నల్ల సముద్రంలో కలకలం.. రష్యా చమురుతో ఉన్న టర్కీ ఆయిల్ ట్యాంకర్‌పై దాడి

Date:

ఉక్రెయిన్‌, రష్యాల మధ్య నాలుగేళ్లకుపైగా యుద్ధం కొనసాగుతోంది. ఈ సంఘర్షణను ముగించేందుకు ప్రయత్నాలు చేస్తున్న ట్రంప్.. ఇజ్రాయెల్ ఒత్తిడితో ఇరాన్‌పై యుద్దం ప్రారంభించారు. దీంతో ప్రపంచంలో చమురు సంక్షోభం మొదలయ్యింది. ఇలాంటి తరుణంలో నల్ల సముద్రంలోనూ అలజడి రేగింది. రష్యా ఆయిల్‌ను నింపుకున్న ఓ విదేశీ ట్యాంకర్‌పై గురువారం దాడి జరిగింది. టర్కీ సంస్థ ఆధ్వర్యంలోని ఈ విదేశీ జెండా నౌకపై దాడి జరిగిన విషయాన్ని ఆ దేశ అధికారులు వెల్లడించారు.

పశ్చిమాసియా యుద్ధంతో చమురు, గ్యాస్ సంక్షోభం ఆందోళనకు గురిచేస్తోంది. ఇదిలా ఉండగా నల్ల సముద్రంలో టర్కీ ట్యాంకర్‌ గురువారం ఉదయం దాడికి గురయ్యింది. రష్యా చమురుతో ఉన్న నౌకపై మానవరహిత వాహనంతో దాడి జరిగినట్టు టర్కీ రవాణా మంత్రి అబ్దుల్‌కాదిర్ ఉరలోగ్లూ తెలిపారు. ‘‘రష్యా ముడి చమురుతో ఉన్న ఓ టర్కీ సంస్థ నిర్వహించే విదేశీ జెండా నౌకలో అర్ధరాత్రి దాటిన తర్వాత ఇంజిన్ గదిలో పేలుడు సంభవించినట్లు మా అత్యవసర సేవల కేంద్రానికి సమాచారం అందింది’’ అని ఆ మంత్రి ఒక టీవీ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు.

ప్రత్యేకంగా ఇంజిన్ రూమ్‌నే లక్ష్యంగా చేసుకున్నారని మేము నమ్ముతున్నాం… డ్రోన్‌తో కాకుండా నీటి మట్టంలో ఉన్న మానవరహిత ఉపరితల వాహనంతో ఈ దాడి జరిగిందని మేము భావిస్తున్నాం’’ అని వివరించారు. సియెర్రా లియోన్ జెండా ఉన్న ట్యాంకర్‌పై దాడి టర్కీ జలాల్లో జరిగిందా లేదా అనే విషయాన్ని మంత్రి స్పష్టం చేయలేదు. కానీ బోస్ఫరస్ జలసంధికి 30 కిలోమీటర్లలోపే ఈ దాడి జరిగిందని స్థానిక మీడియా నివేదించింది.

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

Hyderabad: ఆర్‌ఆర్‌ఆర్‌ ఉత్తర భాగంపై కీలక అప్డేట్.. 2 ప్యాకేజీలుగా మార్పు, టెండర్లకు ఆహ్వానం

రీజినల్ రింగ్ రోడ్డు (ఆర్‌ఆర్‌ఆర్‌) ఉత్తర భాగం పనులపై కీలక అప్డేట్...

ఏపీలో రిలయన్స్‌ డేటాసెంటర్‌.. చంద్రబాబు సర్కార్ భారీ ప్రోత్సాహకాలు, ఏకంగా వేల కోట్లు!

విజయనగరం జిల్లాలో ఏర్పాటు చేయనున్న రిలయన్స్ డేటా సెంటర్‌కు ఏపీ ప్రభుత్వం...

మాట నిలబెట్టుకున్న టీడీపీ ఎమ్మెల్యే గల్లా మాధవి.. పదో తరగతి విద్యార్థులకు విమాన ప్రయాణం

టీడీపీ ఎమ్మెల్యే గల్లా మాధవి.. తాను ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు. కొన్ని...

తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్.. 5 లక్షల బీమా, 2 లక్షల కొత్త ఫించన్లు, ఇంకా మరెన్నో.. రేవంత్ సర్కార్ జూన్ 2 బిగ్ ప్లాన్..!

రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జూన్ 2న ప్రజలకు శుభవార్తలు చెప్పేందుకు...