వాహనదారులకు షాకిచ్చిన ఆ ప్రభుత్వం భారీగా పెరిగిన పెట్రోల్‌, డీజిల్‌ ధరలు!

Date:

మధ్యప్రాచ్యంలో పెరుగుతున్న యుద్ధం మధ్య, ప్రపంచ మార్కెట్లో ముడి చమురు ధరలు బ్యారెల్‌కు $100 దాటాయి. అయినప్పటికీ, పెట్రోల్, డీజిల్ ధరలు పెంచడం లేదని భారత ప్రభుత్వ వర్గాలు మరోసారి పేర్కొన్నాయి. ఇదిలా ఉంటే.. శ్రీలంకలో పెట్రోల్‌, డీజిల్‌ ధరలు భారీగా పెరిగాయి. ఆక్టేన్‌ 92 పెట్రోల్‌పై రూ.24 పెంపు తర్వాత లీటర్‌కు రూ.317కు చేరింది.

ఇక ఆక్టేన్‌ 95 పెట్రోల్‌పై రూ.25 పెరిగింది. ధర పెరిగిన తర్వాత లీటర్‌ ధర రూ.365కు చేరింది. ఇక ఆటో డీజిల్‌పై రూ.22 పెరిగింది. దీంతో లీటర్‌ ధర రూ.303కు చేరింది. ఇక సూపర్‌ డీజిల్‌పై రూ.24 పెరిగింది. ధర పెరిగిన తర్వాత రూ.353కు చేరింది.

అలాగే కిరోసిన్‌పై రూ.13 పెరిగింది. ధర పెరిగిన తర్వాత లీటర్‌ ధర రూ.195 వద్ద కొనసాగుతోంది. ఇదిలా ఉండగా, పాకిస్తాన్‌లో ఇప్పటికే పెట్రోల్‌, డీజిల్‌ ధర భారీగా పెరిగింది. అక్కడ లీటర్‌ పెట్రోల్‌పై ఏకంగా 55 రూపాయలు పెంచేసింది పాక్‌ ప్రభుత్వం.

ఇదిలా ఉండగా, చమురు ధరలపై అమెరికా అలర్ట్‌ అయ్యింది. ధరలను అదుపు చేసేందుకు ట్రంప్‌ రంగంలోకి దిగారు. చమురు ధరలను అదుపు చేయడానికి అన్ని విధాలా ప్రయత్నిస్తున్నట్లు వైట్‌ హౌస్‌ ప్రకటించింది. అయితే ఈ చమురు ధరలు పెరగడం తాత్కాలికమేనని వెల్లడించింది.

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

Raksha Bandhan 2026: రాఖీ పండుగపై క్లారిటీ.. ఆగస్టు 28నే రక్షాబంధన్‌.. శుభ ముహూర్తం ఇదే!

రక్షాబంధన్‌ పండుగ తేదీపై నెలకొన్న సందేహాలకు పండితులు స్పష్టత ఇచ్చారు. 2026లో...

వర్షాకాలంలో ఖర్జూరాలు తింటే ఏం జరుగుతుందో తెలుసా..? డాక్టర్లు చెప్పిన విషయాలు ఇవే!

ఖర్జూరాలు ప్రకృతి అందించిన తీపి, పోషక విలువలు కలిగిన పండ్లలో ఒకటి....

‘పాకిస్థాన్‌ది ఆక్రోశం’.. కశ్మీర్‌ గురించి అమెరికా రాయబారి వ్యాఖ్యలకు సమన్లు జారీపై భారత్ స్పందన

జమ్మూ కశ్మీర్‌ భారత్‌లో అంతర్భాగమేనని న్యూఢిల్లీ మరోసారి స్పష్టం చేసింది. కశ్మీర్‌లో...

Dragon Fruit: డ్రాగన్ ఫ్రూట్ అందరికీ సూట్ అవుతుందా? ఈ ఆరోగ్య సమస్యలు ఉంటే మాత్రం జాగ్రత్త!

డ్రాగన్ ఫ్రూట్ అందరికీ సరిపోతుందా? డ్రాగన్ ఫ్రూట్‌ చూడటానికి ఆకర్షణీయంగా ఉండటమే కాకుండా,...