Weather Alert: సుర్రుమంటున్న సూరీడు ఏపీ, తెలంగాణ ప్రజలకు అలర్ట్.. ఇదిగో వెదర్ రిపోర్ట్.

Date:

తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండుతున్నాయి.. 40 నుంచి 44 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.. దీంతో ప్రజలు బయటకు వచ్చేందుకు జంకుతున్నారు. ముఖ్యంగా.. ఏపీలో ఎండల తీవ్రత పెరుగుతోంది. వేసవి ఆరంభంలోనే రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు భారీగా నమోదవుతున్నాయి. శనివారం ఏపీలోని 90 మండలాల్లో వడగాల్పులు వీస్తాయని వాతావరణ అంచనా వేస్తోంది.

మన్యం, అల్లూరి సీతారామరాజు జిల్లాతో పాటు కాకినాడ, తూర్పుగోదావరి జిల్లాల్లో ఎండల తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశం ఉందని తెలిపింది. ముఖ్యంగా ఎన్టీఆర్ జిల్లాలోని ఇబ్రహీంపట్నం పరిసర ప్రాంతాల్లో వడగాల్పుల తీవ్రత ఎక్కువగా ఉంటుందని అధికారులు హెచ్చరిస్తున్నారు. ఇటు తెలంగాణలోనూ క్రమంగా ఉష్ణోగ్రతలు ఎక్కువగా నమోదయ్యే అవకాశముందని అధికారులు తెలిపారు. ముఖ్యంగా ఉమ్మడి మహబూబ్​ నగర్ జిల్లాలో ఎండలు దంచికొట్టే వీలుందని హెచ్చరించారు.

దీంతో వికారాబాద్​, నారాయణపేట, మహబూబ్​నగర్​, జోగుళాంబ గద్వాల, నాగర్​ కర్నూల్​, వనపర్తి, సంగారెడ్డి జిల్లాల్లో కూడా 41 నుంచి 44 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదు కావొచ్చని, ఈ ప్రాంతాలకు వాతావరణ శాఖ ఆరెంజ్​ అలర్ట్ జారీ చేసింది. మిగిలిన ప్రాంతాల్లో ఎల్లో అలర్ట్​ ప్రకటించింది. మార్చిలోనే పరిస్థితి ఇలా ఉంటే. ఇక ఏప్రిల్, మే నెలల్లో ఎండలు ఇంకెంతలా ముదురుతాయోనని ప్రజలు ఆందోళన చెందుతున్నారు.

జాగ్రత్తలు తీసుకోండి.
మధ్యాహ్నం 12 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు ప్రజలు ఇళ్లకే పరిమితం కావాలని సూచిస్తున్నారు. వృద్ధులు, పిల్లలు ఎండ దెబ్బ తగలకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, డీహైడ్రేషన్ బారిన పడకుండా మంచి నీరు, పండ్ల రసాలు ఎక్కువగా తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

హైడ్రా భారీ ఆపరేషన్‌.. రూ.15 వేల కోట్ల 863 ఎకరాల రక్షణకు చర్యలు.. 6 అంతస్తుల బిల్డింగ్ కూల్చివేత

హైదరాబాద్‌లో హైడ్రా అధికారులు మరో భారీ ఆపరేషన్ చేపట్టారు. ఏకంగా రూ.15...

తిరుమలలో రికార్డు స్థాయిలో పెరిగిన లడ్డూ ప్రసాదం విక్రయాలు.. ఏడాదిలో ఎన్నో తెలుసా!

తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదాల అమ్మకాలు రికార్డు స్థాయిలో పెరిగాయి. 2025-2026కు...

అమరావతి ఔటర్ రింగ్ రోడ్డులో 19 చోట్ల ఇంటర్‌ఛేంజ్‌లు.. ఎక్కడెక్కడ వస్తాయంటే!

ఏపీ రాజధాని అమరావతి ఔటర్ రింగ్ రోడ్డులో 19 ఇంటర్‌ఛేంజ్‌లు ప్లాన్...

ఉద్యోగులకు మళ్లీ నిరాశే.. జీపీఎఫ్ వడ్డీ రేట్లు ప్రకటన.. ఇప్పుడు ఎంత శాతమంటే

కేంద్ర ప్రభుత్వం ఇటీవల స్మాల్ సేవింగ్స్ స్కీమ్స్ వడ్డీ రేట్లను సవరించిన...