నా కెరీర్ ముగిసిపోయిందనుకున్నా ఇదంతా గాడ్స్ ప్లాన్ సంజూ శాంసన్ ఎమోషనల్

Date:

2026 టీ20 వరల్డ్ కప్ ఫైనల్లో న్యూజిలాండ్‌పై భారత్ 96 పరుగుల తేడాతో ఘన విజయం సాధించగా సంజూ శాంసన్ ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ అవార్డు అందుకున్నాడు. ఫైనల్లో 46 బంతుల్లో 89 పరుగులు చేసిన శాంసన్, నాకౌట్ మ్యాచ్‌ల్లో వరుసగా మూడు హాఫ్ సెంచరీలు చేసి జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. ఒకప్పుడు బెంచ్‌పైనే కూర్చోవాల్సి వచ్చిన తన ప్రయాణం ఇప్పుడు కల నిజమైనట్టు అనిపిస్తోందని భావోద్వేగంగా తెలిపాడు.

ఫైనల్ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోనుంది. బ్యాటింగ్, బౌలింగ్‌లో రాణించిన భారత్ న్యూజిలాండ్‌పై 96 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. డిఫెండింగ్ ఛాంపియన్‌గా టోర్నీలో అడుగుపెట్టిన టీమిండియా వరుసగా రెండోసారి టైటిల్‌ను కాపాడుకుంది. వరుసగా రెండుసార్లు టీ20 వరల్డ్‌కప్ ఛాంపియన్‌గా నిలిచిన తొలి జట్టుగా భారత్ చరిత్ర సృష్టించింది. అయితే, దక్కించుకున్నాక సంజూ ఎమోషనల్ అయ్యాడు.

ఈ మ్యాచ్‌లో టీమిండియా రికార్డు స్థాయిలో 255/5 స్కోర్ చేసింది. ఇది టీ20 వరల్డ్ కప్ ఫైనల్ చరిత్రలో నమోదైన అత్యధిక స్కోర్. అనంతరం బౌలర్లు అద్భుతంగా రాణించడంతో న్యూజిలాండ్‌ను కేవలం 159 పరుగులకే ఆలౌట్ చేసి భారత్ ఘన విజయం సాధించింది. నాలుగు వికెట్లు తీసుకున్న జస్ప్రీత్ బుమ్రా ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలవగా, సంజూ శాంసన్ ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ అవార్డు దక్కించుకున్నాడు.

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

హైడ్రా భారీ ఆపరేషన్‌.. రూ.15 వేల కోట్ల 863 ఎకరాల రక్షణకు చర్యలు.. 6 అంతస్తుల బిల్డింగ్ కూల్చివేత

హైదరాబాద్‌లో హైడ్రా అధికారులు మరో భారీ ఆపరేషన్ చేపట్టారు. ఏకంగా రూ.15...

తిరుమలలో రికార్డు స్థాయిలో పెరిగిన లడ్డూ ప్రసాదం విక్రయాలు.. ఏడాదిలో ఎన్నో తెలుసా!

తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదాల అమ్మకాలు రికార్డు స్థాయిలో పెరిగాయి. 2025-2026కు...

అమరావతి ఔటర్ రింగ్ రోడ్డులో 19 చోట్ల ఇంటర్‌ఛేంజ్‌లు.. ఎక్కడెక్కడ వస్తాయంటే!

ఏపీ రాజధాని అమరావతి ఔటర్ రింగ్ రోడ్డులో 19 ఇంటర్‌ఛేంజ్‌లు ప్లాన్...

ఉద్యోగులకు మళ్లీ నిరాశే.. జీపీఎఫ్ వడ్డీ రేట్లు ప్రకటన.. ఇప్పుడు ఎంత శాతమంటే

కేంద్ర ప్రభుత్వం ఇటీవల స్మాల్ సేవింగ్స్ స్కీమ్స్ వడ్డీ రేట్లను సవరించిన...