అమరావతిలో మరో ఫైవ్ స్టార్ హోటల్.. రూ.300 కోట్లతో 200 గదులు.. యువతకు ఉద్యోగాలు

Date:

అమరావతిలో మరో ఫైవ్‌ స్టార్‌ హోటల్‌ ఏర్పాటకానుంది. రాజధానిలోని శాఖమూరులో క్రౌన్‌ ప్లాజా ఫైవ్‌స్టార్‌ హోటల్‌ నిర్మాణ పనులు ప్రారంభించారు. మొత్తం 4 ఎకరాలలో 200 గదులు ఉండేలా రూ.300 కోట్లతో ఈ హోటల్‌ను నిర్మించనున్నారు. ఈ హోటల్ రాకతో 500 మందికి ఉద్యోగావకాశాలు లభిస్తాయని ఆ సంస్థ ప్రతినిధులు తెలిపారు. ఇటీవలే మరో స్టార్ హోటల్‌ కూడా అమరావతిలో ఏర్పాటు చేేసేందుకు ఒప్పందం చేసుకుంది.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలో పెట్టుబడులపై ఫోకస్ పెట్టింది.. ఈ క్రమంలో పరిశ్రమలు, ఐటీ సంస్థలు వరుసగా క్యూ కడుతున్నాయి. అయితే పర్యాటకరంగంలో పెట్టుబడుల్ని ప్రోత్సహిస్తున్న ప్రభుత్వం.. ప్రత్యేకంగా పాలసీని కూడా రూపొందించింది. ఇటీవల కాలంలో పర్యాటకరంగంలో కూడా పెట్టుబడులకు ప్రముఖ హోటల్స్ కూడా ఆసక్తి చూపాయి. తాజాగా రాష్ట్ర రాజధాని అమరావతికి మరో ఫైవ్ స్టార్ హోటల్ నిర్మాణంలో ముందడుగు పడింది. ఇండ్‌రాయల్ హోటల్స్ ప్రైవేట్ లిమిటెడ్ కన్సార్టియం ఆధ్వర్యంలో శాఖమూరు దగ్గర నాలుగు ఎకరాల విస్తీర్ణంలో క్రౌన్‌ ప్లాజా 5 స్టార్‌ హోటల్‌ను నిర్మించనున్నారు.

ఈ స్టార్ హోటల్‌ను రూ.300 కోట్లతో.. మొత్తం 200 గదులతో నిర్మించనున్నారు.. దాదాపు 500 మందికి ఉద్యోగాలు కల్పిస్తామని ఇండ్‌రాయల్ హోటల్స్ ప్రతినిధులు తెలిపారు. అమరావతిలో అభివృద్ధి దిశగా అడుగులు వేస్తు్న్నామని.. రాజధాని ప్రాంతంలో అభివృద్ధి సమానంగా విస్తరించే క్రమంలో సంస్థలకు భూములు కేటాయించి, వాటి కార్యకలాపాలు ప్రారంభమయ్యేలా చూస్తున్నామని సీఆర్డీఏ తెలిపింది.

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

Hyderabad: ఆర్‌ఆర్‌ఆర్‌ ఉత్తర భాగంపై కీలక అప్డేట్.. 2 ప్యాకేజీలుగా మార్పు, టెండర్లకు ఆహ్వానం

రీజినల్ రింగ్ రోడ్డు (ఆర్‌ఆర్‌ఆర్‌) ఉత్తర భాగం పనులపై కీలక అప్డేట్...

ఏపీలో రిలయన్స్‌ డేటాసెంటర్‌.. చంద్రబాబు సర్కార్ భారీ ప్రోత్సాహకాలు, ఏకంగా వేల కోట్లు!

విజయనగరం జిల్లాలో ఏర్పాటు చేయనున్న రిలయన్స్ డేటా సెంటర్‌కు ఏపీ ప్రభుత్వం...

మాట నిలబెట్టుకున్న టీడీపీ ఎమ్మెల్యే గల్లా మాధవి.. పదో తరగతి విద్యార్థులకు విమాన ప్రయాణం

టీడీపీ ఎమ్మెల్యే గల్లా మాధవి.. తాను ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు. కొన్ని...

తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్.. 5 లక్షల బీమా, 2 లక్షల కొత్త ఫించన్లు, ఇంకా మరెన్నో.. రేవంత్ సర్కార్ జూన్ 2 బిగ్ ప్లాన్..!

రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జూన్ 2న ప్రజలకు శుభవార్తలు చెప్పేందుకు...