Telangana News: మహిళలకు తెలంగాణ ప్రభుత్వం మరో శుభవార్త.. కొత్త కార్యక్రమానికి శ్రీకారం.

Date:

తెలంగాణలోని మహిళలకు శుభవార్త. రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. మహిళా సంఘాలకు ఫెర్టిలైజర్ లైసెన్సులు అందించనుంది. గ్రామాల్లోని మహిళలను ఎంపిక చేసి ఎరువులు సరఫరా చేసే బాధ్యతలను అప్పగించనుంది. ఈ కార్యక్రమం అమలు కోసం ప్రణాళికలు రచిస్తోంది.

తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మహిళా సంఘాలను ఆర్ధికంగా బలోపేతం చేసేందుకు మరో కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. మహిళా సంఘాలకు ఎరువుల పంపిణీ బాధ్యతలను అప్పగించనుంది. రైతులకు ఎరువులు సరఫరా చేసే బాధ్యతలను మహిళా సంఘాలకు అప్పగించనుంది. ఈ మేరకు గ్రామీణ ప్రాంతాల్లో చురుగ్గా ఉన్న మహిళా సంఘాలను గుర్తించనుంది

వీరికి ఫెర్టిలైజర్ లైసెన్సులు అందించనుంది. రాష్ట్రంలో దాదాపు 4.67 లక్షల మహిళా సంఘాలు ఉన్నాయి. వీరిలో కొంతమందిని ఎంపిక చేసిన లైసెన్స్ అందించనున్నారు. అలాగే వీరికి యూరియా యాప్ వినియోగంపై ట్రైనింగ్ కూడా ఇవ్వనున్నారు. మహిళా సంఘాల కోసం 8,126 సొంత భవనాలను నిర్మించేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్దమవుతోంది. ఈ కేంద్రాల్లోనే ఎరువులు నిల్వ చేసుకునేలా ఏర్పాట్లు చేయనున్నారు.

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

Hyderabad: అయ్యో ఏమైంది తల్లి.. వారం క్రితమే బెంగళూరు నుంచి వచ్చింది.. ఇంతలోనే..

బెంగళూరులో పీజీ మెడిసిన్ చదువుతున్న 26 ఏళ్ల దీక్షిత హైదరాబాద్‌లోని నాగారం...

హైదరాబాద్ వాహనదారులకు గుడ్‌న్యూస్.. రూ.345 కోట్లతో కొత్త ఫ్లైఓవర్, ఈ ఏరియాలో ట్రాఫిక్ కష్టాలకు చెక్

హైదరాబాద్ ఓల్డ్ సిటీలో ట్రాఫిక్ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపడానికి జీహెచ్‌ఎంసీ...

ప్రతి నీటి బొట్టునూ స‌ద్వినియోగం చేసుకోవాలి.. అధికారులకు మంత్రి నిమ్మల సూచన

అమరావతి, జులై 25: రైతుల‌ ప్రయోజనాలను ర‌క్షించేందుకు ఇరిగేష‌న్, రెవెన్యూ అధికారులు...

సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కేకు టైఫాయిడ్..

కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే అనారోగ్యానికి గురయ్యారు....