
నెల్లూరు జిల్లా కావలిలో ఓ దారుణ ఘటన చోటుచేసుకుంది. మేక పిల్లల దగ్గర మొదలైన పంచాయితీ పగల వరకూ వెళ్లి ప్రాణాలు తీశారు. ఓ యజమాని, కాపలా వ్యక్తి మధ్య మొదలైన వివాదం గ్రామ పెద్ద దగ్గరకు పంచాయితీగా వెళ్లింది. అక్కడ కాపలా వ్యక్తి గ్రామ పెద్దకు మర్యాద ఇవ్వకుండా మాట్లాడటంతో.. ఆ విషయాన్ని మనస్సులో పెట్టుకున్న గ్రామ పెద్ద. పక్కా ప్లాన్తో దాడి చేయించాడు.. చికిత్స పొందుతున్న ఆ వ్యక్తి మరణించడంతో పోలీసులు ఇద్దర్ని అరెస్టు చేశారు.
మేక పిల్లల పంచాయితీ ఒక మనిషి ప్రాణాలు తీసే వరకూ వెళ్లింది. ఓ యజమాని తన మేకను ఒకరి దగ్గర వదిలిపెట్టి వెళ్లాడు.. ఆ మేకకు ఐదు పిల్లలు పుట్టాయి. అయితే, దాన్ని చూసిన వ్యక్తి తనకు రెండు మేక పిల్లలు కావాలి అనడం.. యజమాని ఇవ్వను అనడంతో మొదలైన గొడవ.. పెద్దమనిషి పంచాయితీ వరకూ వెళ్లింది. ఆ తర్వాత వివాదం పెద్దదవడంతో ఏకంగా మనిషి ప్రాణాలు తీసే వరకూ వెళ్లింది. ఈ ఘటన నెల్లూరు జిల్లా కావలిలో చోటుచేసుకుంది.
గ్రామ పెద్ద, మాజీ సర్పంచ్ మందా మధు దృష్టికి జనార్దన్ ఈ గొడవను తీసుకెళ్లాడు. ఆ సమయంలో వాసు, సర్పంచ్ మధ్య మాటా మాటా పెరిగింది. దాంతో ఆగ్రహానికి గురైన గ్రామ పెద్ద మధు అతనికి ఎలాగైనా భయం పెట్టాలని అనుకున్నాడు. వాసును అడవిరాజుపాలెంలోని ఓ మద్యం దుకాణానికి ఈ నెల 10వ తేదీ తీసుకెళ్లారు. మద్యం తాగిన తర్వాత ముగ్గురితో కలిసి వాసుపై మధు దాడి చేయించాడు.

