HomeEntertainmentబాలయ్య ద్విపాత్రాభినయంతో రంగంలోకి ‘NBK111’ – గర్జించిన మొదటి పోస్టర్!

బాలయ్య ద్విపాత్రాభినయంతో రంగంలోకి ‘NBK111’ – గర్జించిన మొదటి పోస్టర్!

Published on

spot_img

అగ్రనటుడు నందమూరి బాలకృష్ణ – డైరెక్టర్ గోపీచంద్ మలినేని కాంబినేషన్ మరోసారి తెలుగు సినిమా ప్రేక్షకుల్లో సంచలనాన్న సృష్టించేందుకు సిద్ధమైంది. ‘వీర సింహారెడ్డి’ బ్లాక్‌బస్టర్ విజయానంతరం ఈ జంట చేస్తున్న రెండో చిత్రం ‘#NBK111’ మీద ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

తాజాగా ఈ ప్రాజెక్ట్ నుంచి సరికొత్త అప్‌డేట్ బయటకు వచ్చింది. పూజా కార్యక్రమాలతో సినిమా శుభారంభం జరిగినట్లు టీమ్ అధికారికంగా ప్రకటించింది. హిస్టారికల్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో బాలకృష్ణ ద్విపాత్రాభినయం చేయనున్నారని నిర్మాణ సంస్థ ఖరారు చేసింది.

ఈ సందర్భంగా రిలీజ్ చేసిన పవర్‌ఫుల్ పోస్టర్ మాత్రం ప్రేక్షకుల గుండెల్లో గుబులు రేపేలా ఉంది. ఒక వైపు రుద్రాక్షమాల ధరించిన ఘోర రూపంలో శక్తివంతమైన అవతారం, మరో వైపు యుద్ధ భూమిని చెదరగొట్టే రాజసమైన యోధుడి లుక్ — రెండు కోటలను నేపథ్యంగా తీసుకుని రూపొందించిన ఈ పోస్టర్ గోపీచంద్ మలినేని బాలయ్య కోసం ఏ స్థాయిలో మేకింగ్ ప్లాన్ చేస్తున్నారో స్పష్టంగా చెబుతోంది.

ఇక బాలకృష్ణ సరసన నయనతారను తీసుకోవడం ఈ సినిమాకు మరో ముఖ్య ఆకర్షణ. ‘సింహా’, ‘జైసింహా’, ‘శ్రీరామరాజ్యం’ వంటి హిట్ చిత్రాల తర్వాత వీరి కాంబోలో వస్తున్న నాలుగో సినిమా కావడం సినిమాపై ప్రత్యేక క్రేజ్‌ను పెంచింది.

సంగీత విభాగంలో థమన్ చేరడం ఈ ప్రాజెక్ట్‌కు మరింత బలం చేకూరుస్తోంది. ‘అఖండ’, ‘వీర సింహారెడ్డి’, ‘భగవంత్ కేసరి’, ‘డాకు మహారాజ్’ చిత్రాల్లో థమన్–బాలయ్య కాంబో ఇచ్చిన ఎనర్జీ ప్రేక్షకులు ఇప్పటికీ మర్చిపోలేదు. త్వరలోనే ఈ సంచలన కాంబినేషన్ నుంచి ‘అఖండ 2’ కూడా రాబోతుండటం మరింత హైప్‌ను సృష్టిస్తోంది.

Latest articles

ఏపీ ప్రజలకు మరో గుడ్‌న్యూస్.. 2500 ఎకరాల్లో ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ సిటీ.. ఆ ప్రాంతం దశ తిరిగినట్టే

ఆంధ్రప్రదేశ్‌లో భారీ విస్తీర్ణంలో ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ సిటీని నిర్మించాలని చంద్రబాబు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రపంచంలోనే టాప్ 5...

విశాఖ, విజయవాడలో డబుల్ డెక్కర్ ఎలివేటెడ్ కారిడార్.. ఒకే ఫ్లైఓవర్‌పై వాహనాలు, మెట్రో రైలు రయ్‌రయ్

విశాఖ, విజయవాడ నగరాల్లో జాతీయ రహదారులపై డబుల్ డెక్కర్ కారిడార్లను నిర్మించడానికి అడుగులు పడుతున్నాయి. ఈ మేరకు జాతీయ...

ఏపీలో ఆ నియోజకవర్గ ప్రజలకు శుభవార్త 8 వేలకోట్లతో స్టీల్ ఫ్యాక్టరీ ఆ ప్రాంతం దశ తిరిగినట్లే

ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు పలు సంస్థలు ఆసక్తి చూపుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే విజయనగరం జిల్లా చీపురుపల్లిలో...

శ్రీశైలం వెళ్లే భక్తులకు శుభవార్త నేటి నుంచి లడ్డూలు ఉచితంగా ఇస్తారు

శ్రీశైలం వెళ్లే మల్లన్న భక్తులకు శుభవార్త. డిసెంబర్ 1వ తేదీ నుంచి మల్లన్న భక్తులకు ఉచిత లడ్డూ ప్రసాదాలు...

More like this

ఏపీ ప్రజలకు మరో గుడ్‌న్యూస్.. 2500 ఎకరాల్లో ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ సిటీ.. ఆ ప్రాంతం దశ తిరిగినట్టే

ఆంధ్రప్రదేశ్‌లో భారీ విస్తీర్ణంలో ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ సిటీని నిర్మించాలని చంద్రబాబు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రపంచంలోనే టాప్ 5...

విశాఖ, విజయవాడలో డబుల్ డెక్కర్ ఎలివేటెడ్ కారిడార్.. ఒకే ఫ్లైఓవర్‌పై వాహనాలు, మెట్రో రైలు రయ్‌రయ్

విశాఖ, విజయవాడ నగరాల్లో జాతీయ రహదారులపై డబుల్ డెక్కర్ కారిడార్లను నిర్మించడానికి అడుగులు పడుతున్నాయి. ఈ మేరకు జాతీయ...

ఏపీలో ఆ నియోజకవర్గ ప్రజలకు శుభవార్త 8 వేలకోట్లతో స్టీల్ ఫ్యాక్టరీ ఆ ప్రాంతం దశ తిరిగినట్లే

ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు పలు సంస్థలు ఆసక్తి చూపుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే విజయనగరం జిల్లా చీపురుపల్లిలో...