
అమరావతి, ఆంధ్రప్రదేశ్లో ఇన్ సర్వీస్ ఉపాధ్యాయుల కోసం ప్రత్యేక ఉపాధ్యాయ అర్హత పరీక్ష (స్పెషల్ టెట్) నిర్వహించనున్నట్లు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ తెలిపారు. టెట్ అర్హత సాధించేందుకు ఇన్ సర్వీస్ టీచర్లకు ఇది మంచి అవకాశమని పేర్కొన్నారు.
స్పెషల్ టెట్లో అర్హత సాధించడం ద్వారా ఉపాధ్యాయులు తమ వృత్తి ప్రయాణాన్ని మరింత ఆత్మవిశ్వాసంతో కొనసాగించేందుకు అవకాశం ఉంటుందని మంత్రి తెలిపారు. అర్హత కలిగిన ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. పరీక్షకు సమర్థంగా సిద్ధమయ్యేందుకు మాక్ టెస్టులను సాధన చేయాలని కోరారు.
స్పెషల్ టెట్ ముఖ్య తేదీలు
- నోటిఫికేషన్ విడుదల: ఆగస్టు 24, 2026
- దరఖాస్తుల స్వీకరణ: ఆగస్టు 25 నుంచి సెప్టెంబర్ 24, 2026 వరకు
- పరీక్ష నిర్వహణ: అక్టోబర్ 11 నుంచి 21, 2026 వరకు
స్పెషల్ టెట్కు సంబంధించిన పూర్తి నోటిఫికేషన్, మార్గదర్శకాలు cse.ap.gov.in, tet2dsc.apcfss.in వెబ్సైట్లలో అందుబాటులో ఉంటాయని లోకేశ్ తెలిపారు.
ఉపాధ్యాయులను మరింత బలోపేతం చేయడం ద్వారా రాష్ట్రంలో నాణ్యమైన విద్యా వ్యవస్థకు పటిష్ఠమైన పునాది వేయడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి నారా లోకేశ్ పేర్కొన్నారు.

