చాలా బాధాకరం.. మీ తల్లిగారి ఆత్మకు శాంతి చేకూరాలి’.. పవన్ ఎమోషనల్ పోస్ట్

Date:

నటుడు ప్రకాశ్ రాజ్ మాతృమూర్తి సువర్ణలత (86) బెంగళూరులో కన్నుమూశారు. ఈ విషాద వార్తపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్పందిస్తూ తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. సువర్ణలత గారి ఆత్మకు శాంతి చేకూరాలని ఆయన ప్రార్థించారు . తిరుమల లడ్డూ వివాదం , సనాతన ధర్మం వంటి అంశాలపై వీరిద్దరి మధ్య తీవ్రమైన రాజకీయ విభేదాలు ఉన్నప్పటికీ , వ్యక్తిగత విషాద సమయంలో పవన్ స్పందించడం విశేషం.

విలక్షణ నటుడు ప్రకాశ్ రాజ్ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. ఆయన మాతృమూర్తి సువర్ణలత (86) సోమవారం ఉదయం బెంగళూరులోని తన స్వగృహంలో కన్నుమూశారు. గత కొంతకాలంగా వయోసహజ అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆమె, పరిస్థితి విషమించడంతో తుది శ్వాస విడిచారు. తల్లితో ఎంతో గాఢమైన అనుబంధం ఉన్న ప్రకాశ్ రాజ్, షూటింగ్స్ బిజీలో ఉన్నా తరచూ ఆమెను కలుస్తూ ఉండేవారు. మరణవార్త తెలియగానే ఆయన వెంటనే బెంగళూరు చేరుకున్నారు. సోమవారం సాయంత్రం బెంగళూరులోనే ఆమె అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.

ప్రకాశ్ రాజ్ మాతృమూర్తి మరణంపై ఏపీ ఉప ముఖ్యమంత్రి, జనసేనాని పవన్ కల్యాణ్ సోషల్‌మీడియా వేదికగా స్పందించారు. “ప్రముఖ నటుడు శ్రీ ప్రకాశ్ రాజ్ గారి మాతృమూర్తి శ్రీమతి సువర్ణలత గారు కన్నుమూశారని తెలిసి చింతించాను. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను. మాతృ వియోగానికి లోనైన శ్రీ ప్రకాశ్ రాజ్ గారికి, ఆయన కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను” అంటూ పవన్ తన సందేశాన్ని పంచుకున్నారు. రాజకీయంగా వీరిద్దరి మధ్య ఎన్ని విభేదాలు ఉన్నప్పటికీ, ఒక వ్యక్తిగత విషాద సమయంలో పవన్ స్పందించిన తీరు చర్చనీయాంశమైంది.

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

Hyderabad: ఆర్‌ఆర్‌ఆర్‌ ఉత్తర భాగంపై కీలక అప్డేట్.. 2 ప్యాకేజీలుగా మార్పు, టెండర్లకు ఆహ్వానం

రీజినల్ రింగ్ రోడ్డు (ఆర్‌ఆర్‌ఆర్‌) ఉత్తర భాగం పనులపై కీలక అప్డేట్...

ఏపీలో రిలయన్స్‌ డేటాసెంటర్‌.. చంద్రబాబు సర్కార్ భారీ ప్రోత్సాహకాలు, ఏకంగా వేల కోట్లు!

విజయనగరం జిల్లాలో ఏర్పాటు చేయనున్న రిలయన్స్ డేటా సెంటర్‌కు ఏపీ ప్రభుత్వం...

మాట నిలబెట్టుకున్న టీడీపీ ఎమ్మెల్యే గల్లా మాధవి.. పదో తరగతి విద్యార్థులకు విమాన ప్రయాణం

టీడీపీ ఎమ్మెల్యే గల్లా మాధవి.. తాను ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు. కొన్ని...

తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్.. 5 లక్షల బీమా, 2 లక్షల కొత్త ఫించన్లు, ఇంకా మరెన్నో.. రేవంత్ సర్కార్ జూన్ 2 బిగ్ ప్లాన్..!

రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జూన్ 2న ప్రజలకు శుభవార్తలు చెప్పేందుకు...