వాహనదారులకు షాకిచ్చిన ఆ ప్రభుత్వం భారీగా పెరిగిన పెట్రోల్‌, డీజిల్‌ ధరలు!

Date:

మధ్యప్రాచ్యంలో పెరుగుతున్న యుద్ధం మధ్య, ప్రపంచ మార్కెట్లో ముడి చమురు ధరలు బ్యారెల్‌కు $100 దాటాయి. అయినప్పటికీ, పెట్రోల్, డీజిల్ ధరలు పెంచడం లేదని భారత ప్రభుత్వ వర్గాలు మరోసారి పేర్కొన్నాయి. ఇదిలా ఉంటే.. శ్రీలంకలో పెట్రోల్‌, డీజిల్‌ ధరలు భారీగా పెరిగాయి. ఆక్టేన్‌ 92 పెట్రోల్‌పై రూ.24 పెంపు తర్వాత లీటర్‌కు రూ.317కు చేరింది.

ఇక ఆక్టేన్‌ 95 పెట్రోల్‌పై రూ.25 పెరిగింది. ధర పెరిగిన తర్వాత లీటర్‌ ధర రూ.365కు చేరింది. ఇక ఆటో డీజిల్‌పై రూ.22 పెరిగింది. దీంతో లీటర్‌ ధర రూ.303కు చేరింది. ఇక సూపర్‌ డీజిల్‌పై రూ.24 పెరిగింది. ధర పెరిగిన తర్వాత రూ.353కు చేరింది.

అలాగే కిరోసిన్‌పై రూ.13 పెరిగింది. ధర పెరిగిన తర్వాత లీటర్‌ ధర రూ.195 వద్ద కొనసాగుతోంది. ఇదిలా ఉండగా, పాకిస్తాన్‌లో ఇప్పటికే పెట్రోల్‌, డీజిల్‌ ధర భారీగా పెరిగింది. అక్కడ లీటర్‌ పెట్రోల్‌పై ఏకంగా 55 రూపాయలు పెంచేసింది పాక్‌ ప్రభుత్వం.

ఇదిలా ఉండగా, చమురు ధరలపై అమెరికా అలర్ట్‌ అయ్యింది. ధరలను అదుపు చేసేందుకు ట్రంప్‌ రంగంలోకి దిగారు. చమురు ధరలను అదుపు చేయడానికి అన్ని విధాలా ప్రయత్నిస్తున్నట్లు వైట్‌ హౌస్‌ ప్రకటించింది. అయితే ఈ చమురు ధరలు పెరగడం తాత్కాలికమేనని వెల్లడించింది.

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

Hyderabad: ఆర్‌ఆర్‌ఆర్‌ ఉత్తర భాగంపై కీలక అప్డేట్.. 2 ప్యాకేజీలుగా మార్పు, టెండర్లకు ఆహ్వానం

రీజినల్ రింగ్ రోడ్డు (ఆర్‌ఆర్‌ఆర్‌) ఉత్తర భాగం పనులపై కీలక అప్డేట్...

ఏపీలో రిలయన్స్‌ డేటాసెంటర్‌.. చంద్రబాబు సర్కార్ భారీ ప్రోత్సాహకాలు, ఏకంగా వేల కోట్లు!

విజయనగరం జిల్లాలో ఏర్పాటు చేయనున్న రిలయన్స్ డేటా సెంటర్‌కు ఏపీ ప్రభుత్వం...

మాట నిలబెట్టుకున్న టీడీపీ ఎమ్మెల్యే గల్లా మాధవి.. పదో తరగతి విద్యార్థులకు విమాన ప్రయాణం

టీడీపీ ఎమ్మెల్యే గల్లా మాధవి.. తాను ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు. కొన్ని...

తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్.. 5 లక్షల బీమా, 2 లక్షల కొత్త ఫించన్లు, ఇంకా మరెన్నో.. రేవంత్ సర్కార్ జూన్ 2 బిగ్ ప్లాన్..!

రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జూన్ 2న ప్రజలకు శుభవార్తలు చెప్పేందుకు...