Nara Lokesh: చంద్రబాబు సంచలన నిర్ణయం వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నారా లోకేష్

Date:

టీడీపీ అధినేత చంద్రబాబు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. పొలిట్‌బ్యూరో, జాతీయ, రాష్ట్ర కమిటీలను టీడీపీ ప్రకటించారు. టీడీపీ నేషనల్ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా లోకేష్‌కు బాధ్యతలు అప్పగించారు. ఏపీ ఏపీ అధ్యక్షుడిగా పల్లా శ్రీనివాస్‌ని కొనసాగించారు. మొత్తం 29 మందితో పొలిట్‌బ్యూరో ఏర్పాటు చేయగా. 31 మందితో జాతీయ కమిటీని నియమించారు. అలాగే 185 మందితో టీడీపీ రాష్ట్ర కమిటీని ప్రకటించారు.

జాతీయ కార్యదర్శులుగా ముగ్గురికి, జాతీయ ఉపాధ్యక్షులుగా 18 మందికి అవకాశం ఇచ్చింది టీడీపీ. నారా లోకేష్‌కు ప్రమోషన్ కల్పిస్తారని, వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఆయనను ప్రకటిస్తారనే వార్తలు ఎప్పటినుంచో వినిపిస్తున్నాయి. గత ఏడాది జరిగిన మహానాడులో దీనిపై నిర్ణయం తీసుకుంటారనే వార్తలు కూడా వచ్చాయి. కానీ ఇప్పుడు చంద్రబాబు దానిపై నిర్ణయం తీసుకున్నారు.

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శులుగా రామ్మోహన్ నాయుడు, బైరెడ్డి శబరి, రాజేశ్ కిలార్‌లను నియమించారు. జాతీయ ప్రధాన కార్యదర్శులుగా ముగ్గురిని, జాతీయ ఉపాధ్యక్షులుగా 18 మందిని, జాతీయ అధికారి ప్రతినిధులుగా 10 మందికి బాధ్యతలు అప్పగించారు. ఇక రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు 7, ఉపాధ్యక్షులు 16, అధికార ప్రతినిధులు 14, రాష్ట్ర జోనల్ కోఆర్డినేటర్లు 10, రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శులు 59, రాష్ట్ర కార్యదర్శులు 77 మందిని ప్రకటించారు.

ఇక రాష్ట్ర కమిటీలో 50 మంది మహిళలు ఉండగా.. జాతీయ కమిటీలు, పొలిట్ బ్యూరోలో కూడా మహిళలకు అవకాశం కల్పించారు. సామాజిక, ప్రాంతీయ అంశాలను పరిగణలోకి తీసుకుని పదవులు అప్పగించారు. కష్టపడే తత్వం, పార్టీకి కట్టుబడి ఉండటం లాంటివి పరిగణలోకి తీసుకుని పార్టీ పదవులు అప్పగించారు.

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

Hyderabad: ఆర్‌ఆర్‌ఆర్‌ ఉత్తర భాగంపై కీలక అప్డేట్.. 2 ప్యాకేజీలుగా మార్పు, టెండర్లకు ఆహ్వానం

రీజినల్ రింగ్ రోడ్డు (ఆర్‌ఆర్‌ఆర్‌) ఉత్తర భాగం పనులపై కీలక అప్డేట్...

ఏపీలో రిలయన్స్‌ డేటాసెంటర్‌.. చంద్రబాబు సర్కార్ భారీ ప్రోత్సాహకాలు, ఏకంగా వేల కోట్లు!

విజయనగరం జిల్లాలో ఏర్పాటు చేయనున్న రిలయన్స్ డేటా సెంటర్‌కు ఏపీ ప్రభుత్వం...

మాట నిలబెట్టుకున్న టీడీపీ ఎమ్మెల్యే గల్లా మాధవి.. పదో తరగతి విద్యార్థులకు విమాన ప్రయాణం

టీడీపీ ఎమ్మెల్యే గల్లా మాధవి.. తాను ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు. కొన్ని...

తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్.. 5 లక్షల బీమా, 2 లక్షల కొత్త ఫించన్లు, ఇంకా మరెన్నో.. రేవంత్ సర్కార్ జూన్ 2 బిగ్ ప్లాన్..!

రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జూన్ 2న ప్రజలకు శుభవార్తలు చెప్పేందుకు...