వాహనదారులకు షాకిచ్చిన ఆ ప్రభుత్వం భారీగా పెరిగిన పెట్రోల్‌, డీజిల్‌ ధరలు!

Date:

మధ్యప్రాచ్యంలో పెరుగుతున్న యుద్ధం మధ్య, ప్రపంచ మార్కెట్లో ముడి చమురు ధరలు బ్యారెల్‌కు $100 దాటాయి. అయినప్పటికీ, పెట్రోల్, డీజిల్ ధరలు పెంచడం లేదని భారత ప్రభుత్వ వర్గాలు మరోసారి పేర్కొన్నాయి. ఇదిలా ఉంటే.. శ్రీలంకలో పెట్రోల్‌, డీజిల్‌ ధరలు భారీగా పెరిగాయి. ఆక్టేన్‌ 92 పెట్రోల్‌పై రూ.24 పెంపు తర్వాత లీటర్‌కు రూ.317కు చేరింది.

ఇక ఆక్టేన్‌ 95 పెట్రోల్‌పై రూ.25 పెరిగింది. ధర పెరిగిన తర్వాత లీటర్‌ ధర రూ.365కు చేరింది. ఇక ఆటో డీజిల్‌పై రూ.22 పెరిగింది. దీంతో లీటర్‌ ధర రూ.303కు చేరింది. ఇక సూపర్‌ డీజిల్‌పై రూ.24 పెరిగింది. ధర పెరిగిన తర్వాత రూ.353కు చేరింది.

అలాగే కిరోసిన్‌పై రూ.13 పెరిగింది. ధర పెరిగిన తర్వాత లీటర్‌ ధర రూ.195 వద్ద కొనసాగుతోంది. ఇదిలా ఉండగా, పాకిస్తాన్‌లో ఇప్పటికే పెట్రోల్‌, డీజిల్‌ ధర భారీగా పెరిగింది. అక్కడ లీటర్‌ పెట్రోల్‌పై ఏకంగా 55 రూపాయలు పెంచేసింది పాక్‌ ప్రభుత్వం.

ఇదిలా ఉండగా, చమురు ధరలపై అమెరికా అలర్ట్‌ అయ్యింది. ధరలను అదుపు చేసేందుకు ట్రంప్‌ రంగంలోకి దిగారు. చమురు ధరలను అదుపు చేయడానికి అన్ని విధాలా ప్రయత్నిస్తున్నట్లు వైట్‌ హౌస్‌ ప్రకటించింది. అయితే ఈ చమురు ధరలు పెరగడం తాత్కాలికమేనని వెల్లడించింది.

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

హైడ్రా భారీ ఆపరేషన్‌.. రూ.15 వేల కోట్ల 863 ఎకరాల రక్షణకు చర్యలు.. 6 అంతస్తుల బిల్డింగ్ కూల్చివేత

హైదరాబాద్‌లో హైడ్రా అధికారులు మరో భారీ ఆపరేషన్ చేపట్టారు. ఏకంగా రూ.15...

తిరుమలలో రికార్డు స్థాయిలో పెరిగిన లడ్డూ ప్రసాదం విక్రయాలు.. ఏడాదిలో ఎన్నో తెలుసా!

తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదాల అమ్మకాలు రికార్డు స్థాయిలో పెరిగాయి. 2025-2026కు...

అమరావతి ఔటర్ రింగ్ రోడ్డులో 19 చోట్ల ఇంటర్‌ఛేంజ్‌లు.. ఎక్కడెక్కడ వస్తాయంటే!

ఏపీ రాజధాని అమరావతి ఔటర్ రింగ్ రోడ్డులో 19 ఇంటర్‌ఛేంజ్‌లు ప్లాన్...

ఉద్యోగులకు మళ్లీ నిరాశే.. జీపీఎఫ్ వడ్డీ రేట్లు ప్రకటన.. ఇప్పుడు ఎంత శాతమంటే

కేంద్ర ప్రభుత్వం ఇటీవల స్మాల్ సేవింగ్స్ స్కీమ్స్ వడ్డీ రేట్లను సవరించిన...