కొత్త కెప్టెన్, వైస్ కెప్టెన్‌ను ప్రకటించిన సన్‌రైజర్స్ హైదరాబాద్..!

Date:

ఐపీఎల్ 2026 సీజన్ ప్రారంభానికి ముందు సన్ రైజర్స్ హైదరాబాద్ కీలక నిర్ణయం తీసుకుంది. రెగ్యులర్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ గాయం నుంచి కోలుకోకపోవడంతో అతడి ప్లేసులో ఇషాన్ కిషన్‌కు కెప్టెన్‌గా నియమించింది. అతడికి డిప్యూటీగా అభిషేక్ శర్మను ఎంపిక చేసింది. ఈ విషయాన్ని బుధవారం అధికారికంగా ప్రకటించింది. మార్చి 28న ఐపీఎల్ 2026 ప్రారంభం కానుంది.

రెగ్యులర్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ గాయం నుంచి ఇంకా కోలుకోకపోవడంతో సన్ రైజర్స్ హైదరాబాద్.. తాత్కాలిక కెప్టెన్‌ను ప్రకటించింది. ఈ మేరకు ప్యాట్ కమిన్స్ వచ్చే వరకు సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుకు సారథిగా ఇషాన్ కిషన్ వ్యవహరిస్తాడని పేర్కొంది. దీనిపై బుధవారం అధికారిక ప్రకటన చేసింది. ఇదే సమయంలో జట్టుకు వైస్ కెప్టెన్‌ను సైతం ఎంపిక చేసింది. ఇషాన్ కిషన్‌కు డిప్యూటీగా అభిషేక్ శర్మను ఎంపిక చేసింది.

ప్యాట్ కమిన్స్ గాయం కారణంగా కొన్ని నెలలుగా క్రికెట్‌కు దూరమయ్యాడు. యాషెస్‌లో కేవలం ఒకే టెస్టు ఆడాడు. ఆ తర్వాత భారత్‌తో పరిమిత ఓవర్ల సిరీస్, టీ20 ప్రపంచకప్‌కు దూరమయ్యాడు. ప్రస్తుతం రీహాబ్‌లో ఉన్న అతడు.. మ్యాచ్ ఫిట్‌నెస్ సాధించేందుకు మరికొన్ని రోజులు పట్టే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో సన్ రైజర్స్ కొత్త కెప్టెన్‌ను ప్రకటించింది. దేశవాళీల్లో జార్ఖండ్ జట్టుకు సారథిగా వ్యవహరించిన ఇషాన్ కిషన్ వైపు.. సన్ రైజర్స్ మొగ్గుచూపించింది. అతడి సారథ్యంలోనే జార్ఖండ్.. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ విజేతగా నిలిచింది.

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

హైడ్రా భారీ ఆపరేషన్‌.. రూ.15 వేల కోట్ల 863 ఎకరాల రక్షణకు చర్యలు.. 6 అంతస్తుల బిల్డింగ్ కూల్చివేత

హైదరాబాద్‌లో హైడ్రా అధికారులు మరో భారీ ఆపరేషన్ చేపట్టారు. ఏకంగా రూ.15...

తిరుమలలో రికార్డు స్థాయిలో పెరిగిన లడ్డూ ప్రసాదం విక్రయాలు.. ఏడాదిలో ఎన్నో తెలుసా!

తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదాల అమ్మకాలు రికార్డు స్థాయిలో పెరిగాయి. 2025-2026కు...

అమరావతి ఔటర్ రింగ్ రోడ్డులో 19 చోట్ల ఇంటర్‌ఛేంజ్‌లు.. ఎక్కడెక్కడ వస్తాయంటే!

ఏపీ రాజధాని అమరావతి ఔటర్ రింగ్ రోడ్డులో 19 ఇంటర్‌ఛేంజ్‌లు ప్లాన్...

ఉద్యోగులకు మళ్లీ నిరాశే.. జీపీఎఫ్ వడ్డీ రేట్లు ప్రకటన.. ఇప్పుడు ఎంత శాతమంటే

కేంద్ర ప్రభుత్వం ఇటీవల స్మాల్ సేవింగ్స్ స్కీమ్స్ వడ్డీ రేట్లను సవరించిన...