WITT Summit 2026: యుద్ధం ఆగాలంటే ఆదొక్కటే మార్గం- ఇరాన్ ప్రతినిధి ఇలాహీ కీలక వ్యాఖ్యలు

Date:

టీవీ9 భారత్‌వర్ష్ నిర్వహించిన ‘వాట్ ఇండియా థింక్స్ టుడే’ కార్యక్రమంలో ఇరాన్- ఇజ్రాయెల్- అమెరికా యుద్ధంపై ఇరాన్ ప్రతినిధి ఇలాహీ కీలక వ్యాఖ్యలు చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. ఇరాన్ ఎప్పుడూ యుద్ధాన్ని ప్రారంభించలేదని, అది తమపై బలవంతంగా రుద్దబడిందని పేర్కొన్నారు. తాము శాంతిని కోరుకుంటున్నామని. కానీ యుద్ధాన్ని ప్రారంభించింది అమెరికా, ఇజ్రాయెల్‌లే అన్నారు. యుద్ధాన్ని వారే ప్రారంభించారు కాబట్టి దాన్ని ముగించాల్సింది కూడా వారేనని ఆయన స్పష్టం చేశారు. ఇరాన్ కేవలం తన ఆత్మగౌరవం కోసం, న్యాయం కోసం పోరాడుతోందని చెప్పుకొచ్చారు.

ఇరాన్- ఇజ్రాయెల్ మధ్య కాల్పుల విమరమణకు వైట్ హౌట్ ప్రయత్నాలు చేస్తున్న తరుణంలో యుద్దాన్ని ఎలా ముంగిచాలనే అంశంపై ఇరాన్ సర్వోన్నత నాయకుడు మొజ్తబా ఖమేనీ ప్రతిని టీవీ9 భారత్‌వర్ష్‌తో మాట్లాడారు. టీవీ9 భారత్‌వర్ష్‌తో నిర్వహించిన వాట్ ఇండియా థింక్స్ టుడే అనే కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ. అమెరికాను నమ్మలేమని. దాని చరిత్ర అంతా కలంకితమైందన్నారు. ఇరాన్‌పై దాడులు ఆగనంత వరకు యుద్ధం ముగియదని. ఇజ్రాయెల్, అమెరికా దాడులు ఆపితేనే ఇరాన్ కూడా వెనక్కి తగ్గుతుందన్నారు.

ఒక బలమైన దేశం ఒక బలహీన దేశంపై దాడి చేయడం ఎలా సాధ్యం? ప్రపంచం దీనిని ఎందుకు గమనించడం లేదు? మేము కేవలం ప్రతీకారం తీర్చుకున్నాము. మేము ఒక్క అమాయకుడి రక్తాన్ని కూడా చిందించలేదు అని ఆయన అన్నారు. మొత్తం ప్రపంచానికి శాంతి అత్యవసరమని. మేము మొత్తం మధ్యప్రాచ్యంలో శాంతిని కోరుకుంటున్నామన్నారు. ఇందులో లెబనాన్, గాజాతో పాటు సిరియా కూడా ఉండాలన్నారు. దాని భూభాగాన్ని ఎవరు ఆక్రమించారనే దానిపై మనం చర్చించాలన్నారు.

మధ్యప్రాచ్యంలో శాంతి నెలకొనాలంటే ప్రపంచ దేశాలన్నీ అమెరికాపై ఒత్తిడి తీసుకురావాలని ఇలాహీ సూచించారు. భవిష్యత్తులో ఇరాన్‌పై ఎలాంటి దాడులు జరగవని హామీ ఇవ్వాలని. అమెరికా, ఇజ్రాయెల్ దాడుల్లో ధ్వంసమైన పాఠశాలలు, ఆసుపత్రులకు నష్టపరిహారం చెల్లించాలన్నారు. ఇరాన్ తన గౌరవం విషయంలో ఎప్పుడూ రాజీ పడదని. ఒక స్వతంత్ర దేశం తన రక్షణ కోసం ఏం చేయాలో అదే చేస్తామని ఆయన స్పష్టం చేశారు.

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

హైడ్రా భారీ ఆపరేషన్‌.. రూ.15 వేల కోట్ల 863 ఎకరాల రక్షణకు చర్యలు.. 6 అంతస్తుల బిల్డింగ్ కూల్చివేత

హైదరాబాద్‌లో హైడ్రా అధికారులు మరో భారీ ఆపరేషన్ చేపట్టారు. ఏకంగా రూ.15...

తిరుమలలో రికార్డు స్థాయిలో పెరిగిన లడ్డూ ప్రసాదం విక్రయాలు.. ఏడాదిలో ఎన్నో తెలుసా!

తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదాల అమ్మకాలు రికార్డు స్థాయిలో పెరిగాయి. 2025-2026కు...

అమరావతి ఔటర్ రింగ్ రోడ్డులో 19 చోట్ల ఇంటర్‌ఛేంజ్‌లు.. ఎక్కడెక్కడ వస్తాయంటే!

ఏపీ రాజధాని అమరావతి ఔటర్ రింగ్ రోడ్డులో 19 ఇంటర్‌ఛేంజ్‌లు ప్లాన్...

ఉద్యోగులకు మళ్లీ నిరాశే.. జీపీఎఫ్ వడ్డీ రేట్లు ప్రకటన.. ఇప్పుడు ఎంత శాతమంటే

కేంద్ర ప్రభుత్వం ఇటీవల స్మాల్ సేవింగ్స్ స్కీమ్స్ వడ్డీ రేట్లను సవరించిన...