తెలంగాణ కవి, ఉద్యమకారుడు నందిని సిధారెడ్డికి అరుదైన గౌరవం.. కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు ప్రకటన

Date:

నందిని సిధారెడ్డికి కేంద్రం అరుదైన గౌరవం కల్పించింది. కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డును నందిని సిధారెడ్డికి కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. నందిని సిధారెడ్డి రాసిన అనిమేష కవితా సంపుటికి గానూ ఈ పురస్కారం వరించింది. కరోనా సమయంలో నందిని సిధారెడ్డి.. ఈ పుస్తకాన్ని రచించారు. నందిని సిధారెడ్డికి.. కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు రావడం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేశారు.

తెలంగాణ కవి, ఉద్యమకారుడు, రచయిత నందిని సిధారెడ్డి కి అరుదైన గౌరవం లభించింది. కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం ఇవాళ ప్రకటించిన కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డుల్లో.. నందిని సిధారెడ్డికి కూడా ఈ గౌరవం కల్పించింది. కరోనా కాలంలో నెలకొన్న పరిస్థితులను నందిని సిధారెడ్డి.. కళ్లకు కట్టినట్లు ఆయన అనిమేష కవితా సంపుటి రాయగా దానికి ఈ కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం వచ్చింది. ఇక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొట్టమొదటి సాహిత్య అకాడమీ ఛైర్మన్‌గా నందిని సిధారెడ్డిని నియమించడం విశేషం.

కరోనా సమయంలో సామాజిక పరిస్థితులు, మానవీయ కోణాలను ఆయన ఈ అనిమేష కవితా సంపుటిలో చిత్రించారు. ఇక కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు వరించిన వారికి రూ. లక్ష నగదు ప్రోత్సాహంతోపాటు.. తామ్రపత్రం, శాలువాను కేంద్ర ప్రభుత్వం ప్రదానం చేస్తుంది. 1955లో మెదక్ జిల్లా బందారం గ్రామంలో నందిని సిధారెడ్డి పుట్టారు. ఆయన తండ్రి నర్రా బాలసిద్ధారెడ్డి రజాకార్లకు వ్యతిరేకంగా పోరాడిన ఒక గొప్ప కమ్యూనిస్టు యోధుడు. ఉస్మానియా యూనివర్సిటీలో ఎంఏ పూర్తిచేసిన నందిని సిధారెడ్డి.. ‘ఆధునిక తెలుగుకవిత్వంలో సూర్యుడు’ అనే అంశంపై 1981లో ఎంఫిల్‌ పట్టా అందుకున్నారు. ఆ తర్వాత ‘ఆధునిక కవిత్వం, వాస్తవికత-అధివాస్తవికత’ పై పరిశోధనలకు గానూ 1986 పీహెచ్‌డీ పట్టా వరించింది.

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

హైడ్రా భారీ ఆపరేషన్‌.. రూ.15 వేల కోట్ల 863 ఎకరాల రక్షణకు చర్యలు.. 6 అంతస్తుల బిల్డింగ్ కూల్చివేత

హైదరాబాద్‌లో హైడ్రా అధికారులు మరో భారీ ఆపరేషన్ చేపట్టారు. ఏకంగా రూ.15...

తిరుమలలో రికార్డు స్థాయిలో పెరిగిన లడ్డూ ప్రసాదం విక్రయాలు.. ఏడాదిలో ఎన్నో తెలుసా!

తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదాల అమ్మకాలు రికార్డు స్థాయిలో పెరిగాయి. 2025-2026కు...

అమరావతి ఔటర్ రింగ్ రోడ్డులో 19 చోట్ల ఇంటర్‌ఛేంజ్‌లు.. ఎక్కడెక్కడ వస్తాయంటే!

ఏపీ రాజధాని అమరావతి ఔటర్ రింగ్ రోడ్డులో 19 ఇంటర్‌ఛేంజ్‌లు ప్లాన్...

ఉద్యోగులకు మళ్లీ నిరాశే.. జీపీఎఫ్ వడ్డీ రేట్లు ప్రకటన.. ఇప్పుడు ఎంత శాతమంటే

కేంద్ర ప్రభుత్వం ఇటీవల స్మాల్ సేవింగ్స్ స్కీమ్స్ వడ్డీ రేట్లను సవరించిన...