HomeSportsIND vs SA: గువాహటి టెస్ట్‌లో టీమిండియా పతనం… సఫారీల చేతిలో వైట్‌వాష్

IND vs SA: గువాహటి టెస్ట్‌లో టీమిండియా పతనం… సఫారీల చేతిలో వైట్‌వాష్

Published on

spot_img

గువాహటి టెస్టులో టీమిండియా కేవలం 140 పరుగులకే ఆలౌట్ అయ్యింది. దాంతో దక్షిణాఫ్రికా 408 పరుగుల భారీ తేడాతో విజయం నమోదు చేసింది. సైమన్ హార్మర్ అద్భుతంగా బౌలింగ్ చేస్తూ ఆరు వికెట్లు పడగొట్టాడు. భారత బ్యాటర్లలో రవీంద్ర జడేజా (54; 87 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్‌లు) ఒంటరిగా పోరాడి టాప్ స్కోరర్గా నిలిచాడు. మిగతా బ్యాటర్లు పూర్తిగా విఫలమయ్యారు. ఈ ఓటమితో సిరీస్‌ను టీమిండియా 2-0తో కోల్పోయి, సఫారీల చేతిలో వైట్‌వాష్ ఎదుర్కొంది. అలాగే దాదాపు 25 సంవత్సరాల తర్వాత తొలిసారి దక్షిణాఫ్రికా భారత భూమిపై టెస్ట్ సిరీస్‌ను కైవసం చేసుకుని చరిత్ర సృష్టించింది. టెస్టుల్లో ఇది టీమిండియా ఎదుర్కొన్న అత్యంత భారీ పరాజయంగా నిలిచింది.

27/2 ఓవర్నైట్ స్కోర్‌తో ఐదో రోజు ఆట ప్రారంభించిన భారత్, పెను సమస్యల్లో పడ్డది. వరుసగా వికెట్లు కోల్పోతూ ఒకానొక దశలో 58/5 వద్ద కుప్పకూలే పరిస్థితికి చేరింది. ఈ సమయంలో జడేజా ధైర్యంగా పోరాడటంతో స్కోరు 140 వరకూ చేరింది. సాయి సుదర్శన్ (14) 139 బంతులు ఎదుర్కొన్నా పెద్దగా ఉపయోగం కాలేదు. యశస్వి జైస్వాల్ (13), కేఎల్ రాహుల్ (6), ధ్రువ్ జురేల్ (2), రిషబ్ పంత్ (13), వాషింగ్టన్ సుందర్ (16), నితీశ్ కుమార్ రెడ్డి (0) వంటి బ్యాటర్లు ఒక్కొక్కరిగా విఫలమయ్యారు.

దక్షిణాఫ్రికా బౌలర్లలో సైమన్ హార్మర్ అత్యుత్తమ స్పెల్ విసిరి కేవలం 37 పరుగులకే ఆరు వికెట్లు తీశాడు. కేశవ్ మహరాజ్ రెండు వికెట్లు, ముత్తుసామి మరియు మార్కో యాన్సెన్ చెరో వికెట్ సాధించారు. ఇప్పటికే కోల్కతా టెస్టు గెలిచిన దక్షిణాఫ్రికా, గువాహటి టెస్టులోనూ విజయం సాధించి సిరీస్‌ను తమ ఖాతాలో వేసుకుంది.

Latest articles

ఏపీ ప్రజలకు మరో గుడ్‌న్యూస్.. 2500 ఎకరాల్లో ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ సిటీ.. ఆ ప్రాంతం దశ తిరిగినట్టే

ఆంధ్రప్రదేశ్‌లో భారీ విస్తీర్ణంలో ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ సిటీని నిర్మించాలని చంద్రబాబు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రపంచంలోనే టాప్ 5...

విశాఖ, విజయవాడలో డబుల్ డెక్కర్ ఎలివేటెడ్ కారిడార్.. ఒకే ఫ్లైఓవర్‌పై వాహనాలు, మెట్రో రైలు రయ్‌రయ్

విశాఖ, విజయవాడ నగరాల్లో జాతీయ రహదారులపై డబుల్ డెక్కర్ కారిడార్లను నిర్మించడానికి అడుగులు పడుతున్నాయి. ఈ మేరకు జాతీయ...

ఏపీలో ఆ నియోజకవర్గ ప్రజలకు శుభవార్త 8 వేలకోట్లతో స్టీల్ ఫ్యాక్టరీ ఆ ప్రాంతం దశ తిరిగినట్లే

ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు పలు సంస్థలు ఆసక్తి చూపుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే విజయనగరం జిల్లా చీపురుపల్లిలో...

శ్రీశైలం వెళ్లే భక్తులకు శుభవార్త నేటి నుంచి లడ్డూలు ఉచితంగా ఇస్తారు

శ్రీశైలం వెళ్లే మల్లన్న భక్తులకు శుభవార్త. డిసెంబర్ 1వ తేదీ నుంచి మల్లన్న భక్తులకు ఉచిత లడ్డూ ప్రసాదాలు...

More like this

ఏపీ ప్రజలకు మరో గుడ్‌న్యూస్.. 2500 ఎకరాల్లో ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ సిటీ.. ఆ ప్రాంతం దశ తిరిగినట్టే

ఆంధ్రప్రదేశ్‌లో భారీ విస్తీర్ణంలో ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ సిటీని నిర్మించాలని చంద్రబాబు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రపంచంలోనే టాప్ 5...

విశాఖ, విజయవాడలో డబుల్ డెక్కర్ ఎలివేటెడ్ కారిడార్.. ఒకే ఫ్లైఓవర్‌పై వాహనాలు, మెట్రో రైలు రయ్‌రయ్

విశాఖ, విజయవాడ నగరాల్లో జాతీయ రహదారులపై డబుల్ డెక్కర్ కారిడార్లను నిర్మించడానికి అడుగులు పడుతున్నాయి. ఈ మేరకు జాతీయ...

ఏపీలో ఆ నియోజకవర్గ ప్రజలకు శుభవార్త 8 వేలకోట్లతో స్టీల్ ఫ్యాక్టరీ ఆ ప్రాంతం దశ తిరిగినట్లే

ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు పలు సంస్థలు ఆసక్తి చూపుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే విజయనగరం జిల్లా చీపురుపల్లిలో...