IPL ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. దేశవ్యాప్తంగా ఫ్యాన్స్ పార్క్స్, తెలుగు రాష్ట్రాల్లో ఈ సిటీకి లక్కీ ఛాన్స్!

Date:

మార్చి 28 నుంచి ఐపీఎల్ 2026 ప్రారంభం అవుతున్న నేపథ్యంలో ఫ్యాన్ పార్క్స్‌కు బీసీసీఐ ఏర్పాటు సిద్ధం చేసింది. రెండు దశల్లో ఐపీఎల్ జరగనుండగా.. ఫ్యాన్ పార్క్స్‌కి కూడా రెండు సార్లు నగరాల పేర్లు వెల్లడించనుంది. ఈ క్రమంలో తొలి దశలో జరిగే మ్యాచ్‌లకు గాను మూడు వీకెండ్స్‌లలో జరిగే నగరాల వివరాలను ప్రకటించింది. అందులో తెలుగు రాష్ట్రాల నుంచి తెలంగాణలోని నిజామాబాద్‌లో ఫ్యాన్ పార్క్ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు.

ఐపీఎల్ ప్రారంభం అవుతుందంటే భారతదేశంలో ఓ పెద్ద పండగ వాతావరణమే మొదలవుతుంది. తమ తమ అభిమాన క్రికెటర్ల కోసం స్టేడియాల్లో ప్రేక్షకులు పోటెత్తుతారు. ఎక్కువ ఫ్యాన్ బేస్ ఉన్న ఆర్సీబీ, చెన్నై, ముంబై లాంటి జట్లు మ్యాచ్ ఆడుతున్నాయంటే ఆ రోజు టికెట్లు దొరకడం కూడా కష్టమే. అందుకే ప్రతి ఏడాది ప్రేక్షకులకు స్టేడియం థ్రిల్ అందించేందుకే బీసీసీఐ ఫ్యాన్ పార్క్‌లు ఏర్పాటు చేస్తుంది. దేశవ్యాప్తంగా ఏర్పాటు చేసే ఈ ఫ్యాన్ పార్క్స్ ఒక్కో వీకెండ్ ఒక్కో చోట నిర్వహిస్తారు.

ఈ ఏడాది దేశవ్యాప్తంగా 15 నగరాల్లో ఫ్యాన్స్ పార్క్స్ ఏర్పాటు చేసేందుకు బీసీసీఐ సిద్ధమైంది. మార్చి 28 నుంచి మూడు వీకెండ్లలో ఈ ఫ్యాన్స్ పార్క్స్ నిర్వహిస్తారు. లైవ్ మ్యాచ్ స్క్రీనింగ్‌తో పాటు మ్యూజిక్స్, ఫుడ్ కోర్ట్స్, గేమ్స్, ఫ్యాన్ యాక్టివిటీస్ వంటి ఎన్నో వినోదాలు అందుబాటులో ఉంటాయి. 2015లో ప్రారంభమైన ఈ ఫ్యాన్ పార్క్స్‌కు ఏటికేడు ఆదరణ పెరుగుతూనే ఉంది. ఈ ఏడాది ఏర్పాటు చేయనున్న ఫ్యాన్స్ పార్క్స్ జాబితాలో తెలుగు రాష్ట్రాల నుంచి ఒకే ఒక్క నగరానికి అవకాశం దొరికింది. తెలంగాణలోని నిజామాబాద్‌ ఉమెన్స్ ఎడ్యుకేషన్ సొసైటీ గ్రౌండ్స్‌లో ఫ్యాన్ పార్క్ ఏర్పాటు చేయనున్నారు.

మార్చి 28 నుంచి ప్రారంభమయ్యే ఐపీఎల్ 2026 కోసం స్టేడియాలతో పాటు ఫ్యాన్ పార్క్‌లు సిద్ధమవుతున్నాయి. ఈ ఐపీఎల్ జరిగే మొదటి మూడు వారాలు ఫ్యాన్ పార్క్‌లు ఏర్పాటు చేయనున్నారు. దేశంలోని నలుమూలలు కవర్ అయ్యేలా నగరాల జాబితాను బీసీసీఐ సిద్ధం చేసింది. ఉత్తర, దక్షిణ భారతదేశాల్లో ఓ క్రమ పద్ధతిలో ఈ ఫ్యాన్ పార్క్స్ ఏర్పాటు చేస్తారు.

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

హైడ్రా భారీ ఆపరేషన్‌.. రూ.15 వేల కోట్ల 863 ఎకరాల రక్షణకు చర్యలు.. 6 అంతస్తుల బిల్డింగ్ కూల్చివేత

హైదరాబాద్‌లో హైడ్రా అధికారులు మరో భారీ ఆపరేషన్ చేపట్టారు. ఏకంగా రూ.15...

తిరుమలలో రికార్డు స్థాయిలో పెరిగిన లడ్డూ ప్రసాదం విక్రయాలు.. ఏడాదిలో ఎన్నో తెలుసా!

తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదాల అమ్మకాలు రికార్డు స్థాయిలో పెరిగాయి. 2025-2026కు...

అమరావతి ఔటర్ రింగ్ రోడ్డులో 19 చోట్ల ఇంటర్‌ఛేంజ్‌లు.. ఎక్కడెక్కడ వస్తాయంటే!

ఏపీ రాజధాని అమరావతి ఔటర్ రింగ్ రోడ్డులో 19 ఇంటర్‌ఛేంజ్‌లు ప్లాన్...

ఉద్యోగులకు మళ్లీ నిరాశే.. జీపీఎఫ్ వడ్డీ రేట్లు ప్రకటన.. ఇప్పుడు ఎంత శాతమంటే

కేంద్ర ప్రభుత్వం ఇటీవల స్మాల్ సేవింగ్స్ స్కీమ్స్ వడ్డీ రేట్లను సవరించిన...