తెలంగాణ కవి, ఉద్యమకారుడు నందిని సిధారెడ్డికి అరుదైన గౌరవం.. కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు ప్రకటన

Date:

నందిని సిధారెడ్డికి కేంద్రం అరుదైన గౌరవం కల్పించింది. కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డును నందిని సిధారెడ్డికి కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. నందిని సిధారెడ్డి రాసిన అనిమేష కవితా సంపుటికి గానూ ఈ పురస్కారం వరించింది. కరోనా సమయంలో నందిని సిధారెడ్డి.. ఈ పుస్తకాన్ని రచించారు. నందిని సిధారెడ్డికి.. కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు రావడం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేశారు.

తెలంగాణ కవి, ఉద్యమకారుడు, రచయిత నందిని సిధారెడ్డి కి అరుదైన గౌరవం లభించింది. కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం ఇవాళ ప్రకటించిన కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డుల్లో.. నందిని సిధారెడ్డికి కూడా ఈ గౌరవం కల్పించింది. కరోనా కాలంలో నెలకొన్న పరిస్థితులను నందిని సిధారెడ్డి.. కళ్లకు కట్టినట్లు ఆయన అనిమేష కవితా సంపుటి రాయగా దానికి ఈ కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం వచ్చింది. ఇక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొట్టమొదటి సాహిత్య అకాడమీ ఛైర్మన్‌గా నందిని సిధారెడ్డిని నియమించడం విశేషం.

కరోనా సమయంలో సామాజిక పరిస్థితులు, మానవీయ కోణాలను ఆయన ఈ అనిమేష కవితా సంపుటిలో చిత్రించారు. ఇక కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు వరించిన వారికి రూ. లక్ష నగదు ప్రోత్సాహంతోపాటు.. తామ్రపత్రం, శాలువాను కేంద్ర ప్రభుత్వం ప్రదానం చేస్తుంది. 1955లో మెదక్ జిల్లా బందారం గ్రామంలో నందిని సిధారెడ్డి పుట్టారు. ఆయన తండ్రి నర్రా బాలసిద్ధారెడ్డి రజాకార్లకు వ్యతిరేకంగా పోరాడిన ఒక గొప్ప కమ్యూనిస్టు యోధుడు. ఉస్మానియా యూనివర్సిటీలో ఎంఏ పూర్తిచేసిన నందిని సిధారెడ్డి.. ‘ఆధునిక తెలుగుకవిత్వంలో సూర్యుడు’ అనే అంశంపై 1981లో ఎంఫిల్‌ పట్టా అందుకున్నారు. ఆ తర్వాత ‘ఆధునిక కవిత్వం, వాస్తవికత-అధివాస్తవికత’ పై పరిశోధనలకు గానూ 1986 పీహెచ్‌డీ పట్టా వరించింది.

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

Hyderabad: ఆర్‌ఆర్‌ఆర్‌ ఉత్తర భాగంపై కీలక అప్డేట్.. 2 ప్యాకేజీలుగా మార్పు, టెండర్లకు ఆహ్వానం

రీజినల్ రింగ్ రోడ్డు (ఆర్‌ఆర్‌ఆర్‌) ఉత్తర భాగం పనులపై కీలక అప్డేట్...

ఏపీలో రిలయన్స్‌ డేటాసెంటర్‌.. చంద్రబాబు సర్కార్ భారీ ప్రోత్సాహకాలు, ఏకంగా వేల కోట్లు!

విజయనగరం జిల్లాలో ఏర్పాటు చేయనున్న రిలయన్స్ డేటా సెంటర్‌కు ఏపీ ప్రభుత్వం...

మాట నిలబెట్టుకున్న టీడీపీ ఎమ్మెల్యే గల్లా మాధవి.. పదో తరగతి విద్యార్థులకు విమాన ప్రయాణం

టీడీపీ ఎమ్మెల్యే గల్లా మాధవి.. తాను ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు. కొన్ని...

తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్.. 5 లక్షల బీమా, 2 లక్షల కొత్త ఫించన్లు, ఇంకా మరెన్నో.. రేవంత్ సర్కార్ జూన్ 2 బిగ్ ప్లాన్..!

రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జూన్ 2న ప్రజలకు శుభవార్తలు చెప్పేందుకు...