తెలంగాణలో కొత్త ఎయిర్‌పోర్టు.. ఏడాదిలోగా అందుబాటులోకి, చురుగ్గా పనులు

Date:

వరంగల్ నగర ప్రజలకు గుడ్‌న్యూస్. త్వరలోనే మామునూరు ఎయిర్‌పోర్టు అందుబాటులోకి రానుంది. ఎయిర్ కనెక్టివిటీ కోసం హైదరాబాద్ రావాల్సిన పని లేకుండా నగరం నుంచే రాకపోకలు సాగించొచ్చు. ఈ మేరకు ఎయిర్‌పోర్టు డీపీఆర్ సిద్ధం కాగా.. త్వరలోనే కేంద్రం ఆమోదముద్ర వేయనుంది. ఆ తర్వాత ఏడాదిలోగా ఎయిర్‌పోర్టు నిర్మాణ పనులు పూర్తి చేసి అందుబాటులోకి తీసుకొచ్చేందుకు అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తు్న్నారు.

తెలంగాణలో ప్రస్తుతం శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు ఒక్కటే పౌరులకు సేవలందిస్తోంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ఎయిర్ కనెక్టివిటీ పెంచాలనే లక్ష్యంతో కొత్తగా మరో నాలుగు ఎయిర్‌పోర్టులు ప్రతిపాదించారు. వరంగల్ మామునూరు, రామగుండం, పెద్దపల్లి, కొత్తగూడెంలలో కొత్తగా ఎయిర్‌పోర్టుల నిర్మాణానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సిద్ధమయ్యాయి. ఇందులో వరంగల్ మామునూరు విమానాశ్రయం పనులు చురుగ్గా సాగుతున్నాయి. ఏడాదిలోగా అందుబాటులోకి తీసుకొచ్చేలా ప్రస్తుతం ఈ ఎయిర్‌పోర్టు పనులు జరుగుతున్నాయి.

ప్రస్తుతం ఈ ఎయిర్‌పోర్టు డీపీఆర్‌ సిద్ధంగా కాగా.. అది కేంద్ర ప్రభుత్వ పరిశీలనలో ఉంది. కొద్ది రోజుల్లోనే డీపీఆర్‌కు ఆమోదం లభించే ఛాన్స్ ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. ఆపై ఏడాదిలో పనులు పూర్తి చేసి ఎయిర్‌పోర్టును అందుబాటులోకి తెచ్చేందుకు ఎయిర్‌పోర్ట్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా ప్రణాళికలు రెడీ చేస్తోంది. ఇండిగో, ఎయిర్‌ ఇండియా వంటి పెద్ద పెద్ద విమానాలు ఈజీగా ల్యాండ్ అయ్యేలా రన్‌వేను మూడు కి.మీ.మేర పొడిగిస్తారు. ప్రయాణికుల టెర్మినల్, కార్గో సౌకర్యం, సెక్యూరిటీ వ్యవస్థలు, పార్కింగ్, అనుసంధాన మార్గాలు వంటివి ఎయిర్‌పోర్టులో నిర్మిస్తారు. ఎయిర్‌పోర్ట్‌ అభివృద్ధికి అవసరమైన భూసేకరణను రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే పూర్తి చేసింది. సుమారు 950 ఎకరాల భూమిని ఎయిర్‌పోర్టు నిర్మాణం కోసం కేటాయించారు. ఈ భూమికి అదనంగా మరో 253 ఎకరాలు సేకరించి ఎయిర్‌పోర్టు అథారిటీకి అప్పగించారు.

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

Hyderabad: ఆర్‌ఆర్‌ఆర్‌ ఉత్తర భాగంపై కీలక అప్డేట్.. 2 ప్యాకేజీలుగా మార్పు, టెండర్లకు ఆహ్వానం

రీజినల్ రింగ్ రోడ్డు (ఆర్‌ఆర్‌ఆర్‌) ఉత్తర భాగం పనులపై కీలక అప్డేట్...

ఏపీలో రిలయన్స్‌ డేటాసెంటర్‌.. చంద్రబాబు సర్కార్ భారీ ప్రోత్సాహకాలు, ఏకంగా వేల కోట్లు!

విజయనగరం జిల్లాలో ఏర్పాటు చేయనున్న రిలయన్స్ డేటా సెంటర్‌కు ఏపీ ప్రభుత్వం...

మాట నిలబెట్టుకున్న టీడీపీ ఎమ్మెల్యే గల్లా మాధవి.. పదో తరగతి విద్యార్థులకు విమాన ప్రయాణం

టీడీపీ ఎమ్మెల్యే గల్లా మాధవి.. తాను ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు. కొన్ని...

తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్.. 5 లక్షల బీమా, 2 లక్షల కొత్త ఫించన్లు, ఇంకా మరెన్నో.. రేవంత్ సర్కార్ జూన్ 2 బిగ్ ప్లాన్..!

రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జూన్ 2న ప్రజలకు శుభవార్తలు చెప్పేందుకు...