Andhra Pradesh: ఏపీలో వారి అకౌంట్లోకి కూడా రూ.25 వేలు.. వారం రోజుల్లో జమ.. రెడీగా ఉండండి..

Date:

ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నేతన్న సేవలో పథకం సొమ్మును ఇటీవల ప్రభుత్వం లబ్దిదారుల బ్యాంక్ ఖాతాల్లో జమ చేసింది. ఒక్కొక్కరికి రూ.25 వేల చొప్పున అందించింది. అయితే కొంతమంది అర్హులకు డబ్బులు పడకపోవడంతో ఆందోళన చెందుతున్నారు. వీరికి ప్రభుత్వం ఊరట కల్పించింది.

ఏపీ ప్రభుత్వం మరో కొత్త పథకానికి శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. అదే నేతన్న సేవలో స్కీమ్. ఇటీవల సీఎం చంద్రబాబు ఈ పథకాన్ని స్వయంగా ప్రారంభించారు. చేనేత కుటుంబాలకు రూ.25 వేల చొప్పున బ్యాంక్ ఖాతాల్లో జమ చేశారు. నేతన్నలకు ఆర్ధికంగా తోడ్పాటు అందించాలనే ఉద్దేశంతో ఈ పథకం ప్రారంభించినట్లు కూటమి సర్కార్ స్పష్టం చేసింది. అయితే ఇంకా కొంతమందికి డబ్బులు పడకపోవడంతో ఆందోళన చెందుతున్నారు. దీంతో వీరికి భరోసా కల్పిస్తూ ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. అర్హత ఉండి అందకపోతే దరఖాస్తులను మళ్లీ పరిశీలిస్తామని తెలిపింది. అర్హులను మరోసారి గుర్తించి వారం రోజుల్లోగా డబ్బులు జమ చేయనున్నట్లు మంత్రి సవిత తెలిపారు. ఆగస్ట్ 7వ తేదీన జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా ప్రభుత్వం నగదు జమ చేసిన విషయం తెలిసిందే.

వారం రోజుల్లో నగదు జమ

సచివాలయంలో నేతన్న సేవలో పథకంపై మంత్రి సవిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కొంతమందికి డబ్బులు పడలేదనే వార్తలపై స్పందించారు. అర్హులను గుర్తించి వారం రోజుల్లోగా డబ్బులు జమ చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటివరకు 71,536 మందికి రూ.25 వేల చొప్పున జమ చేసినట్లు తెలిపారు. అర్హులైనవారిని గుర్తించి అందరికీ అందించేలా చర్యలు తీసుకుంటున్నట్లు స్పష్టం చేశారు. ఈ పథకం కోసం 13,678 మంది కొత్తగా దరఖాస్తు చేసుకున్నారని, వారి అప్లికేషన్లను పరిశీలించి వారం రోజుల్లో రూ.25 వేలు అందిస్తామని తెలిపారు. చేనేతల కుటుంబానికి తమ కుటుంబం కట్టుబడి ఉందని, 50 ఏళ్లు నిండిన వారందరికీ పింఛన్లు అందిస్తామని చెప్పారు. 85,678 మంది పింఛన్లు ఇప్పటికే అందుకున్నారని, అలాగే 62,541 చేనేత కుటుంబాలకు ఉచిత విద్యుత్ అందిస్తామని పేర్కొన్నారు.

నేతన్న సేవలో పథకానికి దరఖాస్తు ఎలా..?

మీ పరిధిలోని గ్రామ, వార్డు సచివాలయానికి వెళ్లాలి. అక్కడ దరఖాస్తులను నింపాలి. అలాగే అవసరమైన డాక్యుమెంట్లతో జత చేసి దరఖాస్తు ఫారాలను సచివాలయ అధికారులకు అందించాలి. దీంతో సచివాలయ అధికారుల పరిశీలించి మీకు అర్హత ఉంటే పై అధికారులను వివరాలు పంపిస్తారు. దీంతో మీ పేరును లబ్దిదారుల జాబితాలో చేరుస్తారు. అనంతరం మీ బ్యాంక్ ఖాతాల్లో డబ్బులు జమ అవుతాయి. దీంతో అర్హులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సవిత ప్రకటించారు. ప్రతీఒక్కరికీ డబ్బులు అందుతాయని, ఎవ్వరూ కంగారు పడాల్సిన అవసరం లేదని తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

Raksha Bandhan 2026: రాఖీ పండుగపై క్లారిటీ.. ఆగస్టు 28నే రక్షాబంధన్‌.. శుభ ముహూర్తం ఇదే!

రక్షాబంధన్‌ పండుగ తేదీపై నెలకొన్న సందేహాలకు పండితులు స్పష్టత ఇచ్చారు. 2026లో...

వర్షాకాలంలో ఖర్జూరాలు తింటే ఏం జరుగుతుందో తెలుసా..? డాక్టర్లు చెప్పిన విషయాలు ఇవే!

ఖర్జూరాలు ప్రకృతి అందించిన తీపి, పోషక విలువలు కలిగిన పండ్లలో ఒకటి....

‘పాకిస్థాన్‌ది ఆక్రోశం’.. కశ్మీర్‌ గురించి అమెరికా రాయబారి వ్యాఖ్యలకు సమన్లు జారీపై భారత్ స్పందన

జమ్మూ కశ్మీర్‌ భారత్‌లో అంతర్భాగమేనని న్యూఢిల్లీ మరోసారి స్పష్టం చేసింది. కశ్మీర్‌లో...

Dragon Fruit: డ్రాగన్ ఫ్రూట్ అందరికీ సూట్ అవుతుందా? ఈ ఆరోగ్య సమస్యలు ఉంటే మాత్రం జాగ్రత్త!

డ్రాగన్ ఫ్రూట్ అందరికీ సరిపోతుందా? డ్రాగన్ ఫ్రూట్‌ చూడటానికి ఆకర్షణీయంగా ఉండటమే కాకుండా,...