రూ. 3 కోట్లు దాటని మూవీకిరూ. 25 కోట్ల పోస్టరా?… లెజెండ్ శరవణన్ ‘లీడర్’ వసూళ్ల మాయాజాలం

Date:

ప్రముఖ వ్యాపారవేత్త ‘లెజెండ్’ శరవణన్ నటించిన తాజా చిత్రం ‘లీడర్’ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వివాదంలో చిక్కుకుంది. ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం ఈ సినిమా మొదటి వీకెండ్‌లో కేవలం రూ. 3 నుండి 3.5 కోట్లు మాత్రమే వసూలు చేయగా, చిత్ర యూనిట్ మాత్రం ఏకంగా రూ. 25 కోట్లు సాధించినట్లు పోస్టర్ విడుదల చేయడం చర్చనీయాంశమైంది. అంతేకాకుండా రూ. 100 కోట్ల వైపు పరుగులు తీస్తోందని పేర్కొనడంతో నెటిజన్లు సోషల్ మీడియాలో ట్రోల్స్ వర్షం కురిపిస్తున్నారు.

తమిళ చిత్ర పరిశ్రమలో తనకంటూ ఒక ప్రత్యేక ముద్ర వేయాలని ఆరాటపడుతోన్న ప్రముఖ వ్యాపారవేత్త ‘లెజెండ్’ శరవణన్ దాదాపు నాలుగేళ్ల విరామం తర్వాత మళ్లీ ప్రేక్షకుల ముందుకు వచ్చారు. తన మొదటి సినిమా ‘ది లెజెండ్’ ఆశించిన విజయం సాధించకపోయినా పట్టు వదలకుండా భారీ బడ్జెట్‌తో ‘లీడర్’ అనే స్పై యాక్షన్ థ్రిల్లర్‌ను రూపొందించారు. ఆర్‌ఎస్‌ దురై సెంథిల్‌ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఏప్రిల్ 3న విడుదలైంది. అయితే, ఇప్పుడు ఈ సినిమా కంటెంట్ కంటే, మేకర్స్ విడుదల చేసిన వసూళ్ల పోస్టర్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.

కోలీవుడ్ మరియు టాలీవుడ్ ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం.. ‘లీడర్’ సినిమా మొదటి వీకెండ్‌లో ప్రపంచవ్యాప్తంగా కేవలం రూ. 3 కోట్ల నుంచి రూ. 3.5 కోట్ల గ్రాస్ వసూళ్లను మాత్రమే సాధించింది. థియేటర్లలో ఆక్యుపెన్సీ చాలా తక్కువగా ఉండటం, టాక్ ఆశించిన స్థాయిలో లేకపోవడంతో ఈ లెక్కలు వాస్తవానికి దగ్గరగా ఉన్నాయి. కానీ చిత్ర యూనిట్ మాత్రం అందరినీ విస్మయానికి గురిచేస్తూ ఒక అధికారిక పోస్టర్‌ను విడుదల చేసింది. అందులో ఈ సినిమా వీకెండ్‌లోనే రూ. 25 కోట్లు వసూలు చేసిందని, అంతేకాకుండా రూ. 100 కోట్ల మార్క్ వైపు పరుగులు తీస్తోందని పేర్కొన్నారు. అసలు రూ. 3 కోట్లు రావడమే గగనంగా ఉన్న తరుణంలో, ఏకంగా రూ. 25 కోట్లు అని ప్రకటించడంపై సినీ విశ్లేషకులు ముక్కున వేలేసుకుంటున్నారు.

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

UPI Payments: యూపీఐ వాడేవారికి షాకిచ్చే న్యూస్.. ఉచిత సేవలు బంద్..! ట్రాన్సాక్షన్ చేయాలంటే ఛార్జీలు కట్టాల్సిందే..

యూపీఐ లావాదేవీలు చేస్తున్నారా..? అయితే త్వరలో లావాదేవీలకు ఛార్జీలు కట్టాల్సి ఉంటుంది....

ఏపీలో మళ్లీ కరోనా కలకలం.. పూణే ల్యాబ్‌కు శాంపిల్స్.. మొత్తం ఎన్ని కేసులు ఉన్నాయంటే..

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులు మళ్లీ వెలుగుచూస్తుండటంతో ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది. జూన్...

ఆరుగురిని చంపిన హంత‌కుడికి అనాథ‌లా అంత్య‌క్రియ‌లు.. కుటుంబ సభ్యులు వద్దనడంతో.. ఎవరు చేశారంటే?

తెలంగాణ రాష్ట్రం మొత్తాన్ని ఉలిక్కిపడేలా చేస్తూ ఆరుగురుని అతికిరాతకంగా చంపిన కిరాతక...

సీఎం రేవంత్ రెడ్డికి రెండు నియోజకవర్గాల్లో ఓటు హక్కు.. ఏడాది జైలుశిక్ష పడే అవకాశం ఉందా?

రాష్ట్రంలో నిబంధనలను పటిష్టంగా అమలు చేయాల్సిన ముఖ్యమంత్రి స్థానంలో ఉండి కూడా.....