హైదరాబాద్‌లో హోటళ్లు, రెస్టారెంట్లు బంద్‌.. హోటల్స్ అసోసియేషన్స్ కీలక నిర్ణయం!

Date:

గ్యాస్‌ కొరత నేపథ్యంలో ప్రధానమంత్రి మోడీ మంత్రివర్గ సమావేశంలో మంత్రులకు ఒక ప్రత్యేక సందేశాన్ని కూడా ఇచ్చారు. పశ్చిమ ఆసియాలో యుద్ధ సంక్షోభం సామాన్యులపై ప్రభావం చూపకుండా చూసుకోవాలని ఆయన వారిని కోరారు. ఈ దిశగా మంత్రిత్వ శాఖలు. దేశంలోని వివిధ ప్రాంతాల్లో గ్యాస్ సరఫరా విషయంలో భయాందోళనలు చెలరేగాయి. హోటళ్లు, రెస్టారెంట్లు మూతపడే దశలో ఉన్నాయి.

గ్యాస్ ఏజెన్సీల వెలుపల ప్రజల పొడవైన క్యూలు మొదటగా కనిపించేది ఢిల్లీలోనే. గ్యాస్ సిలిండర్ సంక్షోభం చాలా తీవ్రంగా మారిందని చెబుతున్నారు.
కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల కొరత ఇప్పుడు మార్కెట్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ క్రమంలోనే హైదరాబాద్‌లో హోటల్స్ నడపడంపై తెలంగాణ హోటల్స్ అసోసియేషన్ సభ్యులు మంగళవారం సమావేశమై చర్చించారు.

ఆ తర్వాత మీడియాతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలోని హోటల్స్, రెస్టారెంట్‌లకు కమర్షియల్ గ్యాస్ సరఫరా నిలిచిపోయిందని హోటల్స్ అసోసియేషన్స్‌ తెలిపింది. ఇప్పటికే హైదరాబాద్‌లో చాలా హోటళ్లు, రెస్టారెంట్లను మూసివేసినట్లు తెలిపింది. అలాగే వాణిజ్య గ్యాస్ సరఫరా కొరతను ఎదుర్కొనే తదుపరి నగరం ముంబై. చాలా హోటళ్ళు స్టాక్ అయిపోయాయని చెబుతున్నాయి.

గ్యాస్ కొరత అనేక ప్రధాన రంగాలకు తీవ్రమైన సంక్షోభాన్ని సృష్టించిందని, అవి మూసివేత అంచున ఉన్నాయని నివేదిస్తున్నారు. ఇంకా, భోపాల్ కూడా గ్యాస్ సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. రెస్టారెంట్ యజమానులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ దిశగా మంత్రిత్వ శాఖలు, విభాగాలు కలిసి పనిచేయాలని సూచించారు. దేశంలో గ్యాస్‌ కొరత లేకుండా అందరికి అందేలా చర్యలు చేపడుతున్నామని, సోషల్‌ మీడియాలో వస్తున్న పుకార్లను నమ్మవద్దని కేంద్రం చెబుతోంది.

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

Hyderabad: ఆర్‌ఆర్‌ఆర్‌ ఉత్తర భాగంపై కీలక అప్డేట్.. 2 ప్యాకేజీలుగా మార్పు, టెండర్లకు ఆహ్వానం

రీజినల్ రింగ్ రోడ్డు (ఆర్‌ఆర్‌ఆర్‌) ఉత్తర భాగం పనులపై కీలక అప్డేట్...

ఏపీలో రిలయన్స్‌ డేటాసెంటర్‌.. చంద్రబాబు సర్కార్ భారీ ప్రోత్సాహకాలు, ఏకంగా వేల కోట్లు!

విజయనగరం జిల్లాలో ఏర్పాటు చేయనున్న రిలయన్స్ డేటా సెంటర్‌కు ఏపీ ప్రభుత్వం...

మాట నిలబెట్టుకున్న టీడీపీ ఎమ్మెల్యే గల్లా మాధవి.. పదో తరగతి విద్యార్థులకు విమాన ప్రయాణం

టీడీపీ ఎమ్మెల్యే గల్లా మాధవి.. తాను ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు. కొన్ని...

తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్.. 5 లక్షల బీమా, 2 లక్షల కొత్త ఫించన్లు, ఇంకా మరెన్నో.. రేవంత్ సర్కార్ జూన్ 2 బిగ్ ప్లాన్..!

రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జూన్ 2న ప్రజలకు శుభవార్తలు చెప్పేందుకు...