చాలా బాధాకరం.. మీ తల్లిగారి ఆత్మకు శాంతి చేకూరాలి’.. పవన్ ఎమోషనల్ పోస్ట్

Date:

నటుడు ప్రకాశ్ రాజ్ మాతృమూర్తి సువర్ణలత (86) బెంగళూరులో కన్నుమూశారు. ఈ విషాద వార్తపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్పందిస్తూ తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. సువర్ణలత గారి ఆత్మకు శాంతి చేకూరాలని ఆయన ప్రార్థించారు . తిరుమల లడ్డూ వివాదం , సనాతన ధర్మం వంటి అంశాలపై వీరిద్దరి మధ్య తీవ్రమైన రాజకీయ విభేదాలు ఉన్నప్పటికీ , వ్యక్తిగత విషాద సమయంలో పవన్ స్పందించడం విశేషం.

విలక్షణ నటుడు ప్రకాశ్ రాజ్ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. ఆయన మాతృమూర్తి సువర్ణలత (86) సోమవారం ఉదయం బెంగళూరులోని తన స్వగృహంలో కన్నుమూశారు. గత కొంతకాలంగా వయోసహజ అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆమె, పరిస్థితి విషమించడంతో తుది శ్వాస విడిచారు. తల్లితో ఎంతో గాఢమైన అనుబంధం ఉన్న ప్రకాశ్ రాజ్, షూటింగ్స్ బిజీలో ఉన్నా తరచూ ఆమెను కలుస్తూ ఉండేవారు. మరణవార్త తెలియగానే ఆయన వెంటనే బెంగళూరు చేరుకున్నారు. సోమవారం సాయంత్రం బెంగళూరులోనే ఆమె అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.

ప్రకాశ్ రాజ్ మాతృమూర్తి మరణంపై ఏపీ ఉప ముఖ్యమంత్రి, జనసేనాని పవన్ కల్యాణ్ సోషల్‌మీడియా వేదికగా స్పందించారు. “ప్రముఖ నటుడు శ్రీ ప్రకాశ్ రాజ్ గారి మాతృమూర్తి శ్రీమతి సువర్ణలత గారు కన్నుమూశారని తెలిసి చింతించాను. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను. మాతృ వియోగానికి లోనైన శ్రీ ప్రకాశ్ రాజ్ గారికి, ఆయన కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను” అంటూ పవన్ తన సందేశాన్ని పంచుకున్నారు. రాజకీయంగా వీరిద్దరి మధ్య ఎన్ని విభేదాలు ఉన్నప్పటికీ, ఒక వ్యక్తిగత విషాద సమయంలో పవన్ స్పందించిన తీరు చర్చనీయాంశమైంది.

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

హైడ్రా భారీ ఆపరేషన్‌.. రూ.15 వేల కోట్ల 863 ఎకరాల రక్షణకు చర్యలు.. 6 అంతస్తుల బిల్డింగ్ కూల్చివేత

హైదరాబాద్‌లో హైడ్రా అధికారులు మరో భారీ ఆపరేషన్ చేపట్టారు. ఏకంగా రూ.15...

తిరుమలలో రికార్డు స్థాయిలో పెరిగిన లడ్డూ ప్రసాదం విక్రయాలు.. ఏడాదిలో ఎన్నో తెలుసా!

తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదాల అమ్మకాలు రికార్డు స్థాయిలో పెరిగాయి. 2025-2026కు...

అమరావతి ఔటర్ రింగ్ రోడ్డులో 19 చోట్ల ఇంటర్‌ఛేంజ్‌లు.. ఎక్కడెక్కడ వస్తాయంటే!

ఏపీ రాజధాని అమరావతి ఔటర్ రింగ్ రోడ్డులో 19 ఇంటర్‌ఛేంజ్‌లు ప్లాన్...

ఉద్యోగులకు మళ్లీ నిరాశే.. జీపీఎఫ్ వడ్డీ రేట్లు ప్రకటన.. ఇప్పుడు ఎంత శాతమంటే

కేంద్ర ప్రభుత్వం ఇటీవల స్మాల్ సేవింగ్స్ స్కీమ్స్ వడ్డీ రేట్లను సవరించిన...