ఇంటి నుంచి పిలిచి.. వెంటాడి వేటాడారు.. సుహాస్ మృతి కేసులో వెలుగులోకి భయంకర నిజాలు..!

Date:

రంగారెడ్డి జిల్లా హయత్‌నగర్ పరిధిలోని పసుమాములలో రెండు రోజుల క్రితం జరిగిన యువకుడు సుహాస్ అనుమానాస్పద మృతి కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. మొదట అనుమానాస్పద మృతిగా నమోదైన ఈ కేసును.. పోలీసులు ప్రస్తుతం హత్య కేసుగా మార్చి దర్యాప్తు ముమ్మరం చేశారు. ఇందుకు సంబంధించి అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు.

రంగారెడ్డి జిల్లా హయత్‌నగర్ పరిధిలోని పసుమాములలో రెండు రోజుల క్రితం జరిగిన యువకుడు సుహాస్ అనుమానాస్పద మృతి కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. మొదట అనుమానాస్పద మృతిగా నమోదైన ఈ కేసును.. పోలీసులు ప్రస్తుతం హత్య కేసుగా మార్చి దర్యాప్తు ముమ్మరం చేశారు. ఇందుకు సంబంధించి అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు.

పోలీసుల సమాచారం ప్రకారం.. అర్థరాత్రి దాటిన తర్వాత స్నేహితులే సుహాస్‌ను ఇంటి నుంచి పిలుచుకుని వెళ్లారు. ఆ తర్వాత అతను తిరిగి రాలేదు. ఒక యువతికి సంబంధించిన వ్యవహారం, అలాగే పాత ఆర్థిక వివాదాలే ఈ హత్యకు కారణమై ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. నిందితులు సుహాస్‌ను గ్రామ శివారులోకి తీసుకెళ్లి విచక్షణారహితంగా దాడి చేసినట్లు తెలుస్తోంది. వారి బారి నుంచి తప్పించుకునేందుకు సుహాస్ పరుగు తీసినప్పటికీ, నిందితులు వెంటాడి మరీ పట్టుకుని దారుణంగా హత్య చేసినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

అనంతరం ఆధారాలు దొరక్కుండా ఉండేందుకు మృతదేహాన్ని స్థానిక శ్మశానవాటిక సమీపంలో పడేసి వెళ్లినట్లు పోలీసులు తెలిపారు. ఈ దారుణానికి ఒడిగట్టినట్లు భావిస్తున్న కొందరు అనుమానితులను పోలీసులు ఇప్పటికే అదుపులోకి తీసుకుని రహస్య ప్రాంతంలో విచారిస్తున్నారు. స్నేహితులే ప్రాణాలు తీశారనే వార్త స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది.

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

Hyderabad: అయ్యో ఏమైంది తల్లి.. వారం క్రితమే బెంగళూరు నుంచి వచ్చింది.. ఇంతలోనే..

బెంగళూరులో పీజీ మెడిసిన్ చదువుతున్న 26 ఏళ్ల దీక్షిత హైదరాబాద్‌లోని నాగారం...

హైదరాబాద్ వాహనదారులకు గుడ్‌న్యూస్.. రూ.345 కోట్లతో కొత్త ఫ్లైఓవర్, ఈ ఏరియాలో ట్రాఫిక్ కష్టాలకు చెక్

హైదరాబాద్ ఓల్డ్ సిటీలో ట్రాఫిక్ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపడానికి జీహెచ్‌ఎంసీ...

ప్రతి నీటి బొట్టునూ స‌ద్వినియోగం చేసుకోవాలి.. అధికారులకు మంత్రి నిమ్మల సూచన

అమరావతి, జులై 25: రైతుల‌ ప్రయోజనాలను ర‌క్షించేందుకు ఇరిగేష‌న్, రెవెన్యూ అధికారులు...

సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కేకు టైఫాయిడ్..

కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే అనారోగ్యానికి గురయ్యారు....