రోడ్డులో 19 చోట్ల ఇంటర్‌ఛేంజ్‌లు.. ఎక్కడెక్కడ వస్తాయంటే!

ఏపీ రాజధాని అమరావతి ఔటర్ రింగ్ రోడ్డులో 19 ఇంటర్‌ఛేంజ్‌లు ప్లాన్...

ఉద్యోగులకు మళ్లీ నిరాశే.. జీపీఎఫ్ వడ్డీ రేట్లు ప్రకటన.. ఇప్పుడు ఎంత శాతమంటే

కేంద్ర ప్రభుత్వం ఇటీవల స్మాల్ సేవింగ్స్ స్కీమ్స్ వడ్డీ రేట్లను సవరించిన...