HomeEntertainmentNBK : “అఖండ 2 హంగామా మొదలైంది: ప్రీ-రిలీజ్ ఈవెంట్‌కు సీఎం రేవంత్ రెడ్డి గౌరవ...

NBK : “అఖండ 2 హంగామా మొదలైంది: ప్రీ-రిలీజ్ ఈవెంట్‌కు సీఎం రేవంత్ రెడ్డి గౌరవ అతిధి!”

Published on

spot_img

నందమూరి బాలకృష్ణ–డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో వస్తున్న అఖండ సీక్వెల్ ‘అఖండ 2’ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే విడుదల చేసిన ఫస్ట్ గ్లింప్స్ సందడి సృష్టించింది. బాలకృష్ణ స్క్రీన్ ప్రెజెన్స్, ఆయన డైలాగ్స్ ఫ్యాన్స్‌లో మరింత ఉత్సాహాన్ని నింపాయి. ఇటీవల విడుదలైన ఫస్ట్ సింగిల్ ‘జాజికాయ జాజికాయ’ కోటి వ్యూస్ దాటి సెన్సేషన్‌గా మారింది. రామ్ ఆచంట–గోపి నిర్మిస్తున్న ఈ చిత్రానికి థమన్ సంగీతాన్ని అందిస్తున్నారు. డిసెంబర్ 5న అఖండ 2ను వరల్డ్‌వైడ్‌గా 3Dలో విడుదల చేస్తున్నట్టు చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది.

ఈ నేపథ్యంలో ప్రమోషన్స్‌కు మరింత వేగం ఇచ్చింది టీమ్. దాని భాగంగానే అఖండ 2 ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ను భారీ స్థాయిలో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నెల నవంబర్ 28న జరగనున్న ఈ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌కు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ముఖ్య అతిధిగా హాజరుకానున్నారు. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలో వెలువడనుంది.

అలాగే, ఈ వేడుకకు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గారిని కూడా ఆహ్వానించేందుకు మేకర్స్ ప్లాన్ చేసినప్పటికీ, అట్లీ దర్శకత్వం వహిస్తున్న చిత్ర షూటింగ్‌తో బన్నీ బిజీగా ఉండటం వల్ల ఈ ఈవెంట్‌కు హాజరుకాలేరని తెలుస్తోంది. అయితే సినిమా రిలీజ్ అయిన తర్వాత జరిగే సక్సెస్ మీట్‌కు ఆయన వచ్చే అవకాశం ఉందని సమాచారం.

మరోవైపు, డిసెంబర్ 4న రాత్రి నుంచే ప్రీమియర్ షోలు నిర్వహించాలనే ఆలోచనలో ఉన్నారు నిర్మాతలు. ఇందుకు కావాల్సిన అనుమతుల కోసం వారు ఎదురుచూస్తున్నారు.

Latest articles

ఏపీ ప్రజలకు మరో గుడ్‌న్యూస్.. 2500 ఎకరాల్లో ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ సిటీ.. ఆ ప్రాంతం దశ తిరిగినట్టే

ఆంధ్రప్రదేశ్‌లో భారీ విస్తీర్ణంలో ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ సిటీని నిర్మించాలని చంద్రబాబు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రపంచంలోనే టాప్ 5...

విశాఖ, విజయవాడలో డబుల్ డెక్కర్ ఎలివేటెడ్ కారిడార్.. ఒకే ఫ్లైఓవర్‌పై వాహనాలు, మెట్రో రైలు రయ్‌రయ్

విశాఖ, విజయవాడ నగరాల్లో జాతీయ రహదారులపై డబుల్ డెక్కర్ కారిడార్లను నిర్మించడానికి అడుగులు పడుతున్నాయి. ఈ మేరకు జాతీయ...

ఏపీలో ఆ నియోజకవర్గ ప్రజలకు శుభవార్త 8 వేలకోట్లతో స్టీల్ ఫ్యాక్టరీ ఆ ప్రాంతం దశ తిరిగినట్లే

ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు పలు సంస్థలు ఆసక్తి చూపుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే విజయనగరం జిల్లా చీపురుపల్లిలో...

శ్రీశైలం వెళ్లే భక్తులకు శుభవార్త నేటి నుంచి లడ్డూలు ఉచితంగా ఇస్తారు

శ్రీశైలం వెళ్లే మల్లన్న భక్తులకు శుభవార్త. డిసెంబర్ 1వ తేదీ నుంచి మల్లన్న భక్తులకు ఉచిత లడ్డూ ప్రసాదాలు...

More like this

ఏపీ ప్రజలకు మరో గుడ్‌న్యూస్.. 2500 ఎకరాల్లో ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ సిటీ.. ఆ ప్రాంతం దశ తిరిగినట్టే

ఆంధ్రప్రదేశ్‌లో భారీ విస్తీర్ణంలో ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ సిటీని నిర్మించాలని చంద్రబాబు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రపంచంలోనే టాప్ 5...

విశాఖ, విజయవాడలో డబుల్ డెక్కర్ ఎలివేటెడ్ కారిడార్.. ఒకే ఫ్లైఓవర్‌పై వాహనాలు, మెట్రో రైలు రయ్‌రయ్

విశాఖ, విజయవాడ నగరాల్లో జాతీయ రహదారులపై డబుల్ డెక్కర్ కారిడార్లను నిర్మించడానికి అడుగులు పడుతున్నాయి. ఈ మేరకు జాతీయ...

ఏపీలో ఆ నియోజకవర్గ ప్రజలకు శుభవార్త 8 వేలకోట్లతో స్టీల్ ఫ్యాక్టరీ ఆ ప్రాంతం దశ తిరిగినట్లే

ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు పలు సంస్థలు ఆసక్తి చూపుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే విజయనగరం జిల్లా చీపురుపల్లిలో...