కొత్త కెప్టెన్, వైస్ కెప్టెన్‌ను ప్రకటించిన సన్‌రైజర్స్ హైదరాబాద్..!

Date:

ఐపీఎల్ 2026 సీజన్ ప్రారంభానికి ముందు సన్ రైజర్స్ హైదరాబాద్ కీలక నిర్ణయం తీసుకుంది. రెగ్యులర్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ గాయం నుంచి కోలుకోకపోవడంతో అతడి ప్లేసులో ఇషాన్ కిషన్‌కు కెప్టెన్‌గా నియమించింది. అతడికి డిప్యూటీగా అభిషేక్ శర్మను ఎంపిక చేసింది. ఈ విషయాన్ని బుధవారం అధికారికంగా ప్రకటించింది. మార్చి 28న ఐపీఎల్ 2026 ప్రారంభం కానుంది.

రెగ్యులర్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ గాయం నుంచి ఇంకా కోలుకోకపోవడంతో సన్ రైజర్స్ హైదరాబాద్.. తాత్కాలిక కెప్టెన్‌ను ప్రకటించింది. ఈ మేరకు ప్యాట్ కమిన్స్ వచ్చే వరకు సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుకు సారథిగా ఇషాన్ కిషన్ వ్యవహరిస్తాడని పేర్కొంది. దీనిపై బుధవారం అధికారిక ప్రకటన చేసింది. ఇదే సమయంలో జట్టుకు వైస్ కెప్టెన్‌ను సైతం ఎంపిక చేసింది. ఇషాన్ కిషన్‌కు డిప్యూటీగా అభిషేక్ శర్మను ఎంపిక చేసింది.

ప్యాట్ కమిన్స్ గాయం కారణంగా కొన్ని నెలలుగా క్రికెట్‌కు దూరమయ్యాడు. యాషెస్‌లో కేవలం ఒకే టెస్టు ఆడాడు. ఆ తర్వాత భారత్‌తో పరిమిత ఓవర్ల సిరీస్, టీ20 ప్రపంచకప్‌కు దూరమయ్యాడు. ప్రస్తుతం రీహాబ్‌లో ఉన్న అతడు.. మ్యాచ్ ఫిట్‌నెస్ సాధించేందుకు మరికొన్ని రోజులు పట్టే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో సన్ రైజర్స్ కొత్త కెప్టెన్‌ను ప్రకటించింది. దేశవాళీల్లో జార్ఖండ్ జట్టుకు సారథిగా వ్యవహరించిన ఇషాన్ కిషన్ వైపు.. సన్ రైజర్స్ మొగ్గుచూపించింది. అతడి సారథ్యంలోనే జార్ఖండ్.. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ విజేతగా నిలిచింది.

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

IRCTC: హైదరాబాద్ నుంచి కాణిపాకం–శ్రీపురం.. 3 పుణ్యక్షేత్రాల దర్శనానికి టూర్ ప్యాకేజీ

కాణిపాకం, శ్రీపురం గోల్డెన్ టెంపుల్, శ్రీకాళహస్తి, తిరుచానూరు వంటి ప్రముఖ పుణ్యక్షేత్రాలను...

పరందూర్ ఎయిర్‌పోర్ట్ ప్రాజెక్ట్ రద్దు చేసిన సీఎం విజయ్.. రైతుల పోరాటానికి మద్దతిస్తూ సంచలన నిర్ణయం

తమిళనాడు రాజకీయాల్లో పరందూర్ ప్రతిపాదిత విమానాశ్రయం అంశం మరోసారి తీవ్ర చర్చకు...

రెండ్రోజులుగా కనిపించని కర్ణాటక ఐఏఎస్ అధికారి యూపీలో ప్రత్యక్షం.. కారణం ఏంటో చెప్పిన సర్కారు!

గత రెండు రోజులుగా ఆచూకీ లేకుండా పోయారంటూ సామాజిక, వార్తా మాధ్యమాల్లో...

50 ఏళ్ల వయసులో బైక్‌పై సంచలనం.. చరిత్ర సృష్టించిన తెలంగాణ మహిళా డాక్టర్!

50 ఏళ్ల వయసులోనూ సాహసం.. లేహ్-లడఖ్ బైక్ యాత్రతో చరిత్ర సృష్టించిన...