IND vs SA: గువాహటి టెస్ట్‌లో టీమిండియా పతనం… సఫారీల చేతిలో వైట్‌వాష్

Date:

గువాహటి టెస్టులో టీమిండియా కేవలం 140 పరుగులకే ఆలౌట్ అయ్యింది. దాంతో దక్షిణాఫ్రికా 408 పరుగుల భారీ తేడాతో విజయం నమోదు చేసింది. సైమన్ హార్మర్ అద్భుతంగా బౌలింగ్ చేస్తూ ఆరు వికెట్లు పడగొట్టాడు. భారత బ్యాటర్లలో రవీంద్ర జడేజా (54; 87 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్‌లు) ఒంటరిగా పోరాడి టాప్ స్కోరర్గా నిలిచాడు. మిగతా బ్యాటర్లు పూర్తిగా విఫలమయ్యారు. ఈ ఓటమితో సిరీస్‌ను టీమిండియా 2-0తో కోల్పోయి, సఫారీల చేతిలో వైట్‌వాష్ ఎదుర్కొంది. అలాగే దాదాపు 25 సంవత్సరాల తర్వాత తొలిసారి దక్షిణాఫ్రికా భారత భూమిపై టెస్ట్ సిరీస్‌ను కైవసం చేసుకుని చరిత్ర సృష్టించింది. టెస్టుల్లో ఇది టీమిండియా ఎదుర్కొన్న అత్యంత భారీ పరాజయంగా నిలిచింది.

27/2 ఓవర్నైట్ స్కోర్‌తో ఐదో రోజు ఆట ప్రారంభించిన భారత్, పెను సమస్యల్లో పడ్డది. వరుసగా వికెట్లు కోల్పోతూ ఒకానొక దశలో 58/5 వద్ద కుప్పకూలే పరిస్థితికి చేరింది. ఈ సమయంలో జడేజా ధైర్యంగా పోరాడటంతో స్కోరు 140 వరకూ చేరింది. సాయి సుదర్శన్ (14) 139 బంతులు ఎదుర్కొన్నా పెద్దగా ఉపయోగం కాలేదు. యశస్వి జైస్వాల్ (13), కేఎల్ రాహుల్ (6), ధ్రువ్ జురేల్ (2), రిషబ్ పంత్ (13), వాషింగ్టన్ సుందర్ (16), నితీశ్ కుమార్ రెడ్డి (0) వంటి బ్యాటర్లు ఒక్కొక్కరిగా విఫలమయ్యారు.

దక్షిణాఫ్రికా బౌలర్లలో సైమన్ హార్మర్ అత్యుత్తమ స్పెల్ విసిరి కేవలం 37 పరుగులకే ఆరు వికెట్లు తీశాడు. కేశవ్ మహరాజ్ రెండు వికెట్లు, ముత్తుసామి మరియు మార్కో యాన్సెన్ చెరో వికెట్ సాధించారు. ఇప్పటికే కోల్కతా టెస్టు గెలిచిన దక్షిణాఫ్రికా, గువాహటి టెస్టులోనూ విజయం సాధించి సిరీస్‌ను తమ ఖాతాలో వేసుకుంది.

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

Hyderabad: అయ్యో ఏమైంది తల్లి.. వారం క్రితమే బెంగళూరు నుంచి వచ్చింది.. ఇంతలోనే..

బెంగళూరులో పీజీ మెడిసిన్ చదువుతున్న 26 ఏళ్ల దీక్షిత హైదరాబాద్‌లోని నాగారం...

హైదరాబాద్ వాహనదారులకు గుడ్‌న్యూస్.. రూ.345 కోట్లతో కొత్త ఫ్లైఓవర్, ఈ ఏరియాలో ట్రాఫిక్ కష్టాలకు చెక్

హైదరాబాద్ ఓల్డ్ సిటీలో ట్రాఫిక్ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపడానికి జీహెచ్‌ఎంసీ...

ప్రతి నీటి బొట్టునూ స‌ద్వినియోగం చేసుకోవాలి.. అధికారులకు మంత్రి నిమ్మల సూచన

అమరావతి, జులై 25: రైతుల‌ ప్రయోజనాలను ర‌క్షించేందుకు ఇరిగేష‌న్, రెవెన్యూ అధికారులు...

సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కేకు టైఫాయిడ్..

కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే అనారోగ్యానికి గురయ్యారు....