ఏపీ ప్రజలపై మరో భారం.. పాలు, పెరుగు ధరలు పెంపు.. కొత్త రేట్లు ఇవే

Date:

ఏపీలో విజయ, సంగం డెయిరీ పాల ప్యాకెట్ల ధరలు పెంచారు. విజయ డెయిరీకి సంబంధించి లీటరు పాల ధరను రూ.2 చొప్పున పెంచినట్లు కృష్ణా మిల్క్‌ యూనియన్‌ తెలిపింది. విజయ డెయిరీకి సంబంధించి ఈ ధరలు కృష్ణా, ఎన్టీఆర్, ఏలూరు జిల్లాల్లో అమల్లో ఉంటాయి. ఈ నెల 4 నుంచి అమల్లోకి వస్తాయి. సంగం డెయిరీకి సంబంధించి పెంచిన పాల ధరలు ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వచ్చాయి.

ఆంధ్రప్రదేశ్‌లో పాలు ధరలు పెరిగాయి.. ఇటీవల రైతులకు పాలసేకరణ ధరలు పెరగడం, వ్యయం పెరగడంతో.. విజయ, సంగం డెయిరీలు పెంచిన సంగతి తెలిసిందే. ఈ మేరకు విజయ, సంగం డెయిరీ పాల ప్యాకెట్ల ధరలు పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి. మార్కెట్‌లో విజయ లీటరు పాల ధరను రూ.2 చొప్పున పెంచినట్లు కృష్ణా మిల్క్‌ యూనియన్‌ ప్రకటించింది. ఈ నెల 4 నుంచి పెరిగిన ధరల కృష్ణా, ఎన్టీఆర్, ఏలూరు జిల్లాల్లో అమల్లోకి వస్తాయని తెలిపింది. ఈ నెల 9 వరకు నెలవారీ పాల కార్డు కొనుగోలు చేసిన వారికి మాత్రం పాత ధరలు వర్తిస్తాయి. మొత్త ఏడు రకాల పాల ధరలు పెంచారు. అంతేకాదు పెరుగుపై రూ.10 నుంచి రూ.30 వరకు పెరిగింది. 10 కేజీల స్టాండర్డ్ మిల్క్ పెరుగు బకెట్ ధర రూ.40 పెరిగింది.

మరోవైపు సంగం డెయిరీ కూడా ప్రస్తుతం ఉన్న ధరకు లీటరు ప్యాకెట్‌పై రూ.2, అర లీటరు ప్యాకెట్‌పై రూ.1 చొప్పున పెంచింది. పాల ప్యాకెట్లపై పెంచిన ధరలు ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వచ్చాయని ఎండీ గోపాల కృష్ణన్‌ తెలిపారు. పాల సేకరణ, ప్యాకింగ్‌ సామాగ్రి, ఇతర వ్యయాలు పెరిగడంతో ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. కొత్త ధరల విషయానికి వస్తే.. సంగం గోల్డ్‌ ప్లస్‌ అర లీటర్ ధర రూ.37 కాగా.. రూపాయి పెంచి రూ. 38కి పెరిగింది. హెచ్‌ఎఫ్‌సీఎం గోల్డ్‌ ప్యాకెట్‌ అర లీటరు ధర రూ.36 నుంచి రూ.37కుపెంచారు.. అదే లీటర్ ధ రూ.70 నుంచి 72కు పెంచారు.

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

Hyderabad: ఆర్‌ఆర్‌ఆర్‌ ఉత్తర భాగంపై కీలక అప్డేట్.. 2 ప్యాకేజీలుగా మార్పు, టెండర్లకు ఆహ్వానం

రీజినల్ రింగ్ రోడ్డు (ఆర్‌ఆర్‌ఆర్‌) ఉత్తర భాగం పనులపై కీలక అప్డేట్...

ఏపీలో రిలయన్స్‌ డేటాసెంటర్‌.. చంద్రబాబు సర్కార్ భారీ ప్రోత్సాహకాలు, ఏకంగా వేల కోట్లు!

విజయనగరం జిల్లాలో ఏర్పాటు చేయనున్న రిలయన్స్ డేటా సెంటర్‌కు ఏపీ ప్రభుత్వం...

మాట నిలబెట్టుకున్న టీడీపీ ఎమ్మెల్యే గల్లా మాధవి.. పదో తరగతి విద్యార్థులకు విమాన ప్రయాణం

టీడీపీ ఎమ్మెల్యే గల్లా మాధవి.. తాను ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు. కొన్ని...

తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్.. 5 లక్షల బీమా, 2 లక్షల కొత్త ఫించన్లు, ఇంకా మరెన్నో.. రేవంత్ సర్కార్ జూన్ 2 బిగ్ ప్లాన్..!

రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జూన్ 2న ప్రజలకు శుభవార్తలు చెప్పేందుకు...